కాంగ్రెస్ నుండి బిఅర్ఎస్ లోకి భారీ చేరికలు
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యకాంతర ఆధ్వర్యంలో భారీగా చేరికలు
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం నర్సింగపురం తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాదావత్ తిరుపతి నాయక్ నాయకత్వంలో నర్సింగపురం తండా నుండి 100, పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం నుండి 50 మంది, దుబ్బ తండా (బమ్మెర) నుండి 50 మంది మొత్తం 200 మంది బానోత్ సురేష్ నాయక్, తుడి ఉపేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి బిఅర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. సీఎం కెసిఆర్ మరోసారి అధికారం లోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలి అని మంత్రి ఎర్రబెల్లి వారితో అన్నారు.