Hearing Begins on Telangana Defected MLAs Case
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. ఎల్లుండి నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది.
హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. ఎల్లుండి నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. ఈనెల 6 నుంచి ఈ కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. 6వ తేదీన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లను విచారించనున్నారు. 13న కామారెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కేసు విచారించనున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించిన విషయం తెలిసిందే.
