పైడిపల్లి నర్సింగ్ ఖబడ్దార్ బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు.
మందమర్రి నేటి ధాత్రి:
మందమర్రి స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు సకినాలశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, గౌరవ అధ్యక్షులు పోల్ శ్రీనివాస్, మందమర్రి పట్టణ యువజన అధ్యక్షుడు మూడారపు శేఖర్, లు మాట్లాడుతూ గత వారం రోజుల క్రిందట బీసీలపై మాల సంఘం పైడిమల్ల నర్సింగ్ బీసీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని వారు కోరారు రాబోయే రోజుల్లో క్షమాపణ చెప్పినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాటికి పూర్తి బాధ్యత పైడిమల్ల నర్సింగ్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. అసలు ఏ పార్టీలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు కుల ఘననకు అనుకూలంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని కాదని బీసీల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఇలాంటి వాక్యాలు చేయడం సిగ్గుచేటు అన్నారు అసలు మాల l సంఘంలో ఎవరికి ఏం పోస్టు ఉందో కూడా తెలియకుండా ఆ సంఘ సభ్యుల కు అర్థం కాకుండా ఉంది అన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఇలాంటి వాక్యాలు చేయడం సరైనది కాదన్నారు బే షరతుగా క్షమాపణ చెప్పి తీరాలని వారి కోరారు ఈ కార్యక్రమంలో రామస్వామి శేఖర్. బేరా వేణుగోపాలరావు. దేవరపల్లి ప్రభాకర్. పోల్ సంపత్. మునిసెట్టి సత్యనారాయణ. మాడకుండా శంకర్. తదితరులు పాల్గొన్నారు