ఈదురు గాలుల బీభత్సానికి మార్కెట్ షెడ్ పైకప్పు ధ్వంసం
మొగుళ్లపల్లి నేటి దాత్రి
మండలంలోని పర్లపల్లి గ్రామంలో. ఆదివారంవారం అర్ధరాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించడంతో. కూరగాయల మార్కెట్ షెడ్లు పైకప్పు కూలిపోవడం జరిగింది. ప్రజల అవసరాల మేరకు షెడ్డు మల్లి నిర్మానించాలని మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య అన్నారు. ప్రజల అవసరాల కోసం వారసంతపు సంత ప్రతి బుధవారం కూరగాయలు కొనుగోలు నిర్వహించడం జరిగేదని, ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో గాలులు రావడంతో ద్వారంతో పాటు 15 షెడ్లు పై కప్పులు కూలిపోవడం జరిగిందని. ఎన్.ఆర్.ఇ.జి ఎస్ ద్వారా మార్కెట్ షెడ్లు నిర్మించడం జరిగిందని. దాని విలువ ఐదు లక్షలు అవుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి. గ్రామప్రజల అవసరాల దృష్ట్యా మళ్ళీ మార్కెట్ షెడ్లు పైకప్పులు పునర్నిర్మానం చేయాలని ఆయన కోరారు.