ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస
పార్టీకి మచ్చ తెస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యుల తీరు
లబ్ధిదారుల్ని ఎంపిక చేయమంటే వాళ్లే లబ్ధిదారులైన వైనం.
లబ్ధిదారులు ఎంపికపై సొంత పార్టీ నాయకులే విమర్శ
గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందించిన అఖిలపక్ష నాయకులు
నేటి ధాత్రి ఐనఓలు:-
ఐనవోలు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అర్హులైన లబ్ధిదారుల కంటే ఇందిరమ్మ కమిటీ సభ్యుల యొక్క సిఫారసులే ఎక్కువ ఉన్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు. శుక్రవారం అయినవోలు గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యలు మరియు కాంగ్రెస్ నాయకులు వారి ఇష్ట నుసారంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించుకొని నిజమైన అర్హులను మోసం చేశారని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఆదికారుల నుంచి స్పందన కరువైందని ఆరోపించారు.
అఖిలపక్ష నాయకులు అందరు గ్రామ కార్యదర్శి కి ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు అందించాలని వినతిపత్రం అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి, ధర్మసామాజ్, ఎంఆర్పిఎస్ నాయకులు మరియు ఇందిరమ్మ ఇండ్ల ఆశవహులు పాల్గొన్నారు బిఆర్ఎస్ నుంచి టి. కుమార్. కె. అశోక్, గడ్డం రఘువంశీ, టి లక్ష్మణ్,దుపెల్లి రాజు, నాగరాజు, చందు,సంతోష్, సమ్మయ్య, రవి కాంగ్రెస్ నుంచి కొత్తూరి రాజు, కొండేటి దిలీప్, టి ప్రశాంత్, ఏలీయా, కుమార్, అనిల్
బీజేపీ నుంచి బొల్లెపెల్లి మహేష్, పులి సాగర్, బిఎస్పి నుంచి సామ్యాల్ ధర్మసామాజ్ నుంచి విష్ణువర్ధన్ ఎంఆర్పిస్ నుంచి చింత అశోక్ తదితరులు పాల్గొన్నారు..