Employees Submit Memorandum
తాహసిల్దార్ కు వినతిపత్రం అందించిన ఉద్యోగులు
నడికూడ,నేటిధాత్రి:
టి జి ఈ జె ఎ సి పిలుపుమేరకు ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి అని కోరుతూ టిజిఈ జెఎసి నడికూడ మండల శాఖ తహసిల్దార్ రాణి కి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు.జూన్ 2 వరకు పి ఆర్ సి అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను 2 విడతల్లో చెల్లించాలి.మే 1 నుండి హెల్త్ కార్డు అమలు చేయాలి.సిపిఎస్ రద్దు చేసి, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలి.ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి,లంచ్ అవర్స్లో నిరసనలు తెలియజేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి,అచ్చ సుదర్శన్, కట్టుకోజ్వల సతీష్,నూతి వేణుగోపాలస్వామి,రావుల రమేష్,దొంతుల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ రావు,చాడ రమాదేవి,బేబీ రాణి,పల్లె శ్రీనివాస్,గోపి, శ్రీనివాస్,ప్రణతి,రవీందర్, దేవా,రాజకుమార్, రామకృష్ణ,కవిత,ఉమ,జయ, జోష్ణ,సుమలత,శివ చేతన్, సునీత,శారద,నరసింహా రెడ్డి, సత్యపాల్ రాజు నాయక్, రామకృష్ణ,ప్రదీప్,ఆరోగ్యం, రవి కుమార్,పావని విశ్వేశ్వర్, మనోహర్,యుగంధర్, సదానందం,విక్రమ్, భారత్, ప్రేమన్నందం,శంకర్, తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
