గంగాధర నేటిధాత్రి :
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన పెద్ద మనసును చాటుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి సొంత ఖర్చుతో నాణ్యమైన అల్పాహారం, సాయంత్రం 10 తరగతి స్నాక్స్ అందించాలని నిర్ణయించుకున్నారు.
చొప్పదండి నియోజకవర్గం లోని 200 మంది పైబడి విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు ఉదయం నాణ్యమైన అల్పాహారం, సాయంత్రం 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందజేయనున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా గంగాధర మండలం గర్షకుర్తి ప్రభుత్వ పాఠశాలను ప్రకటించారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, చొప్పదండి నియోజకవర్గం ప్రజల నుండి అభినందనలు వెలువెత్తుతున్నాయి.
నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.