`బొరియల్లో దాక్కున్న ఎలుకలు పిల్లులైతున్నాయ్?
`పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపోదు!
`తెలంగాణపై కుట్రదారుల ఆటలు ఎప్పటికీ చెల్లవు.
`కేసీఆర్ దెబ్బకు పదేళ్లు పారిపోయాయి.
`తెలంగాణ మీద పెత్తనం కోసం గద్దలై వాలుతున్నాయి!
`విపరీత పైత్యం ముదిరినట్లు వాగుతున్నాయ్!
`నిజాలను సమాధి చేయాలని చూస్తున్నాయ్!
`అబద్దాలు నమ్ముకొని రాజకీయం చేస్తున్నాయ్!
`కేటీఆర్ ముందు రమేష్ కుప్పిగంతులు!
`సీఎం. రమేష్ మాటల్లో అక్షరం నిజం లేదు.
`వ్యాపారాల కోసం రాజకీయాలు చేసేది రమేష్.
`ప్రజల కోసం పని చేసింది లేదు.
`ఇన్నేళ్ల రాజకీయంలో గెలిచింది ఒక్కసారి.
`కేటీఆర్ గెలిచింది ఐదు సార్లు..
`తెలుగు దేశానికి రమేష్ జస్ట్ అర్థిక వనరు?
`2009 లో మహాకూటమి ఏర్పాటు.
`టీడీపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ!
`ఆ సమయంలో తెలుగు దేశం చర్చల ప్రతినిధులలో ఒకరు రమేష్.
`సీట్లు సర్థుబాటులో బిఆర్ఎస్తో రాయబారి మాత్రమే.
`ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు చేరవేయడమే!
`నిర్ణయాలు తీసుకొనే నాయకుడు కాదు.
`లిస్ట్ ఫైనల్ చేసింది చంద్రబాబు, కేసీఆర్ మాత్రమే.
`బీఆర్ఎస్ టిక్కెట్లు నిర్థారించే అవకాశం లేదు!
`టీడీపీలోనే టిక్కెట్లు ఇప్పించుకునే శక్తి రమేష్ కు లేదు!
`టీడీపీ తల్లిలాంటిదని చెప్పి బిజేపిలో చేరిన అవకాశ వాది రమేష్.
`పార్టీకి వెన్నుపోటు పొడిచి బిజేపిలో చేరిన వ్యక్తి రమేష్.
`బీజేపీలో వుంటూ టీడీపీ కొమ్ము కాస్తున్న అపరాధి రమేష్.
`స్వార్థానికి నిలువెత్తు సాక్ష్యం.
`కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు.
`తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకెళ్లిన నాయకుడు.
`ఎక్కడ జైలు కెళ్లాల్సి వస్తుందో అని భయపడి బీజేపీ లో చేరింది రమేష్.
`టీడీపీని పదవుల కోసం వాడుకొని వదిలేసిన స్వార్థపరుడు రమేష్.
`మసిబూసి మారేడు కాయ చేస్తే చరిత్ర ఊరుకోదు.
`తెలంగాణ రాజకీయాలలో వేలుపెడితే సమాజం సహించదు.
`బీఆర్ఎస్ మీద మాట్లాడితే ప్రజలే ఊరుకోరు.
బిజేపిలో బిఆర్ఎస్ వీలీనమౌతుందా? ఇది నమ్మదగిన మాటేనా? తెలంగాణ సమాజం స్వాగతించే మాటేనా? కేసిఆర్ బతికుండగా జరిగేదనా? తర్వాతనైనా ఇలాంటి ప్రతిపాదన తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? అసలు రాజకీయాల్లో ఏ పార్టీ ఎంత కాలముంటుంది? అనేది ఎవరు చెప్పగలరు? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఎన్నిక చీలికలు కాలేదు. కేంద్రంలో అధికారంలోవున్న బిజేపి ఎల్లకాలం వుంటుందా? పార్టీల మనుగడ అనేది నాయకులు చేతుల్లో వుంటుందా? ప్రజల ఆదరణ వున్నంత వరకే పార్టీలకు జీవితం. ప్రజలు పక్కన పెడితే సమస్యలు చుట్టు ముట్టడం ఖాయం. గత కాలపు రాజకీయాలు కాదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను ఎలా చిదిమేయాలని జాతీయ పార్టీలు చూస్తూనేవుంటాయి. వాటిని తట్టుకొని నిలబడి, కలబడి కొట్లాడిరదే బిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి ఒక చరిత్ర వుంది. బిఆర్ఎస్ పార్టీ అనేది ఆశామాషీ పార్టీ కాదు. రాజకీయాల కోసం పుట్టినపార్టీ కాదు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ సాధన కోసం పుట్టిన నాయకుడు కేసిఆర్. అలాంటి నాయకుడు వుండగానే బిఆర్ఎస్ పీక పిసికేడయం అంత సులభం కాదు. అంత సాహసం ఎవరూ చేయలేరు. ఇది చెప్పుకోవడంలో కూడా బిఆర్ఎస్ వెనుకబడిపోతోంది. బిజేపి పార్లమెంటు సభ్యుడు సిఎం. రమేశ్ ఏదొ కొత్త విషయం కనిపెట్టినట్లు లేని పోని ముచ్చట్లు చెబితే వినడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. ఇక ఆయన లేకపోతే కేటిఆర్కు పదవే లేదు. ఆయన ఎమ్మెల్యే అయ్యే ప్రసక్తి లేదు. తన వల్లే కేటిఆర్ ఎమ్మెల్యే అయ్యాడన్న ధోరణిలో రమేష్ మాట్లాడడం విడ్డూరం. ఈ యుగానికే వింత. కేటిఆర్ తన వ్యక్తిగత ఉజ్వలమైన భవిష్యత్తును కూడా వదులకొని వచ్చిన నాయకుడు. తెలంగాణ పోరాటంలోకి దిగి తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు. తెలంగాణ వస్తుందో రాదో తెలియని సమయంలో ఉద్యమంలోకి వచ్చిన నాయకుడు. అలాంటి నాయకుడికి తన పార్టీలో టికెట్ దక్కడం కోసం రమేష్ సాయం అర్ధించడమేమిటి? రమేష్ టిక్కెట్ ఇప్పించడమేమిటి? వినడానికే విడ్డూరంగా లేదా? చెప్పుకోవడానికి రమేష్కు ఏదీ లేకపోయినా, తెలంగాణ సమాజానికి విజ్ఞత వుంది. మంచీ చెడులు విశ్లేషించుకునే శక్తి వుంది. 2009 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేసిఆర్ ఒక నిర్ణయంతీసుకున్నారు. అంతకుముందు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారానికి దూరమైంది. ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవికోసం ఎదురుచూస్తున్న వైఎస్కు ఇక అది ఆఖరు మోకా అనిపించింది.. ఎలాగైనా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తేనే తాను ముఖ్యమంత్రి అవుతానన్న నమ్మకం కల్గింది. దాంతో ఆ సమయంలో కాంగ్రెస్ రాజకీయ బేరం బిఆర్ఎస్తో కుదుర్చుకున్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడతామని నమ్మించింది. దాంతో బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి విజయం సాదించారు. కాని కాంగ్రెస్ మాట తప్పింది. తెలంగాణ ఇవ్వడానికి ముందడుగు వేయడానికి ముందూ వెనుక ఆలోచిస్తోంది. ఇంతలో 2009 ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ మాట తప్పింది. అప్పటికే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకున్నది. తెలంగాణ వాదం లేదని నిరూపించే ప్రయత్నం చేసింది. అప్పుడు తెలంగాణ వాదం వుందని, మరింత బలపడిరదని నిరూపించే క్రమంలో కేసిఆర్, తెలుగుదేశం పొత్తుకు సై అన్నారు. అప్పుడు కూడా తెలుగుదేశం నంచి వచ్చిన ఆహ్వానం మేరకే జరిగింది. ఇది ఈతరం యువత తెలుసుకోవాలి. ఆ సమయలో టిడిపి, బిఆర్ఎస్ నుంచి కొంత మంది సభ్యులను ఎంపిక చేసి ఓ కమిటీ ఏర్పాటుచేశారు. ఆ కమిటిలో ఎంపి. రమేష్ ఒక సభ్యుడు మాత్రమే. రమేష్ నిర్ణాయక శక్తి కాదు. అభ్యర్ధులను ఎంపిక చేసేంతటి శక్తి వున్న నాయకుడు అసలే కాదు. అందులోనూ బిఆర్ఎస్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో నిర్ణయం తీసుకోవడానికి ఆయనకు ఎలాంటి అదికారం లేదు. తెలంగాణలో సీట్లు ఒప్పందం వరకే టిడిపికి చెందిన కమిటీ సూచనలు మాత్రమే చేస్తుంది. ఆ కమిటీలో ఒక సభ్యుడైన రమేష్ తానే కేటిఆర్కు టికెట్ ఇప్పించానని చెప్పుకోవడం విచిత్రం. ఆ సమయంలో తాను టికెట్ ఇప్పించకపోతే కేటిఆర్కు రాజకీయమే లేదని అనడం మరీ విచిత్రం. ఆ సమయంలో చర్చలు అనేక దఫాలు, అనేక ప్రాంతాల్లో జరిగాయి. ఆ సమయంలో ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడం సహజం. అంత మాత్రాన టికెట్ కోసం మా ఇం టికి రాలేదా? కేటిఆర్ అని రమేష్ చెప్పడం రాజకీయ దివాళాకోరుతనమే అవుతుంది. ఇక బిఆర్ఎస్, బిజేపి విలీన ప్రక్రియ గురించే మాట్లాడాల్సి వస్తే కేసిఆర్తో చర్చలు జరిపేంత పెద్ద నాయకుడా రమేష్. బిజేపిలో పెద్దలు లేరని రమేష్ను ఆ బాధ్యత అప్పగిస్తారా? కవిత జైలు నుంచి విడుదలై ఏడాది కావొస్తోంది. నాలుగు నెలల క్రింత రమేష్తో కేటిఆర్ బేటీ అవడం అనేది ఆలోచించడానికి కూడా ఆస్కారం లేని మాట. బిఆర్ఎస్ పార్టీలో ఏదో కల్లోలం రేపాలన్న కుట్రలు చేస్తే తెలంగాణ సమాజం పసిగట్టలేనంత అమాయకమైందికాదు. బిఆర్ఎస్ అనేది ఏ పార్టీలో విలీనమయ్యే అవసరం లేదు. రాజకీయాల్లో గెలుపోటతములు అన్ని పార్టీలకు సహజం. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ గెవలేదు. అంతే కాని ఓడిపోయినట్లు కాదు. బలమైన ప్రతిపక్షంగానే వు ంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మళ్లీ గెలిపించుకునేందుకు సిద్దంగా వుంది. గతంలో కాంగ్రెస్ ఇలాగే ప్రచారం చేసింది. కాని ప్రజలు నమ్ములేదు. కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి చేయలేదని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కాని కుదరలేదు. ఇప్పుడు బిజేపి వంతు వచ్చింది. బిఆర్ఎస్ పార్టీ బిజేపిలో కలవాల్సినంత ఆగత్యమేమిటి? బిఆర్ఎస్కు నాయకులు లేరా? నడిపించే అధినేత లేడా? పార్టీకి క్యాడర్ లేదా? బిఆర్ఎస్ను కోరుకునే ప్రజలు లేరా? బిజేపి తెలంగాణలో బలంగా వుందా? ఆ పార్టీని చూసి బిఆర్ఎస్ బయపడేంత స్ధాయిలో వుందా? ప్రజలు కొన్ని సార్లు ప్రయోగాలు చేస్తుంటారు. ఏ పార్టీ గుణమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్క అవకామంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలు ప్రజలు నమ్మారు. ఇక ఇప్పుడు ఏ పార్టీ ఒక్క అవకాశం..ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని పార్టీలు చెప్పే మాటలు వినే పరిస్ధితి లేదు. ఎలాగైనా బిఆర్ఎస్పై లేని పోని ప్రచారాలు సాగిస్తేనైనా జనం నమ్ముతారని అనుకుంటున్నారు. తెలంగాణ మీద మళ్లీ కన్నెయాలనుకుంటున్నారు. పార్టీ ల పరంగా కుట్రలకు తెరతీస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ లేకుండే ఎంత బాగుండు? తెలంగాన రాకుండా వుంటే ఎంత సంతోషంగా వుండు? అనుకునే వారు తెలంగాణలో కూడా కొంత మంది వున్నారు. అందుకే ఎప్పుడు తెలంగాణపై ఎలాంటి కుట్రలు చేయాలి. బిఆర్ఎస్ నాయకులను ఎలా బద్నాం చేయాలి. వారిని ఎలాంటి రాజకీయ పరిస్ధితులు సృష్టించాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో అపోహలకే ప్రాదాన్యత పెరుగుతోంది. అవే ప్రసారాలౌతున్నాయి. అబద్దాలే ప్రచారాలౌతున్నాయి. నిజాలు దాచేసే కుట్రలు సాగుతున్నాయి. ఎంత సేపు బిఆర్ఎస్ మీద ఎలాంటి బుదర జల్లుదామన్న ఆలోచనలు సాగుతున్నాయి. బిఆర్ఎస్ అనే పేరు లేకపోకపోతే మేం ఆడిరది ఆట పాడిరది పాటగా మార్చుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ ఎంత కష్టపడితే వచ్చిందన్నది ఈ తరానికి పూర్తిగా తెలియదు. ఎంత మంది త్యాగాలు చేశారన్నది కూడా ఈ తరానికి అక్కర లేకుండాపోతోంది. పదేళ్లపాటు పెరిగిన దశలో సుఖాలే చూసిన వారికి కష్టం తెలియకుండపోయింది. మొదటి నుంచి తెలంగాణ ఇలాగే వుందనుకుంటున్నారు. తెలంగాణ ఏ కొద్ది మంది నాయకుల కోసం వచ్చిందన్న మాటలు నమ్ముతున్నారు. తెలంగాణ, ఆంద్ర ఎందుకు కలిశాయి. ఎప్పుడు కలిశాయి. తర్వాత ఏం జరిగిందన్నది ఈ తరానికి చెప్పేవాళ్లు కరువయ్యారు. దాంతో ఎవరు ఏది చెప్పినా వింటున్నారు. తెలంగాణ వ్యతిరేకులు సాగించే ప్రచారమే నిజమని నమ్ముతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగణకు శాపంగా మారే ప్రమాదం పొంచి వుంది. అందుకు సోషల్ మీడియా పెద్ద వేదికైపోయింది. దాన్నే జనం విపరీతంగా నమ్ముతున్నారు. నిజమేమిటో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదా?