ఉద్యమ ఆడబిడ్డను ఆదరించండి

మాస్ సావిత్రి బిఎల్ఎఫ్ పార్లమెంట్ అభ్యర్థి

పరకాల నేటిధాత్రి
వరంగల్ పార్లమెంట్ పరిధిలో అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూ ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న,తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన తనను గెలిపించాలని కామ్రేడ్ కొత్తపల్లి మాస్ సావిత్రి అన్నారు.పరకాల నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను బిఎల్ఎఫ్ బలపర్చిన ఎంసీపీఐ అభ్యర్థి కొత్తపల్లి సావిత్రి మాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. అనంతరం సావిత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా ఎన్నో కేసులు,లాఠీ దెబ్బల కోర్చి ఉద్యమాలు చేసి,నాటి నుండి అనేక ప్రజా సమస్యలపై,సామాజిక అసమానతల పై నిరంతరం ఉద్యమాలు చేసే తనను వరంగల్ ప్రజలు ఆదరించి,కంప్యూటర్ గుర్తు పై ఓటు వేసి ఉద్యమకారురాలైన తనను గెలిపించాలని కోరారు.నిస్వార్థంగా ప్రజా ఉద్యమాలు చేస్తూ పేదల కు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తూ,ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చిన అండగా నిలబడుతూ వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సావిత్రి అన్నారు.ప్రస్తుతం ధనార్జన లక్ష్యంగా ఆస్తులు పెంచుకోవడం,వాటిని దాచుకోవమే లక్ష్యంగా వరంగల్ లో ప్రధాన పార్టీలు వ్యవహారిస్తున్నాయని,అటువంటి పార్టీలకు జ్ఞానవంతమైన వరంగల్ ప్రజలు ఓటు తో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేసే పేదింటి ఆడబిడ్డనైనా తనను గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *