Ambedkar Jayanti Celebrated by Congress
బడుగు వర్గాల ఆత్మ బంధువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్
అణగారిన వర్గాల అభివృ ద్ధికి కృషిచేసిన మహానుభా వుడు
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని ధార పోసిన గొప్ప మహానుభావు డు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షులు బుచ్చిరెడ్డి అన్నారు. 135వ జయంతిని పురస్క రించుకొని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్ర హానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లా డుతూ దేశంలోని పౌరులం దరికీ భారత రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం, స్వేచ్ఛ సమాన హక్కులు కల్పించిన గొప్ప తత్వవేత్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా రిజర్వేషన్ అమలు ప్రక్రియ గాని, పేదల కు సంక్షేమ పథకాలు అంది స్తూ రాజ్యాంగ విలువలను పెంపొందించే విధంగా కృషి చేస్తుందన్నారు. అన్ని రంగా ల్లో వివక్ష రహిత సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్ కొనియాడారు. ప్రపంచంలోనే భారత దేశ పౌరుడు విశ్వవరుడిగా ఎదిగేందుకు దోహదపడేలా రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ గుర్తు చేశారు. ఆశయసాధన కోసం నేటి యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు పోలపల్లిశ్రీనివాస్ రెడ్డి,దుబాసి కృష్ణమూర్తి,పత్తిపాక సర్పంచ్ గజ్జిఐలయ్య,నిమ్మల రమేష్ డిటిరెడ్డి మారేపల్లి కట్టయ్య సాంబయ్య, మాదిరెడ్డి ప్రపం చరెడ్డి, శంకరాచారి వీరన్న, దామ కొండ కొమురయ్య, కుమారస్వామి పాల్గొన్నారు.
