అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన
చర్యలు తప్పవ్
ఎస్ ఐ నరేష్
ముత్తారం :- నేటి ధాత్రి
తెల్లవారుజామున ముత్తారం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ శివారులో పెద్ది లక్ష్మీరాజం తండ్రి లక్ష్మయ్య ,వయస్సు: 35 సంలు ఖమ్మంపల్లి ప్రాంతంలో ట్రాక్టర్ లో దొంగతనంగా ఇసుక రవాణా చేస్తు ఉండగా పట్టుకోవడం జరిగింది. వెంటనే ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను డ్రైవర్ ను ముత్తారం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి, ట్రాక్టర్ ను సీజ్ చేశారు ఈ విధంగా ఎవరైనా కాని అక్రమంగా ఇసుకను, మట్టి రవాణా చేస్తే చట్ట ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోన బడతయాని
ఎస్ ఐ నరేష్ తెలిపారు