బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం
నర్సంపేట, నేటిధాత్రి:
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన సంగెపు రాజేంద్రప్రసాద్ ఇటీవల మృతిచెందారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్రెడ్డి సూచన మేరకు ఆయన దశదినకర్మ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వార్డు కౌన్సిలర్ జూలూరి రోజారాణి రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందించారు.ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు తాబేటి క్రాంతికుమార్, సంగెపు శ్రీను, మొగిలిచర్ల సందీప్, బీజేపీ నియోజకవర్గ నాయకుడు జూలూరి మనీష్గౌడ్, బీజేవైఎం కార్యదర్శి చిలువేరు అన్వేష్, వార్డు యువకులు సంగెపు తేజ, సాయి తరుణ్, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
