దళిత రత్న గ్రహీత రత్నంకు ఘన సన్మానం

దళిత రత్న అవార్డు గ్రహీత రత్నం కు ఘనసన్మానం.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన పరికిరత్నం కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతిలో సమాజ సేవకులైన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సామాజి క ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న పరికి రత్నంకు రాష్ట్ర ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ కనకరాజు, ఇటుక రాజ్ కుమార్ చేతుల మీదుగా దళిత రత్నఅవార్డు తీసుకోవడం చాలా సంతోషకరమని డిటి ఎఫ్ మండల అధ్యక్షుడు కందుల గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు దళిత విద్యావంతుల వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవార్డు గ్రహీత ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక ఉద్యమాల కార్యక్రమాలలో ఎంతోమందికి చేయూతనిస్తూ గత 30 సంవత్సరాలు నుండి సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న రత్నంకు అరుదైన గౌరవం దక్కడం శుభసూచకమని. రాష్ట్ర స్థాయి లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు సాధించి మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించాలని. ఉన్నత విద్యలు అభ్యసించినటువంటి సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి సమాజ సేవకులు నిత్యం సమాజానికి సేవలు అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, విహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు పులి రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ బొట్ల దయాకర్ మాదిగ, రాజశేఖర్, సిహెచ్ ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version