Senior Congress Leaders Join BRS in Ainavolu
కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు
ఎర్రబెల్లి సమక్షంలో గులాబీ గూటికి సీనియర్ నాయకులు
స్థానిక ఎన్నికల వేళ అయినవోలులో కాంగ్రెస్ పార్టీకి షాక్
నేటి ధాత్రి అయినవోలు:-
స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అయినవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శుక్రవారం ఐనవోలు గ్రామం నుంచి కాంగ్రెస్ నుండి భారీగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సీనియర్ నాయకులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో చింత అశోక్ (మాజీ వార్డు మెంబెర్ ఎం. ఆర్.పి.ఎస్ మాజీ మండల అధ్యక్షులు)మోలుగురి బాబు (మాజీ సొసైటీ డైరెక్టర్)
బరిగల ఈసాక్ (మాజీ వార్డు మెంబెర్)కొత్తూరి జాన్సన్ (మాజీ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి)
చింత రఘు (మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు)సీనియర్ నాయకులు కొత్తూరి కర్రె కొమురయ్య, మోలుగురి లచ్చయ్య,చింత రాములు మంద రాజు మొదలగు వారు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అయినవోలు మండలంలో ఉన్న కీలక నేతకు అనుచర వర్గాలుగా ఉన్నవారే ఎక్కువగా ఉండడం విశేషం..
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తంపుల మోహన్ మండల ఇంచార్జ్ పోలేపల్లి రాంమూర్తి
మాజీ సర్పంచులు ఉస్మాన్ ఆలీ, పల్లకొండ సురేష్ సీనియర్ నాయకులు తీగల లక్ష్మణ్ గౌడ్
గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుప్పెలి రాజు తదితరులు పాల్గొన్నారు
