గణేశుని శుభాశీస్సులతో అన్నిటా విజయం.
జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ గణపతికి పూజలు.
జైపూర్, నేటి ధాత్రి:
ఆధ్యాత్మిక వాతావరణం లో వేడుకలు జరుపుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ బీ. రాహుల్ పేర్కన్నారు. అంజనీపుత్ర ఎస్టేట్స్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన భారీ కేదారీనాథ్ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజనీ పుత్ర చైర్మెన్ శ్రీధర్ జిల్లా అదనపు కలెక్టర్ ను శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపిక ను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
సకల విజ్ఞాల తొలగించే గణనాథుని చరిత రమనీయమని, గణనాథుని పూజిస్తే అన్నింటా విజయమే సాధిస్తారని జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ లో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకల విఘ్నాలు తొలగించే వినాయకుని సేవలో పాల్గొనడం అదృష్ట దాయకమన్నారు.
-రామగుండం ఎమ్మేల్యే చందర్ ప్రత్యేక పూజలు
రామగుండం ఎమ్మేల్యే కొరుకంటి చందర్ వరసిద్ది వినాయకుని ప్రత్యేక పుజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే విశిష్ట పండుగ వినాయక చవితన్నారు. నియమనిబంధనలు,నిష్టా ఉపవాస దీక్షలతో మనసారా నమ్ముకొని పూజిస్తే భక్తుల కోరికలు తీర్చే దైవమే వినాయకుడన్నారు.అంజనీపుత్ర ఎస్టేట్స్ నిర్వహిస్తున్న నిత్యాన్నదానం, సేవాకార్యక్రమాలు అభినందనీయమన్నారు.అంజనీ పుత్ర ప్రజా శ్రేయస్సుకై వారు తలపెట్టిన ప్రతీకార్యం విజయవంతం కావాలన్నారు.పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.
-మెడికల్ క్యాంపు కు అపూర్వ స్పందన
హోమియో పతి ఆద్వర్యం లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కు అపూర్వ స్పందన లభించింది. జిల్లా అదనపు కలెక్టర్ అంజనీ పుత్రచైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి తో కలిసి బ్రోచర్ విడుదల చేసి క్యాంపు ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్య సేవలు ఇవాలన్నారు. ఉచిత మేడికల్ క్యాంపు ఏర్పాటు పట్ల అభినందనలు తెలిపారు…ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు మల్లేష్, మేనేజర్ రజిత, సిబ్బంది విజయ్ తదితరులు పాల్గొన్నారు