మందమర్రి, నేటిధాత్రి:-
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు పట్టణంలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ప్రభుత్వ ఆదర్శ (మోడల్) పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల లలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు మోడల్ స్కూల్లో 289 విద్యార్థులకు గాను 254 మంది విద్యార్థులు, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 322 మంది విద్యార్థులకు గాను 311మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ ను విధించింది. కాగా నేటి నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు మోడల్ పాఠశాలలో 266 మంది విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 278 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షకు హాజరైయ్యే విద్యార్థులకు మొబైల్ ఫోన్స్, తదితర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకు రాకూడదని సూచించారు. నిబంధన అమలులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా సూచించారు.