నడి కూడ,నేటి ధాత్రి:
పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘం జేఏసీ వైస్ చైర్మన్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ పాల్గొని 5 మండలాల కమిటీలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా సాంబయ్య గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 66 సంవత్సరాల నుండి గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో పోట్లాడి అర్రాజు,మైబూజ్ సిస్థు లను రద్దు చేయించిందని, పెన్షన్ మొదలగు సంక్షేమ పథకాలు గీత కార్మికులకు చెందే విధంగా పోట్లాడుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా పరకాల,నడికూడ, దామెర, కుటుంబ సభ్యులకు శాయంపేట, ఆత్మకూరు మండలాల కమిటీని వేశారు.నడికూడ మండల అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా మండ రాందాస్ గౌడ్,ఉపాధ్యక్షులు తాళ్లపల్లి సతీష్ గౌడ్, పులి సతీష్ గౌడ్, పబ్బ రవీందర్ గౌడ్, కార్యదర్శిగా మేటపోతుల శ్రీధర్ గౌడ్ లను ఏకగ్రీవం గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బిక్షపతి, కాజీపేట మండలం అధ్యక్షుడు మోడం రాజేందర్, కమలాపూర్ మండల అధ్యక్షుడు మార్క అశోక్ తదితరులు పాల్గొన్నారు.