Drinking Water Booth Inaugurated
చలివేంద్రం ప్రారంభించిన సీఐ రంజిత్ రావు
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలకేంద్రం లోని కూడలి వద్ద కీర్తిశేషులు బాసని కైలాసం, కనకలక్ష్మి, రమాదేవి జ్ఞాపకార్థం మాజీ ఎంపీపీ తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డు మెం బర్ బాసని చంద్రప్రకాష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాష్ వారి తల్లిదండ్రుల, భార్య జ్ఞాపకా ర్ధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నా రు.మండల కేంద్రానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు చలి వేంద్రం దాహర్తి తీర్చడానికి తోడ్పడుతుందని అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని ఉపయో గించుకుని దాహం తీర్చుకో వాలి కోరారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మం డలంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో బాసని లక్ష్మీనారాయణ, సదాశివుడు, వెంకటపతి, చంద్రమౌళి, సామల రవీందర్, బాసని వెంకటేశ్వర్లు, గడ్డం బాబు పాల్గొన్నారు.
