Foundation Stones Laid for Development Works
పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల పరిధిలోనీ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. గ్రామాల్లోసీసీ రోడ్లు, వీవో మహిళా సమాఖ్య భవనాలు మరియు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్య క్రమం ఘనంగా నిర్వహించ బడింది.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సంబంధిత అభి వృద్ధి శాఖ అధికారుల సమక్షంలో పనుల శంకు స్థాపన పలకలు ఆవి ష్కరణ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.గ్రామాల్లో రహదారి సౌకర్యాల మెరుగు దల, మహిళా సంఘాల బలోపేతం మరియు విద్యా ర్థులకు సురక్షిత విద్యా వాతా వరణం కల్పించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారు లు సమన్వయంతో పనిచే యాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ,మండల ముఖ్య నాయకులు , సర్పంచులు, ఉపసర్పంచ్ లు , గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘ సభ్యులు,మాజీ ప్రజాప్రతినిధులు మరియు సంబంధితశాఖ అధికారు లు ,కార్యకర్తలు పాల్గొన్నారు
