రాచర్ల కి లేని సెలవు దినం*

నిబంధనలు ఉల్లఘించడంలో మితిమిరుతున్న ప్రైవేట్ కళాశాల

 నిబంధనలు అతిక్రమించారని ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం

 ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

 ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాచర్ల జూనియర్ కళాశాల ప్రభుత్వ సెలవు దినం అయిన కూడా వాటిని బేఖాతరు చేసి కళాశాల ను నడిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాచర్ల జూనియర్ కళాశాల మాత్రం ప్రభుత్వ ఆదేశాలు ప్రక్కన పెట్టి కళాశాల నడుపుతున్నారు. నిర్విరామంగా ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా వేధిస్తూ కళాశాల లు నడుపుతున్నారు. ఓ వైపు విద్యార్థుల చదువుల ఓత్తడిలు ఎక్కువై విద్యార్థులు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఎంత చెప్పిన అధికారులు మౌనం వహిస్తున్నారు తప్ప ఏ కళాశాల పైన కనీసం చర్యలు తీసుకోకపోవడం లేదు. ఇప్పుడు ఇలాంటి చర్యలే రాచర్ల కళాశాల యాజమాన్యం చేస్తుండడం వల్ల తప్పేదేమి లేక విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను కళాశాల కు పంపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళాశాల పై తగిన చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే…..

బిఆర్‌ఎస్‌ ను ఎదుర్కోలేక బిజేపి దొంగ దెబ్బ!?

`రెండో రాజధాని పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తే సహించేదే లేదు.

బిజేపి ఆడే పైలా పచ్చీసు రాజకీయాలు ఎలా వుంటాయన్న విషయాల మీద 

ఎమ్మెల్సీ ‘‘దండె విఠల్‌’’ , నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేంద్రరావు’’ తో సంబాషిస్తూ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే…

`రాజకీయ చిచ్చు…రెండో రాజధాని ఉచ్చు!?

`బిజేపి మొదలు పెట్డిన రాజకీయ కుట్ర?

`తెలంగాణ లో బిజేపి పాగా వేయడం కష్టమని తేలిపోయింది?

`కర్నాటక ఫలితాల తర్వాత కలవరం మొదలైంది.

`బిజేపి నుంచే వలసల కాలం కళ్లముందుంది!

`బిజేపిల కలవరపాటుకు గురవుతోంది!

`ఎలాగైనా బిఆర్‌ఎస్‌ బలం తగ్గితే తప్ప దెబ్బ తీయలేమని అర్థమైంది?

`సెటిలర్స్‌ మద్దతు వుంటుందని బిజేపి నమ్ముతున్నట్లుంది?

`అలాగైనా నాలుగు సీట్లు సాధించొచ్చని బిజేపి ఆరాట పడుతోంది.

`తెలంగాణ ఉద్యమ సమయంలోనే రెండో రాజధాని తెరమీదకు వచ్చింది.

`బిజేపి కొందరు చెబుతున్నట్లు అంబేద్కర్‌ రాజ్యాంగలో ప్రస్తావించారనేది అబద్ధం.

`బిజేపి అబద్దాలు అందరికీ తెలుసు.

`తను రాసిన పుస్తకంలో మాత్రమే అంబేద్కర్‌ ప్రస్తావించారు.

`అప్పటికీ ఇప్పటికీ అనేక మార్పులు వచ్చాయి.

`అంబేద్కర్‌ పేరు చెప్పి తెలంగాణ ను ఆగం చేయాలని చూస్తున్నారు.

`తెలంగాణ సమాజం సహించదు.

`పక్క రాష్ట్రాలు రాజకీయం చేయడం వేరు.

`అధికారంలోకి రావడం లేదని తెలంగాణ బిజేపి నాయకులు మాట్లాడడం తెలంగాణ కు ద్రోహం చేయడమే.

`తెలంగాణపై బిజేపి విషం చిమ్మడమే

-తెలంగాణ కోసం బిజేపి నేతలు కొట్లాడిరది లేదు.

-తెలంగాణ లో రాజకీయం చేసే నైతికతే బిజేపికి లేదు.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు వెతకడంలో బిజేపిని మించిన వారు లేరు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు ఒక్క మంచి పని చేసింది లేదు. ఒక్క పధకం ప్రకటించిన పాపాన కేంద్ర ప్రభుత్వం పోలేదు. కాని ఎప్పటికప్పుడు రాజకీయ పైలాపచ్చీసు తొండి ఆటలు ఆడడంలో మాత్రం ఆరితేరిపోయారు. తాజాగా తెలంగాణ మీద కుట్రకు బిజేపి తెరలేపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సరిగ్గా ఎన్నికల తరుణం దగ్గరపడుతున్న నేపధ్యంలో బిజేపి సీనియర్‌ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలన్న అంశాన్ని తెరమీదకు తెచ్చి, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మళ్లీ కల్లోలం రేపాలని చూస్తున్నారు. కొన్ని దశాబ్ధాల పాటు గోసలు, అరిగోసలు చూసిన తెలంగాణ, ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో పచ్చగా, ప్రశాంతంగా, ఆత్మగౌరవంతో ముందుకుసాగుతోంది. ఇది బిజేపికి నచ్చడం లేదు. తెలంగాణ పచ్చగా వుండడం బిజేపికి ఏనాడు ఇష్టం లేదు. అందుకే సమయం సందర్భం లేకపోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ మీద విషం చిమ్ముతూనే వుంటాడు. తెలంగాణ వచ్చిన సంతోషం తీరకముందే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో అక్కడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని రాజకీయాలు చేశాడు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజరతామని నిరూపించారు. అన్నదమ్ములుగా విడిపోయాం….అభివృద్ది చేసుకుందామని స్నేహపూర్వక వాతావరణాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ సృష్టిస్తే, అడుగడుడునా తెలంగాణను బిజేపి కించపరుస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి స్ధాయిలో వున్న వ్యక్తి కూడా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానానికి గురి చేయడం కాదా? తాజాగా అదే పార్టీకి చెందిన నాయకుడు విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తే బాగుంటుందంటూ చిలకపలుకులు పలికి, చిచ్చురేపాలని చూడడం ఎంత వరకు సమంజసం అంటూ బిజేపి కుత్సిర రాజకీయాలపై తనదైన శైలిలో బిఆర్‌ఎస్‌ నాయకుడు, ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఫైర్‌ అయ్యారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో లేని, ప్రజలు మనసుగెల్చుకోలేని బిజేపి దేశంలోని రాజకీయాలను ఎలా చిన్నా భిన్నం చేస్తుందో చెబుతూ, పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అన్నది ప్రతి తెలంగాణ వాది కల.

 అరవైఏళ్ల గోస. అందుకు ముందు అదే పరిస్ధితి. హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పాటైనా, కొద్ది రోజులకే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటై ఎదుర్కొన్న వివక్ష, నిర్లక్ష్యాలు తెలంగాణ సమాజం అనుభవించిందే. అందుకే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు నుంచి పోరాటం మొదలైనా, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాతే అసలైన ఆత్మగౌరవం తెలంగాణలో వెల్లివిరిసింది. జై తెలంగాణ అన్న భావన ప్రతి గుండెను రగిలింపజేసింది. ప్రతి గొంతు జై తెలంగాణ అని నినదించింది. అప్పటి పాలకులను ప్రశ్నించింది. ఉద్యమం సాగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సాగిన ఉద్యమం పద్నాలుగేళ్లపాటు నిరంతరంగా సాగి, తెలంగాణ సాగించింది. అప్పటి నుంచి బిజేపి పార్టీ కుత్సిత రాజకీయాలు ఎలా వున్నాయో? నేటి తరానికి తెలియాల్సిన అవసరం వుంది. 1999లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపి పెద్దలు తెలంగాణపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. అదేంటో 1998లో రాజమండ్రిలో జరిగిన బిజేపి జాతీయ సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మాణం చేపట్టారు. ఆ తర్వాత కేంద్రంలో అధికారం కోసం తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారు. నాడు చంద్రబాబుతో కలిసి కేంద్రంలో అధికారం పంచుకొని, రాజధాని హైదరాబాద్‌లోనే వుండగా, తెలంగాణ ఎందుకు అంటూ అప్పటి ఉపప్రదాని అద్వాని కొంచెపు వ్యాఖ్యలు చేసి బిజేపి నిజస్వరూపం ఇదే అని నిరూపించారు. అందుకే ఆది నుంచి తెలంగాణ ప్రజలు రెండు నాలుకల బిజేపిని నమ్మడానికి ఏనాడు ఇష్టపడ లేదు. ఆనాడు అద్వాని, నేడు ప్రధాని మోడీ తెలంగాణపై ఒకటే వైఖరి అనుసరిస్తూ వచ్చారు. సరే దేశంలో రెండుసార్లు ప్రజలు అధికారం ఇస్తే ప్రజలకేమైనా చేశారా? అదీ లేదు. నోట్ల రద్దు చేశారు. దేశంలో నల్లదనం పోకపోతే అడగండి అన్నారు. యాభై రోజుల్లో దేశంలో వచ్చే మార్పు గమనించండి. లేకంటే నన్ను శిక్షించండి? అంటూ సాక్ష్యాత్తు ప్రధాని మోడీ ప్రకటించారు. కాని ఏం జరిగింది. దేశ ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తమైంది. దేశం కోలుకోలేని స్ధితికి నెట్టివేయబడిరది. జిడిపి అమాంతం పడిపోయింది. కాని మనం మెరుగైన స్ధాయిలో వున్నామంటూ ప్రజలను మభ్యపెట్టడంలో మాకంటే ఘనులెవ్వరూ లేరని బిజేపి పెద్దలు నిరూపించారు. దేశమంతాటా ఒకే పన్ను అన్నారు. జిఎస్టీ తెస్తున్నామన్నారు. అర్ధరాత్రి స్వాతంత్య్రం అన్నంత గొప్పగా జిఎస్టీ అమలుకు శ్రీకారంచుట్టారు. ఏమైంది? అంటే సమాధానం చెప్పడానికి ఏ బిజేపి నేతకు నోరు రాదు. దేశంలో ధరలు అమాంతం పెరిగి పోయాయి. సామాన్యుడు బతకలేని పరిస్ధితి వచ్చింది. పెట్రోలు ధరలు పెరిగాయని, రూ.400 వున్న సిలిండర్‌ ధర సామాన్యులు మోయలేరంటూ సుద్దులు చెప్పిన బిజేపి ఇప్పుడు ధరలు ఆకాశాన్నంటిస్తూ, దేశం కోసం, ధర్మం కోసమంటూ ప్రజలు పీల్చి పిప్పిచేస్తోంది. ఇలా ప్రజలను భాదిస్తూ, మరో వైపు ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తూ, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌ ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టారు. మహారాష్ట్రలో అదే చేశారు. కర్నాకటలో చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాలలో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బిజేపి అధికారం సాగిస్తూ, డబుల్‌ ఇంజన్‌ సర్కారు అంటూ వింతపోకడను చూపిస్తోంది. 

కర్నాటక ఎన్నికల తర్వాత ఇక దక్షిణాదిలో పాగా వేయడం కష్టమని బిజేపి గ్రహించింది.

 అంతకు ముందు ఎగిరెగిరి పడి తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకుందామని చూసింది. కాని కాలం గిర్రున తిరిగింది. కలగన్నంత సేపు కూడా బిజేపి సంతోషం నిలవలేదు. కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో పగటి కలలు వాస్తవంలోకి వచ్చాయి. దాంతో తెలంగాణలో మత రాజకీయాలు చోటు లేదు. బిజేపి బలానికి చోటు లేదు. తెలంగాణ రాజకీయాలను అస్ధిరపర్చే కుట్రకు తెరలేపినట్లుంది. అందుకే విద్యాసాగర్‌రావు అలాంటి వ్యాఖ్యలు చేసినట్లున్నారు. అంతే కాదు హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని చేయాలని రాజ్యాంగం రాసిన సందర్భంలో ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో చైనాతో యుద్దం చేయాల్సి వచ్చింది. అది అంబెద్కర్‌లో ఒక ఆలోచనకు కారణమైంది. 1955లో డాక్టర్‌. బాబాసాహేబ్‌ అంబెద్కర్‌ రాసిన దాట్స్‌ ఆన్‌ లివింగ్‌స్టిక్‌స్టేట్స్‌ అనే పుస్తకంలో 11 పేజీలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేగాని దానిపై దేశంలో ఏనాడు చర్చ జరిగింది లేదు. అలాంటి చర్చ జరిగిన సందర్భాలు లేవు. కాకపోతే యుద్దాలు జరిగితే డిల్లీని టార్గెట్‌ చేసే శత్రుదేశాలకు రాజదాని కేంద్రం కొంత దూరం వుంటే బాగుంటుందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తం చేశారు. అంతే కాకుండా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య బలమైన బంధాలు ఏర్పడానికి దోహదపడొచ్చు అన్నది వ్యక్తం చేశారు. నాటి పరిస్ధితులు వేరు. నేటి పరిస్ధితులు వేరు. అప్పటి పరిస్ధితులను బేరీజు వేసుకొని అంబెద్కర్‌ చెప్పిన ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర విజభన సమయంలో కూడా ఇదే బిజేపి తెరమీదకు తెచ్చింది. అప్పుడే చిచ్చుపెట్టాలని చూసింది. అందులో భాగంగానే ఉమ్మడి రాజధాని, సెక్షన్‌ 8ని కూడా తీసుకొచ్చేందుకు దోహదపడ్డారు. 

 తెలంగాణ కోసం కోట్లాడిన చరిత్ర బిజేపికి లేదు.

 తెలంగాణ ప్రజల మనోభావాలు బిజేపికి అక్కర్లేదు. అదేంటో గాని తెలంగాణ బిజేపి నేతలకు కూడా తెలంగాణ ఆత్మగౌరవం అన్నదే లేదు. అసలు తెలంగాణ మీదే ప్రేమలేదు. అదే వుంటే ఇలా ప్రశాంతంగా వున్న తెలంగాణలో రాజకీయ కల్లోలం రేపేందుకు కుట్రలు చేయరు. ఇదీ బిజేపి అసలు రూపం… కుట్రల స్వరూపం. తెలంగాణ ప్రజలకు బిజేపి నైజం తెలుసు. అందుకే తెలంగాణలో బిజేపికి ఉనికి లేదు. ప్రజల్లో గుర్తింపులేదు. ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే నైతికత ఆ పార్టీకిఅసలే లేదు. ఇప్పటికైనా తెలంగాణ మీద ప్రేమను పెంచుకోండి. తెలంగాణ అభివృద్ధికి సహరించడం నేర్చుకోండి. పరాయి పాలనను తరిమి, స్వపరిపాలన తెచ్చుకొని ఆత్మగౌరవంతో తెలంగాణ తలెత్తుకొని నిలబడిరది. మళ్లీ కుంపటి రేపాలని చూస్తే ప్రజలు సహించరు. తగిన బుద్ది ప్రజలు చెబుతారు. గత ఎన్నికల్లోనే తెలంగాణలో అడ్రస్‌ లేకుండా చేశారు. అయినా బిజేపి మారలేదు. ఇప్పటికైనా మారకపోతే ఆ మాత్రం స్ధానం వుండదు. దక్షిణాది ప్రజలు ఎంతో చైతన్య వంతులు. వారిని మాయచేయాలని చూసి, కర్నాకటలో మూతి కాల్చుకున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలోకి బిజేపిరావాలి.వాస్తవంలో నడవాలి. కుట్రలకు ఆపుకొని, అభివృద్ధి గురించి ఆలోచనలుచేయాలి.

పోలీస్ వాహనం అదుపు తప్పి ఎస్ ఐ మరియు డ్రైవర్ మృతి

హనుమకొండ క్రైమ్ నేటిధాత్రి

అదుపుత‌ప్పి పోలీస్ వాహ‌నం బోల్తాప‌డ‌డం తో స్పాట్ లోనే రెండవ ఎస్ ఐ, డ్రైవర్ దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం, కమలాపురం రహదారి మధ్యలో జీడివాగు వద్ద అదుపుతప్పి పోలీస్ వాహనం పల్టీ కొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏటూరు నాగారం టూటౌన్ ఎస్ఐ ఇంద్రయ్య, డ్రైవర్ శెట్టిపల్లి రాజు మృతి చెందారు. పోలీస్ సిబ్బందిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ గాయాల పాలయ్యాడు. సంఘటన స్థలానికి ములుగు జిల్లా ఎస్ పి గౌస్ చేరుకుని జరిగిన ప్రమాదం పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని అన్నారు.

చీమలపాడు ఘటనలో గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ, ఎంపీలు వద్దిరాజు,నామా

మరింత శ్రద్ధతో మెరుగైన సేవలు అందించాల్సిందిగా అధికారులు,వైద్యులను ఆదేశించిన కేటీఆర్

ప్రభుత్వం,పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసాన్నిచ్చిన కేటీఆర్

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వర రావులతో కలిసి

చీమలపాడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.రవిచంద్ర గురువారం ఉదయం మంత్రులు కేటీఆర్,అజయ్ కుమార్,ఎంపీ నాగేశ్వరరావులతో పాటు నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి,అందులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పరామర్శించి ప్రభుత్వం,పార్టీ కొండంత అండగా ఉంటుందని భరోసాన్నిచ్చారు.వారు నిమ్స్ అధికారులు,వైద్యుల బృందంతో మాట్లాడి మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.గాయపడిన వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలని,వీరి సహాయకులు,కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండాల్సిందిగా నిమ్స్ ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, డైరెక్టర్ డాక్టర్ బీరప్పలకు కేటీఆర్ పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.

సిపిఐ మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐ. పి. ఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచం ద్రాపురం గ్రామ శివారులో ములుగు పోలీసులు కారు, బైక్‌పై ప్రయాణిస్తున్న ఐదుగురిని

పట్టుకున్నారు.20.03.2023న 05:30 గంటలకు వాహన తనిఖీ చేస్తున్నప్పుడు విశ్వసనీయ సమాచారంపైతగిన జాగ్రత్తలు

తీసుకుని వారి వాహనాలను తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు ఐఈడీ మెటీరియల్‌లోని లోహ భాగాలు సీపీఐ మావో యిస్ట్ పార్టీ విప్లవ సాహిత్యంతో పాటు కొన్ని

మందులను పోలీసులు గుర్తించారు నిందితులను విచారించగా కొంత కాలం క్రితం ఇతర నింది తులతో కలిసి నిషేధిత సీపీఐని కలిశామని చెప్పారు. మావోయిస్టు గ్రూపు ప్రధాన నాయకుడు దామోధర్ మరియు కొంతమంది దళ సభ్యులు తమ భూ సమస్యలను పరిష్కరించడం కోసం

నిషేధించబడిన సీపీఐ మావోయిస్టు గ్రూపు విప్లవ భావజాలానికి ఆకర్షితులయ్యారు. సీపీఐ మావో యిస్టు పార్టీ నేతలు చంద్రన్న దామోధర్‌పై నిషేధం విధించేందుకు వీరంతా క్రియాశీలకంగా పనిచేస్తు న్నారని వెల్లడించారు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నేత దామోధర్ సూచనల మేరకు నిందితు లు కొన్ని పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం మందులను సేకరించి వారికి ఇచ్చేందుకు ముందు కొచ్చారు. కూంబింగ్ ఆపరేషన్ల కోసం అడవికి వచ్చిన పోలీసులను చంపాలనే ఉద్దేశ్యంతో దామోధర్‌ ప్రణాళిక వేశారు.నిందితుల వివరాలు అరెస్టయిన వ్యక్తులు ఎల్ అందె రవి s/o రాజయ్య, వయస్సు 39 సంవత్సరాలు, కులం: వడ్ల (విశ్వ బ్రాహ్మణ) టెంట్ హౌస్ వ్యాపారం. r/o నాగారం గ్రామం జయశంక ర్ భూపాలపల్లి మండలం & జిల్లా A2 శ్రీరామోజు మనోజు తండ్రీ భిక్షపతి వయస్సు 30 సంవత్స రాలు కులం కుమ్మరి Occu: ఫ్లెక్స్ ప్రింటింగ్ r/o పల్లారుగుడ గ్రామం, వరంగల్ జిల్లా, సంగెం మండలం A3. దిడ్డి సత్యం s/o నర్సయ్య, వయస్సు: 50 సంవత్సరాలు, కులం: పద్మశాలి, Occu: ఫోటోగ్రాఫర్, r/o దీక్షకుంట గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. A4. శ్రీరామోజు భిక్షపతి s/o శంకరయ్య, వయస్సు: 53 సంవత్సరాలు, కులం: కుమ్మరి, Occu: ఆటో డ్రైవర్, r/o పల్లారుగుడ గ్రామం, వరంగల్ జిల్లా, సంగెం మండలం.A5. అనసూరి రాంబాబు s/o లక్ష్మయ్య, వయస్సు: 52 సంవత్సరాలు, కులం: కుమ్మరి, Occu: పూజారి, r/o పెద్దతండా గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మల్హారరావు మండలం.A11. గణపురం ఘనపురం చంద్రమౌళి s/o మదన గోపాల్, 51 సంవత్సరాలు, కులం: పద్మశాలి. r/o H.No: 12-49/1, బాలాజీ నగర్, జవహర్ నగర్ PS, కాప్రా మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

A13. ఘనపురం పృథ్వీ రాజ్ s/o చంద్రమౌళి, 24 సంవత్సరాలు, కులం:పద్మశాలి, r/o H.No: 12-49/1, బాలాజీ నగర్, జవహర్ నగర్ PS, కాప్రా మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా A14. అందె మానస w/o రవి, వయస్సు: 34 సంవత్సరాలు, కులం: వడ్ల (విశ్వ బ్రాహ్మణ), n/o నాగారం గ్రామం, జయశంకర్ భూపాలపల్లి మండలం & జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ల లో నిందితులు అందరూ సాధారణ నేరస్థులు మరియు (4 UAPA చట్టం కేసులు) సహా 5 కేసులను కలిగి ఉన్నారు

 

*స్వాధీనం చేసుకున్న వస్తువులు*

 

1) IEDs-45 యొక్క ఇనుప భాగాలు,

 

2) కార్డెక్స్ వైర్-10 మీటర్లు,

 

3) డిటోనేటర్లు-02,

 

4) బ్యాటరీ-01.

 

5) విప్లవ సాహిత్యం-04.

 

6) సిపిఐ (మావోయిస్ట్) పార్టీ యొక్క అనారోగ్య UG క్యాడర్‌లకు ఉద్దేశించిన మధుమేహం మరియు ఇతర అనారోగ్యాలకు మందులు

 

7) కారు బేరింగ్ నెం: TS11 EY 0306 (వైట్ కలర్ కియా సెల్టోస్)-01.

 

8) హోండా మోటార్ బైక్ బేరింగ్ నెం: TS25A1007 (నలుపు రంగు)-01.

 

9) మొబైల్ ఫోన్లు-08

 

10) నగదు రూ: 4140/-.

 

ఈ సంఘటన ఆధారంగా,ములుగు జిల్లా పీఎస్ వెంకటాపురంలో కేసు నమోదైంది.

 Cr . నం: 39/2023, U/Sec.120(b), 143, 307 IPC r/w 149, TSPS చట్టంలోని సెక్షన్ 8(1)(2), ES చట్టంలోని సెక్షన్ 5, UAPA యొక్క 10,13, 18 చట్టం ప్రకారం.

 

 జిల్లా ఎస్పీ శ్రీ గౌష్ ఆలం ఐ. పి. ఎస్ గారు మాట్లాడుతూ — నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి సహకరించవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలందరిని కోరారు . మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులను బలవంతంగా నేరాలకు పాల్పడేలా చేసి వారి జీవితాలను నక్సల్స్ నాశనం చేస్తున్నారు. వారు ఎల్లప్పుడూ ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మరియు వారి స్వంత ప్రయోజనాలను నెరవేర్చ డానికి అమాయక ప్రజలను ఉపయోగించుకు న్నారు సిపిఐ (మావోయిస్ట్‌) పార్టీ నాయకులు తమ సమస్యలను పరిష్కరి స్తామనే సాకుతో అమాయకులను పిలిపించి వారికి పేలుడు పదార్థాలు ఇతర సరుకులు సరఫరా చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ప్రజలు దీనిని గమనించి మావోయి స్టులకు ఎవరు సహకరిం చవద్దని ఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో ములుగు భూపాలపల్లి ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఐ. పి. ఎస్, ఏ.ఎస్పీ సిరి శెట్టి సంకీర్త ఐ. పి ఎస్, సి. ఐ వెంకటాపురం శివప్రసాద్, ఎస్. ఐ వెంకటాపురం తిరుపతి రావు గారు సిబ్బంది పాల్గొన్నారు.

Integrity thy name Kavitha

Having been in politics since the inception of Telangana State, the BRS MLC

has never used or influenced as the daughter of chief minister K Chandra

Shekhar Rao. She tried to sustain on her own so that her individuality andhttps://netidhatri.com/కవిత-కడిగిన-ముత్యం/

integrity remain intact. As the cultural representative of Telangana, she has been

trying to highlight the core aspects pertaining to Telangana culture and tradition.

It is a fact that she has never attracted this kind of malicious propaganda which

is aimed at maligning her career and character.

Liquor case a drama of BJP?

It appears that for the last five months, Delhi liquor scam has become an

opportune weapon for BJP to target the Telangana government as well as its

leaders. Nobody knows for certain as to what is the scam and what are the issues

involved in it. As the liquor policy had already been scrapped by the Delhi

government itself, it seems that the BJP is doing much ado about nothing with

regard to that dismantled policy. The BJP is trying to bring something out of

nothing by implicating BRS senior leader Kavita.

BRS the potential force:

Ever since the Bharat RashtraSamithi(BRS) is formed, there has been

tremendous response to it across the nation. The president of the party and the

Chief Minister of Telangana K Chandra Shekhar Rao has brought such a wider

political as well as ideological strength to the party thereby making it a potential

political force in the ensuing Lok Sabha elections. Now it has become clear the

BRS has the nationwide political strength to face BJP at the hustings. It seems

that this is the only reason for the BJP leadership to target BRS so that it is

morally weakened. From the very beginning Mrs Kavita has proved her dynamic

leadership by undertaking many programmes for the cultural upliftment of

Telangana. We cannot find such a dynamic women leader even in BJP. Fearing

the political potentiality as well as the dynamism Mrs Kavita has, the BJP has

been trying to threaten her with cases. Can we consider or term a policy that has

been taken up by an assembly as scam? Even before the policy came into force

how can it be termed as scam ? it is also a fact that the Delhi government has

withdrawn that policy even before it coming into force. How can we say that the

Delhi government did wrong by withdrawing the policy?

In this background it is not out of the context why the central government has

withdrawn the agriculture policies. The farmers of north India severely oppose

the act and brought force on the government to retreat. Just withdrawing an act

does not mean that the government did something wrong.

Anti BJP governments are targeted:

In order to make the opposition ruled governments to submit to its dictacts, the

BJP run central government has been targeting opposition ruled states in a

number of ways.

Is it right to privatise PSUs?

It appears that privatising Public Sector Units has become order of the day. After

the BJP government came to power at the national level there has been selling spree of Public Sector 

Units. Is it not wrong to privatise Public Sector Units? In

what way central government’s action in this regard is justified?

Just to divert Adani issue :

Caught in the midst of Adani group issue and also the fallout from the turmoil,

the central government has been trying to divert the issue by targeting opposition

parties that tried to highlight the issue. Almost all the opposition parties united on

the Adani issue. The parties have also projected the investments made by PSUs

like LIC, SBI and other banks. It is also a fact that the BJP ruled central

government has been promoting crony capitalism. Just to coverup the scams

committed by its cronies the BJP government has been targeting opposition

parties and even went to the extent of implicating and arresting them.

How can BRS MLC Kavita influence a liquor policy of Delhi government? Just to

intimidate her politically and morally she has been targeted in the name of the

scam. The allegations against her involvement in the scam are surprising given

the fact that she is not at all involved in it. It is nothing but a political vendetta of

the BJP government to target a leader who has proved her innocence and integrity.

The central government has no time.

Common people burdened:

From soaps to biscuits and from cooking gas to petrol the prices of which have

been hiked so many times. The common people of the country have been

burdened and are heavily pained with the increases. The government has no time

to relieve the commoner from the price hikes for it is busy with targeting

opposition leaders and protecting cronies.

Outstanding performance of students at 2K cultural fest “good morning grammar high school “

Good morning 2K Bhesh in demonstrating student excellence.

Performance of  72 teams from Nursery to Class X students.

Parents are overjoyed to see their children’s skills. At Good morning Grammar High school.

Hundreds of people gathered on the occasion of Republic Day, happy vibes at  school premises

Good Morning’s aim is to bring out the skills of the students along with education, says Shashi…

MAHADEVPUR – NETI DHATRI:

(MINNU’BHAI,REPORTER,8499999294)

Good Morning Grammar High School has already been blessed with the success of many students who have reached many heights for the bright future of the students. It can be said that Good Morning Grammar High School has taken another step forward in bringing out the skills of the students along with their education. On the occasion of  74th Republic Day, a historic event in the field of education, “Ecose, Cultural, Event 2K 23”, Good Morning appreciated the performance of the management and teachers of the school for performing artistic skills with the students studying from nursery to class 10.

Cultural festival 2K, performance to Good morning students are king. 

Good Morning Grammar School private school in Mahadevpur mandal center of Bhupalapally district has achieved many success in imparting English education to the students throughout the district and taking their future to higher heights. In Maharashtra also a strong impression is made among the people/parents . There is no doubt that such a program of Good Morning Grammar School aims to create a great feeling of happiness among the people as well as the parents of the students in the district as well as the mandal where the school has undertaken it. Recently on the occasion of 74th Republic Day on Thursday, a program was organized with the students studying in the school called Cultural Festival 2K Run in order to bring the skills of the students to the public. Finally, the students’ performances showed that the students of GMGHS School are king in academics as well as in the display of skills.

Good morning 2K, Bhesh in demonstrating student excellence.

 In today’s society, students are not limited to education but skill also makes it easier to study. Good Morning Grammar High School to Kiran Cultural Program can understand that the skill of students removes mental pressures and makes it easier for students to study. In the cultural event arranged in the school, performances like Kuchipudi and film music were performed, and the parents say that they have to say well done to the Good Morning school management for finding the ability to show their feelings and skills regardless of age. It is not a small matter to look for the skills of the students studying in the school along with their education. It can be said that the effort of the school owner and the teachers to bring the education to the people and put the skill in front of the people before their parents is Bhesh. Many students go to great lengths to demonstrate their skills and hide their desires in people. But in Good Morning School, the school does not hold back in recognizing the students’ skills as well as the attention given to education, by recognizing the mental skills of the students and bringing out the skills in them, on the other hand, they pay attention to education and take care in shaping the future of their school students.

Formed into 72 groups and performing from Nursery to Class X students.

There is no doubt that the 2k cultural event organized by Good Morning Grammar School is indeed a match for the school owner to bring out the talent in the students. Because it can be said that Good Morning has the honor of letting the bully students know that there is skill in them even among those children who are bullying students on the one hand while bringing out the skills on the one hand. Good morning school has brought a surprise to the level where even those students who do not speak well can prove that they are capable. Their performance at the Aa Bulli Kachit Aa Paditu event, which is just learning alphabets, was not only a delight but also a surprise. Those students who have been correcting letters in Montessori Kindergarten since the tenth grade and have been correcting their letters in Bharatanatyam, Kuchipudi, Music, Singing and performing in 72 groups with all the classes of the school must have surprised the surrounding mandals as well as the people of the local mandal expressing their happiness.

Parents are overjoyed to see their children’s skills in Good morning.

The parents had a strong belief that their children would get a quality education in the school and enrolled their children in Good Morning. Also, although their children currently had a lot of faith in the school, they could not imagine that the school would bring out the skills of their children. Because in Good Morning Grammar High School’s 74th Republic Day cultural event Two Kay Run program, children studying from nursery to class 10, according to their skills, 72 groups of 600 students in Kuchipudi music and movie-like performance were interestingly watched by the parents. They never remembered that their children have such talent, sometimes children spend their happy time dancing and immersing themselves in movie songs, but parents have such great performance skills and their joy knows no bounds when they see their children’s performances.

Hundreds of people attended the function on the occasion of Republic Day, packed school premises.

Good morning is a cultural program of the students in the school but along with other cultural programs organized by the school the good morning school is filled with fans along with the parents. Because Good Morning School over the years has left a strong impression on the minds of parents as well as people for the major role played in shaping the future of students with English education. And the cultural event program i.e. the program of setting up a school for the people of the mandal as well as the surrounding mandals, because the entire public is aware of the school management arrangements, hundreds of students’ parents and people must also attend, it is also known as good morning specialty. A large number of fans of Good Morning School from surrounding mandals and mandal center district also joined the cultural event To K Run program organized on Thursday. The many roads going to the school in the center of the mandal are crowded with vehicles, but all the people are going towards the school good morning and the school premises is already crowded with people on one side and parents on the other side. A festive atmosphere was evident with the overwhelming crowd.The school is moving forward with the aim of bringing out the skills of the students along with their education. Due to covid, the school has not been able to organize public programs for the last two years. For the first time after two years, To K Run event has been organized. Along with the mandal center, villages from other mandals and also from distant areas have come to this program for the children as well as the school teachers. Correspondent MM Shashi and School Principal MM thanked all the parents as well as fans of the school for their encouragement. Parents of students and fans of the school have been requested to provide their support as the school is going to switch to digital education soon.

ఖమ్మం గ్రానైట్ తో ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు

గాయత్రి కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేసిన రెండో గ్రానైట్ ఇది*

*మొదట ఢిల్లీ చాణక్యపురిలో పోలీసు జాతీయ స్మారక స్థూపానికి, తాజాగా ఇప్పుడు కర్తవ్యపథ్ లో బోసు విగ్రహానికి ఉచితంగా బహుకరణ*

*రాజ్ పథ్ సుందరీకరణలో భాగంగా బోసు విగ్రహాన్ని నెలకొల్పారు*

*బోసు విగ్రహాన్ని గురువారం రాత్రి ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరించారు*

*ఖమ్మం:* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ కర్తవ్యపథ్ (రాజ్ పథ్)లో సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ విగ్రహానికి ఉపయోగించిన బ్లాక్ గ్రానైట్ కు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి నుంచి పంపడం జరిగింది.గత ఏడాది ఢిల్లీ చాణక్యపురి పోలీసు జాతీయ అకాడమీలో నెలకొల్పిన స్మారక స్థూపానికి కూడా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాధారం గ్రానైట్ నే ఉపయోగించడం జరిగింది.ఈ రెండింటికి కూడా బ్లాక్ గ్రానైట్లను గాయత్రి గ్రానైట్స్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేశారు.

యువ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం*

 

శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా హన్మకొండ జిల్లాల కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో ఉన్నటువంటి యువ యూత్ ఆధ్వర్యంలో

మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ మహా అన్నదాన కార్యక్రమానికి సుమారుగా 500 మంది హాజరుకాగా, తొమ్మిది రకాల వంటకాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వి.శివాజీ , ఉపసర్పంచ్ చిరంజీవి, బూర్గుల సాయి కిషోర్, గునిశెట్టి చంద్రకాంత్, బెజ్జంకి శ్రీనాథ్, బండ్ల ప్రశాంత్, అల్లాటి క్రాంతి, అఖిలేష్, గౌడ గాని రమేష్, ఆకుల ప్రశాంత్, అన్వర్, బాసిరి నాగరాజు అన్నదాతలు నల్లెల రాజు, ఎలగందుల విష్ణు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కులమత రాజకీయాలతో పబ్బం గడుపుతున్న బిజెపి ప్రభుత్వం

సంక్షేమ పథకాలలో తెలంగాణదే అగ్ర తాంబూలం

కల్యాణ లక్ష్మి,షాది ముభారక్ పథకంతో పేదల కుటుంబాల్లో ఆనందం

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒంట‌రి మ‌హిళ‌లు, దీర్ఘ‌కాలిక రోగుల‌కు కూడా పెన్ష‌న్లు

విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్

ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్

ఊరురా తిరిగి పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి:

పేద‌లకు గౌర‌వ ప్ర‌దమైన జీవితాన్ని అందించేందుకే ఆస‌రా పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని, సిఎం కెసిఆర్ చొర‌వ‌తో 57 ఏండ్ల‌కు వ‌యో ప‌రిమితి త‌గ్గించ‌డంతో కొన్ని ల‌క్ష‌ల మందికి కొత్త‌గా అవ‌కాశం వ‌చ్చింద‌ని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వృద్ధులు,దివ్యాంగుల‌కు మాత్ర‌మే పెన్ష‌న్లు ఇస్తుంటే, దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒంట‌రి మ‌హిళ‌లు,దీర్ఘ‌కాలిక రోగుల‌కు కూడా పెన్ష‌న్లు ఇస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం, సిఎం కెసిఆర్ త‌మ దృక్ప‌థాన్ని చాటుకున్నార‌ని ఎమ్మెల్యే అన్నారు.టిఆరెస్ ప్ర‌భుత్వం మాన‌వ‌త్వం ఉన్న మ‌న ప్ర‌భుత్వం సిఎం కెసిఆర్ ప్ర‌భుత్వమ‌ని వివ‌రించారు. గతంలో 70 రూపాయ‌ల‌తో మొద‌లై 200 రూపాయ‌ల ద‌గ్గ‌ర ఆగిన పెన్ష‌న్ల‌ను 2016, 3016 రూపాయ‌ల వ‌ర‌కు పెంచార‌ని చెప్పారు.ఇంత పెద్ద మొత్తం పెన్ష‌న్ గా ఇస్తున్న రాష్ట్రాలు కూడా దేశంలో లేవేన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా, సామాజిక వ‌ర్గాల వారీగా చూస్తే ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, బీసీల అభివృద్ధికై ఎంతో కృషి చేస్తుందని అన్నారు.మన సీఎం కెసిఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి,సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవనీ సాగునీరు,పంట‌ల పెట్టుబ‌డులు,పంట రుణాలు, రుణ విముక్తి,రైతు బీమా, క‌ళ్యాణ ల‌క్ష్మీ,షాదీ ముబార‌క్‌, కెసిఆర్ కిట్ వంటి అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.బిజెపి,కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడా కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్,జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి,వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు ఎండి నజీర్,ఊకంటి యాకోబు రెడ్డి, దామర కొండ ప్రవీణ్ కమటం శ్రీను,ఎటు రోజు మహేశ్వరాచారి,బండారు గోపీనాథ్,ఎలబోయిన సారయ్య,కొంటెడి శ్రీవాణి రవీందర్ రెడ్డి,జల్లె సైదమ్మ విజెంధర్,వీరు నాయక్,వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు,వార్డు మెంబర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మళ్ళీ ‘పొత్తు’పొడుపు!

`చిగురిస్తున్న పాత స్నేహాలు

`తెదేపా, బిజేపిల ఎన్డీయే మానియా!

`వరుసగా ఇరు పార్టీల నేతల రహస్య భేటీలు…

`మొదట మోడీతో డిల్లీలో చంద్రబాబు 

`మునుగోడు సభ నాడే తెలంగాణలో అమిత్‌ షా కొత్త రాజకీయం

`అటు రామోజీ రావు, ఇటు జూనియర్‌ ఎన్టీఆర్‌ తో సమావేశం.

`తాజాగా లోకేష్‌ తో అమిత్‌ షా భేటీ

`చంద్రబాబుకు భద్రత మరింత పెంపు

`తెలంగాణపై ముందు ఫోకస్‌…

`ముందే చెప్పిన నేటిధాత్రి…

`ఎన్టీఆర్‌ మానియాతో తెలంగాణలో బిజేపి…

`ఆంద్రప్రదేశ్‌ లో రెండు కలిసి పోటీ…

`ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…

 కేసిఆర్‌ కాదంటే చంద్రబాబు…

`బిజేపి పొత్తు రాజకీయాలు….

`తెదేపా కు రెడ్‌ కార్పెట్‌…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మళ్లీ పాత స్నేహాలు చిగురిస్తున్నాయి. పాత పొత్తులు తెరమీదకొస్తున్నాయి. దక్షిణాదిన పాగా వేయడం అంత సులువైన పని కాదని తెలుసుకున్న బిజేపి మళ్లీ పాత స్నేహాల కోసం చేతులు చాచుతోంది. హస్తం పార్టీ పాగా వేయకుండా వుండాలంటే ఏక కాలంలో దక్షిణాదిలో కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. అందులో భాగంగా ఉభయకుశలోపరిగా బిజేపి తన వంతు ద్విపాత్రాభియన రాజకీయాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏక కాలంలో అటు వైసిపితో, ఇటు తెలుగుదేశంతో జట్టుకట్టేందుకు, తెలంగాణలో తెలుగుదేశంతో కలిసి సాగేందుకు నయా రాజకీయం రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఒంటరిగా బిజేపి పాగా వేయడం కుదరనిపని. వైసిసితో పొత్తు సాగని పని. జనసేనను నమ్ముకుంటే సీట్లొస్తాయన్న నమ్మకం లేని పని. ఇక మిగిలింది. … కొత్త మిత్రుడికన్నా, , పాత శత్రువే మేలు అన్న సామెతను బిజేపి నిజం చేయనున్నది. తెలుగుదేశం పార్టీని మళ్లీ దగ్గరకు చేర్చుకుంటోంది. తెలంగాణ ఇవ్వడం అన్నది తెలుగుదేశం పార్టీకి సుతారం ఇష్టం లేని విషయం. అందులోనూ రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో ఒక వైపే చేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, తెలంగాణ ప్రయోజనాలు ఏనాడు పట్టని చంద్రబాబుకు రాష్ట్ర విభజన ఏ కోశాన ఇష్టంలేదు. ఇచ్చేదా…వచ్చేదా? అన్న ధోరణిలోని తెలంగాణలో ఆనాటి తెలంగాణ తెలుగుదేశం నాయకుల రాజకీయ మనుగడ కోసం తెలంగాణ ఉత్తరం ఇచ్చిన ఘనుడు చంద్రబాబు. 2009 డిసెంబర్‌9న తెలంగాణ ప్రకటించిన వెంటనే సీమాంధ్రకుచెందిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేల రాజీనామాలను రాజకీయం సృష్టించిందే. ఆ రాత్రంతా నిద్ర లేకుండా తెల్లారే సరికి సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలన్నీ పూర్తయ్యే దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో బిజేపి అంటకాగడం కొత్త కాదు. పైగా ఒకనాటి బిజేపికి తెలంగాణ ఇవ్వడం ఇష్టమున్నా, నాడు కూడా అద్వానీ లాంటి వారికి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని పని. ఇప్పుడు అదే ప్రధాని మోడీకి కూడా తెలంగాణ ఏర్పాటు అన్నది అసలే ఇష్టం లేని పని అన్నది పలు మార్లు ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన స్పష్టం చేసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత ఎన్నికల సందర్భంలో రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతిలో 2014లో తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. యధాలాపంగా రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ చేసిన వ్యాఖ్యలనే అందరూ అనుకున్నారు. అరవైఏళ్లలో అలాంటి మాటలు ఎన్నో విన్న తెలంగాణ ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం సీరియస్‌గా తీసుకోలేదు. పైగా అవి నరేంద్ర మోడీ మనసులో నుంచి వస్తున్న మాటలు అనుకోలేదు. కాని ఆయన కావాలనే అన్నారని, సమయం దొకినప్పుడల్లా తెలంగాణ మీద కసి తీర్చుకుంటున్నాడని అనేక సార్లు రుజువైంది. తాజాగా కూడా ఆయన పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును అసందర్భంగా ప్రస్తావించి బిజేపి వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుకు పాకులాడడంతో తేలిపోతోంది. నిజానికి నరేంద్రమోడీని చంద్రబాబు దూషించినంతగా ఎవరూ తిట్టలేదు. 

ఆంధ్రప్రదేశ్‌ కు విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల అమలు విషయంలో కేంద్రం చేసిన తొండి రాజకీయాన్ని చంద్రబాబు బాగానే తూర్పారపట్టారు. మొదట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ పని చేసినా ఆహా…ఓహో అని తెగ పొడిగిన చంద్రబాబు, తీరా 2019 ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు ఎన్డీయేనుంచి బైటకు వచ్చాడు. ఎన్డీయే కన్వీరన్‌ పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్నాడని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కాకపోతే చంద్రబాబుని, ఆయన మాటలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జీరో అయ్యారు. 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితమయ్యారు. ఇక ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో కోలుకునే పరిస్ధితి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే ఎలాగైనా మరో పార్టీతో పొత్తు లేకుండా పోటీ సాధ్యం కాని పని. ఎన్నికల్లో ఒంటరి పోరు వల్ల లాభం లేదు. ఇక జనసేనకు అంత సీన్‌ లేదు. ఒక వేళ పొత్తుతో ఏదైనా లాభం జరిగినా మరునాటి నుంచే తలపొటు తప్పదు. రెండున్నరేళ్లు మేము..మరో రెండున్నరేళ్లు మీరు అన్న కాన్సెప్ట్‌ అమలు పర్చాల్సి రావచ్చు. లేకుంటే కేంద్రంలో మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే, జనసేన లాంటి పార్టీతో మహారాష్ట్ర లాంటి రాజకీయాలకు తెరతీయొచ్చు. ఇలాంటి వాటిలో ఎంతో దూర దృష్టితో వుండే చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలి. జనసేనను పక్కకు తప్పించాలి. అంటే బిజేపితో సఖ్యత కావాలి. కలిసి సాగాలి. కాంగ్రెస్‌తో వెళితే మొదటికే మోసం రావొచ్చు. పైగా ఆ పార్టీని ఆదరించేందుకు ప్రజలు కూడ సిద్దంగా లేదు. ఎటు తిరిగి చూసినా బిజేపేని పట్టుకొని ఎన్నికల గోదారి ఈదడమే సరైందన్న నిర్ణయానికి వచ్చి కొత్త రాజకీయం మొదలుపెట్టారు. అందుకే ఈ వరస బేటీలు…దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా చంద్రబాబును డిల్లీకి ప్రధాని మోడీ ఆహ్వానించారు.

పనిలో పనిగా చంద్రబాబుతో ఐదు నిమిషాలు రాజకీయం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో లంచ్‌చేశారు. అంటే ఇప్పుడే తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసుకున్నారు. కాకపోతే చంద్రబాబు అడిగిన సెక్యూరిటీ పెంచేశారు. చంద్రబాబుకు జడ్‌ కేటగిరిలో 12 సెక్యూరిటీ వుంది. ఇప్పుడు దాన్ని 24చేశారు. అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అందులోనూ దేశంలో బిజేపి ఎలాంటి రాజకీయాలు చేస్తుందో తెలిసిన సమయంలో చంద్రబాబుకు సెక్యూరిటీ విషయంలో జగన్‌కు ఇష్టంలేని పని చేశారు. అంటే పొత్తు పొడుపుకు సంకేతాలు పంపించారు. ఇక ఇదిలా వుంటే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రజల దృష్టంతా మునుగోడు కేంద్రీకృతమై వుంది. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన సభకన్నా, కేంద్ర మంత్రి అమిత్‌షా ఈనాడు అధినేత రామోజీరావును, సినీ నటుడు ఎన్టీఆర్‌ను కలసి వార్తలకే ప్రాధాన్యం పెరిగింది. రాజగోపాల్‌రెడ్డి పెట్టిన కోట్ల రూపాయల ఖర్చ గంగలో కలిపిపనట్లైంది. భవిష్యత్‌ రాజకీయాలను ఎంచుకునే సమయంలో రాజగోపాల్‌ రెడ్డి రాజకీయం కోసం బిజేపి ఆలోచిస్తుందా?

అందుకే తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాజకీయంగా ప్రధాన శత్రువులైన తెలుగుదేశం పార్టీని, మళ్లీ కలుపుకుపోతే తప్ప బిజేపికి మనుగడ లేదు. అందుకే ఎలాగూ తెలుగేదేశం పార్టీకి తెలంగాణలో ఎవరో ఒకరు దిక్కు కావాలి. ప్రజలు కూడా ఎన్టీఆర్‌వైపు చూస్తున్నారు. ఏదో రకంగా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లో ఇరికిస్తే, ఆయనకు తెలంగాణ రాజకీయాలు అప్పగిస్తే, సీమాంధ్రలోనూ ఓట్లు కురిపించేందుకు ఉపయోగపడతాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన స్ధానాలు కొన్ని వున్నాయి. వాటిలో తెలుగుదేశం కీలక భూమిక పోషించినా, మిగతా ప్రాంతాల్లో బిజేపికి బలం పెంచుకునే అవకాశం వుంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారం పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. సీమాంధ్ర రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ప్రస్తావన కనుమరుగౌతుంది. లోకేష్‌ను నాయకుడిగా గుర్తించేందుకు అవకాశం ఏర్పతుంది. అవసరమైతే సీమాంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో ఎన్ని వేషాలేసేందుకైనా కుదురుతుంది. ఇప్పటికే పదేళ్లుపాటు ఉమ్మడి రాజధాని అన్నది కొనసాగుతోంది. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప జగన్‌ చేసిందేమీ లేదు. దాంతో మళ్లీ అమరావతి మీద దృష్టిపెట్టడం కాన్న, తెలంగాణ రాజకీయాల మీద సమయం కేంద్రీకరించడం మేలన్న ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. బిజేపి కూడా అందుకు సై అన్నట్లే కనిపిస్తోందన్న వార్తలే వినిపిస్తున్నాయి. చంద్రబాబు, మోడీ పాత మిత్రులే. బిజేపి, తెలుగుదేశం పార్టీలు ఎన్‌డిఏలో మొదటినుంచి ఆప్తులే. కేసిఆర్‌ ఎలాగూ తిరుబాటు జెండా ఎగరేశాడు. కేంద్రంపై కత్తులు నూరుతున్నాడు. ఈ విషయంలో బిజేపికి, ప్రధాని నరేంద్ర మోడీకి పీకల దకా కోపం వుంది. ఎలాగైనా టిఆర్‌ఎస్‌ను కట్టడిచేయాలంటే, తెలుగుదేశం పార్టీని లేపాలి. లేకుంటే కాంగ్రెస్‌ లేచి నాట్యం చేస్తుంది. చేతికి బలమొస్తే కమలాన్ని పీకేస్తుంది. అందుకు ఒక్క దెబ్బకు రెండుపిట్టలు…అటు టిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలి…ఇటు కాంగ్రెస్‌ను రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయాలి. ఇదే ఇప్పుడు బిజేపి లక్ష్యం…తెలంగాణలో అధికారమే లక్ష్యం..! తెలుగుదేశంతో మళ్లీ సాగడమే నయా రాజకీయం!!

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ సహకారంతో

సర్పంచ్ బాషబోయిన ఐలేయ్య

ఖానాపురం నేటిధాత్రి:ఖానాపురం మండలంలోని రాగం పేట గ్రామానికి చెందిన యాసాల కొమురయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందగా అతని కుటుంబానికి ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ఒక క్వింటా బియ్యం పంపించగా సోమవారం రోజు అనగా గురువారం సర్పంచ్ బాషబోయిన ఐలయ్య ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏపూరి వెంకన్న,దుగ్యాల రాజేశ్వర్ రావు, అన్నెబొయిన లింగయ్య,అన్నెబొయిన ఎల్లయ్య,కప్పల శ్రీనివాస్,తడుగుల సాంబరాజు,కుందనపెళ్లి కృష్ణ గ్రామస్థులు పాలగిన్నారు.

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి

నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరన

ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్

గుగులోత్ రామ స్వామి నాయక్

నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్

బత్తిని శ్రీనివాస్ గౌడ్

ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు

ఖానాపురం నేటిధాత్రి:ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ గూగులోతు రామస్వామి నాయక్ వారి కార్యాలయం వద్ద ఖానాపురం నేటిధాత్రి రిపోర్టర్ జనగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఎంపీపీ ప్రకాష్ రావు, నర్సంపేట మార్కెట్ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,వారిచే ఆదివారం రోజు నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి పత్రిక అని ఎప్పటికిప్పుడు నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజల సమస్యలలో ముందుంటుందని అన్నారు. సమాజంలో మార్పు కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు అత్యంత రహస్య సమాచారాన్ని చేరవేస్తూ నిజమైన వార్తలను నిలువెత్తు రూపంగా నేటిధాత్రి పత్రిక అని,సమాజంలో మార్పు తీసుకువస్తూ అన్యాయం జరిగిన చోట ఆపద్బాంధవుడిలాగ ప్రజా సమస్యలను వెంటనే ఉన్నత అధికారులదృష్టికి తీసుకువస్తుంది నేటిధాత్రి పత్రిక అన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, వేములపల్లి వాసు, ఖానాపురం నేటిధాత్రి రిపోర్టర్ జగనం ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం కండి సీఎం కేసీఆర్ పిలుపు

 

*నేటిధాత్రి హైదరాబాద్*
12-1-2022
గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని, వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం మెడలు వంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచేలా కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై తన నిరసన వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాయనున్నారు.
రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్రప్రభుత్వం, ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం కోలుకోలేకుండా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి మాట తప్పిన కేంద్రం.. ఉల్టా రైతుల పెట్టుబడి ఖర్చులనే రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయడం, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడం, అష్టకష్టాలు పడి రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనకపోవడం లాంటి రైతు వ్యతిరేక చర్యలతో… నేడు దేశంలో రైతులు బతికి బట్టకట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఒక్కసారిగా ఎత్తివేసి, రైతులను వ్యవసాయం చేయకుండా దూరంచేస్తున్న బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం ఐక్యంగా తిరగబడితే తప్ప, వారికి బుద్ధి రాదన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రాష్ట్ర రైతాంగం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ధరలు తగ్గించే దాకా.. పోరాడాలన్నారు.
ఎనర్జీని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే వ్యతిరేకిస్తూ, వ్యవసాయాన్ని నెమ్మది నెమ్మదిగా కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్న బిజెపి చర్యలను దేశ రైతాంగం గుర్తించాలన్నారు. రైతుల పొలాల్లో.. రైతులనే కూలీలుగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version