దసరాకు.. ముక్కా, సుక్కా.. లేనట్లే..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T114708.207.wav?_=1

 

దసరాకు.. ముక్కా, సుక్కా.. లేనట్లే..!

గాంధీ జయంతి నాడే దసరా పండుగ

◆:-/అందుకే మద్యం, మాంసం అమ్మకాలు బంద్?

◆:- అక్టోబర్ 2న వైన్ షాపుల మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ

◆:- లిక్కర్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం

◆:- గతేడాది దసరా నాడే 3లక్షల కేసులకు పైగా బీర్లు సేల్

◆:- మద్యం అమ్మకాల ద్వారా 11రోజుల్లో రూ.1285.16 కోట్లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణాలో పండుగ, పబ్బం, ఇంట్లో ఫంక్షన్.. బంతి ఏదైనా మాంసం, మందు లేనిదే కిక్కు ఉండదు. ఆద్ ఓ అనవాయితీగా వస్తుంది. ఇక దసరా అంటే సాధా రణంగా ఒక కిక్కు. ఏ పండగకి లేనంతగా దసరా పండుగకు అంత జోష్ ఉంటుంది. ఇదే రోజు చుక్క ముక్క ఉండాల్సిందే. అంతేకాకుండా పల్లె పట్టణం లేకుండా మద్యం ఏరులై పారుతోంది. కుటుంబ సభ్యులంతా మద్యం మత్తును గమ్మత్తుగా ఎంజాయ్ చేస్తుంటారు. మద్యంతోపాటు మటన్, చికెన్, ఫిష్. ఫ్రాన్స్ ఉండాల్సందే. అయితే ఈసారి దసరాకు ముక్క చుక్కపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకే రోజు గాంధీ జయంతి.. దసరా…

అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నాడే దసరా పండగ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం విక్రయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు మూసి వేయడం అనవాయితీ. అయితే అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు. ఆ రోజున చాలా మందికి చుక్క లేనిదే.. ముద్ద తిగదు. అందుకోసం అక్టోబర్ 2న మద్యం, మాంసం విక్రయాలపై అధి కారులు తర్జన భర్జన పడుతున్నారు. అక్టోబరు 2న మద్యం, మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించాలా..? మినహాయింపు ఇవ్వాలా..? అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు..

గతేడాది దసరా కిక్కుకు 1285 కోట్లు…

 

 

దసరా పండక్కి గతే ఏడాది రాష్ట్ర ఖజానకు రూ.1285 కోట్లు వచ్చి చేరాయి. దసరా వేడుకలను పురస్కరించుకొని గత సంవత్సరం అక్టోబర్ | నుంచి 14 వరకూ.. 11 రోజుల్లో ఎక్సైజ్ శాఖకు రూ. 1285.16 కోట్లు వచ్చాయి. వీటిల్లో ఈ 11,03,614 కేసుల లిక్కర్ సీసాలు… 20.63,350 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. పండుగ రోజు అంటే 11వ తేదీన అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,06,761 కేసుల బీర్లను కొనుగోలు చేశారు. ఏ గల్లీలోని కిరాణా కొట్టులో చూసినా లిక్కర్ బాటిళ్లు, బీరు సీసాలే దర్శనమిచ్చాయి. వైన్ షాపుల వద్ద మద్యం ప్రియులు బారులుతీరి పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేశారు. అయితే అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్లు ఎక్సెజ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడవచ్చు. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడే అవకాశం లేకపోలేదు.

మాంసానికి మస్తు గిరాకీ….

 

 

దసరాకి మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే.. గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, మేక పోతులను కోసి వాటాలు వేయాల్సిందే. నాటు కోళ్లు, ఫారం కోళ్లు, చేపలు, రొయ్యలకు సైతం మస్తు గిరాకీ ఉంటోంది. ఇలా ప్రచేస్తున్నార
పండుగ జరుపుకుంటారు. గ్రామాలు, పట్టణాల లోని వ్యాపారస్తులు, దుకాణాదారులు, పెద్ద పెద్ద వాహనాల యాజమానులు దసరా పండుగ సందర్భంగా వారి దుకాణాలు, పరిశ్రమలు వాహనాల ముందు మేక పోతులు, గొర్రె పోతులు బలి ఇవ్వడం అనవాయితీ, ఇందుకోసం పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు, రొయ్యలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. అయితే దసరా ఒక వేల మాంసం దుకాణాలను మూసివేసినట్లయితే ముక్కపై తీవ్ర ప్రభావం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version