మూడోవ సారి ప్రధానిగా మోడీని గెలిపించండి

బిజెపి మండల అధ్యక్షుడు దుగుట రాజ్ కుమార్

జైపూర్, నేటి,ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వా,జైపూర్ గ్రామాలలో బుధవారం రోజున బిజెపి మండల అధ్యక్షుడు దుగుట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాసుని లక్ష కోట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. ప్రతి గ్రామం లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గా ఉండి తీస్కోచ్చారు. బిజెపి కి ఓటు వేసి గెలిపిచల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. మరియు నూతనంగా జైపూర్ మండల అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన దుగుట రాజ్ కుమార్ ను జైపూర్ మండలంలోని అన్ని గ్రామాల బూత్ స్థాయి అధ్యక్షులు బిజెపి పార్టీ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంతోష్,తిరుపతి గౌడ్,మల్లేష్, వెంకటేష్ ,కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *