సంక్షేమ హాస్టళ్ళ,విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థి పోరుయాత్ర

ఎస్ ఎస్ యు జెండాను ఊపి ప్రారంభించిన ఎల్తూరి సాయికుమార్ స్వేరో

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్

హనుమకొండ జిల్లా , నేటిధాత్రి.

మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు మరియు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అనేకమైనటువంటి సమస్యలు నెలకొన్న సందర్భంగా ఈరోజు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి పోరుయాత్ర అనే పేరిట హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలు ప్రతి ఒక్కటి తిరిగి ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి అనే ఒక సంకల్పంతోటి ఈరోజు యాత్రను ప్రారంభించుకోవడం జరిగింది. సంక్షేమ హాస్టల్లో మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనము మరియు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆ ఒక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేలా ఈ యాత్రను సెప్టెంబర్ 20నుంచి 30 వ తేదీ వరకు కొనసాగించడం జరుగుతోంది కావున విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విద్యార్థి పోరు యాత్రను విజయవంతం చేయగలరని హనుమకొండ జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో గజవెల్లి శ్రావణ్, చెట్టుపల్లి శివకుమార్ ,రవి ,సిద్దు ,అన్వేష్, నరేష్, సాయి, బాబు, మహేష్, తరుణ్ ,మనోహర్ మరియు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విలీనమా విమోచనమా విద్రోహ దినమా ?

ఆపరేషన్ పోలో అమరవీరులకు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు జోహార్లతో

భారత ప్రభుత్వానికి లొంగిపోయిన నిజాం రాజు తద్వారా విలీనం

నిజాం ప్రభువుకు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం వలన ఈ ప్రాంతం విలీనం అయినది, ప్రజలకు విమోచనం జరిగింది

భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో తో తెలంగాణ ప్రజల మానప్రాణాలను తీయడం విద్రోహం

ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది

భారతదేశమంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నిజాం రాజు చేతిలో బందీగా ఉంది. భారతదేశమంతా స్వతంత్ర పోరాటం చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం ఎంచుకొని నిజాం ప్రభువుకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రతిఘటనలు చేస్తూ పోరాటం ముందుకు సాగించారు. ఆగస్టు 15 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం ప్రభువు చేతిలో ఇంకా బందీగా ఉంది, యావత్ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తుంటే తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు నిజాం నిరంకుషానికి బలైపోతూనే ఉన్నారు, ఒకవైపు సాయుధ పోరాటం వల్ల నిజాం రాజుకు ముచ్చమటలు పటిస్తున్న తెలంగాణ ప్రజలు , రజాకార్లను, దేశ్ ముఖులను ఊర్ల నుండి తరిమికొడుతుంటే, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా వెళుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో సాయుధ పోరాట ప్రభావం చూపెడుతుందని భావించిన భారత ప్రభుత్వం ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి మిలటరీతో తెలంగాణ ప్రాంతమైనటువంటి హైదరాబాదు స్టేట్ ని భారత దేశంలో కలుపుకునేందుకు నిజాం రాజు పై దండయాత్ర చేయడం జరిగింది అలా తీసుకున్న చర్యనే ఆపరేషన్ పోలోగా ఆనాటి భారత ప్రభుత్వం చెబుతుంది. భారత దేశ మిల్ట్రీ హైదరాబాద్ స్టేట్ లో అడుగుపెట్టి నిజాం రాజుకు వ్యతిరేకంగా రజాకారులతో ప్రత్యక్ష యుద్ధం లో దిగారు ఇలా కొన్ని రోజులు సాగినటువంటి ఆపరేషన్ పోలో కి తలోగ్గిన నిజాం ప్రభువు భారత దేశ హోం శాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆనాటి భారత దేశ ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటం, ఇక్కడ ప్రజల చైతన్యాన్ని గమనించి ఈ చైతన్యమంతా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కచ్చితంగా వ్యాపిస్తుందని దాని ప్రభావం యావత్ భారతదేశంపై పడుతుందని దానివల్ల భారతదేశం అంతా కూడా కమ్యూనిస్టు దేశంగా మారే అవకాశం ఉందని గ్రహించి ఆపరేషన్ పోలోను చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ పోలో ముసుగులో రజాకారులను, సామాన్యులను, ఒక వర్గ ప్రజలను మరియు సాయుధ పోరాటం వీరులను అంతం చేయడం జరిగింది. మరోవైపు చరిత్రకారుల పుస్తకాల్లో తెలంగాణ ప్రజల మానప్రాణాలను ఆపరేషన్ పోలో ముసుగులో దోచేశారని, కుప్పల కొద్దీ శవాలు విలిన తర్వాత బయటపడ్డాయని అనేకమంది మహిళలు మానాలు కోల్పోయారని చరిత్రకారుల పుస్తకాల్లో లిఖించబడ్డాయ, అందుకనే కమ్యూనిస్టులు ఈ రోజును విద్రోహ దినంగా ప్రకటించాయి, మరోవైపు భారతదేశం దీన్ని విలీనం ప్రక్రియగా ప్రకటించి ఇక్కడి ప్రజలను నిజాం నిరంకుశ పాల నుండి విమోచనం చేశామని ప్రకటించడం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 యొక్క ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఈ రోజును ఒక ప్రత్యేక దినంగా తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా ఆపరేషన్ పోలో అమరవీరులకు, సాయుధ పోరాట అమరవీరులకు ఇక్కడ ప్రజల త్యాగాలకు గుర్తుగా ఈ రోజును జరుపుకాకుండా, చరిత్రను చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర పెత్తందారులు , ఆనాటి ముఖ్యమంత్రులు ఇలా చరిత్ర కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంటే ఇక్కడి ప్రజలు చైతన్యవంతమై 1969లో విద్యార్థి ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మా హక్కులను మేము కాపాడుకుంటామని పోరాటం చేశారు ఆనాడు వందలాదిమంది విద్యార్థుల ప్రాణాలను బలికున్నారు ఆంధ్ర పెత్తందార , ముఖ్యమంత్రులు. ఆ తర్వాత తెలంగాణ వాదం కొన్ని రోజులు మరుగునపడిన 2001 తర్వాత అది రాజకీయ ఉనికిని పుచ్చుకొని మరో ఉద్యమంగా మారింది అలా సాగుతున్న ప్రయాణంలో 2009లో ఉద్యమం ఉధృతంగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగింది వేలాదిమంది ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ప్రపంచ చరిత్రలో త్యాగాలు చేసిన వీరులను చూశారు కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరులను తెలంగాణ ప్రాంతంలోని చూశాను, ఎందుకంటే ఒకవైపు భారత దేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పైన చేస్తున్నటువంటి అణచివేతను తీవ్రంగా ప్రతిఘటిస్తూన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను చూసి కొంతమంది వారి ఆత్మ బలిదానాలు వలన చలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాలు ప్రకటిస్తాయి అనుకున్నారు, అలా చాలా మంది అమరులయ్యారు అలా అమరులైన ప్రతి అమరుడికి జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ అస్తిత్వ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు చివరిగా వివిధ పార్టీలు సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించిన అధికారికంగా సెప్టెంబర్ 17న ఇంతవరకు నిర్వహించలేదు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం గా ప్రకటించి అధికారికంగా నిర్వహించబోతోంది దానికి తెలంగాణ ప్రజల తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ దినోత్సవం రోజున ముందుగా సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమం, మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వీరులకు, ఆపరేషన్ పోలో అమరులైనటువంటి అమాయక ప్రజలకు, వీరులకు శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాలకు సరైన న్యాయం చేసి, ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారి త్యాగాలకు తగిన గుర్తింపుని ఇవ్వాలని వారికి ఉద్యమకారుల పెన్షన్లతో గౌరవించాలని ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల్లో ఇళ్లను కట్టించి ఇవ్వాలని అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పెషల్ కోటను ప్రకటించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రభుత్వానికి ఉద్యమకారుల తరఫున కోరుకుంటున్నాం. ఏదేమైనాప్పటికీ చరిత్రలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం ఇక్కడ ఆధిపత్య కులాలు మరియు ఆంధ్ర పెత్తందారులు ముఖ్యమంత్రులు చేసి, అమరవీరుల అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేయడం దుర్మార్గమని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మన చరిత్రను ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా పుస్తకాలను రూపొందించి దేశ, విదేశాలకు తెలంగాణ చరిత్రను వ్యాప్తి చెందేలా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.

ఆర్టికల్ రాసింది:
తాడిశెట్టి క్రాంతి కుమార్
తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు,
హనుమకొండ జిల్లా జేఏసీ కన్వీనర్,
తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం కన్వీనర్,
వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కంటెస్టెడ్ కాండేట్

చిరకాల స్వప్నం నెరవేరిన వేళ మెదక్ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ అనుమతులు రావడం శుభ పరిణామం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు

– జిల్లాలోని యువత డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు కావాలి. మైనంపల్లి….

– వైద్యా కళాశాల అనుభవిజ్ఞులైన వైద్యాధికారులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…..

 

– దీని వెనుక విశేష కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమాత్యులు దామోదర్ రాజనర్సింహ….

– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెడికల్ యంత్రాంగానికి ధన్యవాదాలు…..

– మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు…..

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

బుధవారం మెదక్ మెడికల్ కలశాల మంజూరి సందర్బంగా పీళ్ళికొటాలలో ఉన్న తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించరు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించనున్న శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ రాహుల్ తో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భావనాలను, సమకూర్చిన, ఫర్నిచర్, పరికరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలోనే మెడికల్ కాలేజీ మంజూరు అయిందన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ వైద్య విద్యకు న్యాయం చేసిన వేళ జిల్లాలో యువత ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారయ్యే వేల ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మెదక్ మెడికల్ కాలేజ్ మంజూరి చేసినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు జిల్లా కలెక్టర్ కు, అధికారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
నర్సింగ్ కళాశాల,మెడికల్ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు.
జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం పీళ్ళికొటాలలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కళాశాల భూమిని
శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ పరిశీలించి భవన నిర్మాణాలకు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజనలో భాగంగా మెదక్ ప్రత్యేక జిల్లా అయినా కూడా అంత అభివృద్ధి చెందలేదని జిల్లా అభివృద్ధిలో విద్యా ,వైద్యం సౌకర్యాలు మెరుగు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు వైద్య కళాశాల మంజూరు కావడం దీని వెనక విశేష కృషి చేసిన జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు, హెల్త్ సెక్రెటరీ , ధన్యవాదాలు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యాధికారులు ఉండడం స్థానికంగా ఉండి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మెడికల్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.
అంతకుముందు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు రాందాస్ చౌరస్తాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించకుని సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శివ దయాల్, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
వార్డ్ కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ అధికారులు , మెడికల్ కళాశాల సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

మార్కెట్ చైర్మన్ కు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల అభినందనలు.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా భాద్యతలు తీసుకున్న పాలాయి శ్రీనివాస్ ను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలసి పూల బోకే అందించి శాలువా లతో సత్కరించి అభినందించారు
ఛైర్మెన్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛందసంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్,ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్,స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ బాధ్యుడు,బెజ్జంకి ప్రభాకర్, ఛాయా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కోట డేవిడ్,జిల్లా వినియోగదారుల మండలి సభ్యుడు నాగెల్లి
సారంగం,నర్సంపేట మెడికల్ షాప్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ తంగెళ్ళ రవికాంత్,,స్వచ్ఛంద సంస్థల సభ్యులు చారి,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి.

*”నేటిధాత్రి” బిగ్ బ్రేకింగ్*

ధరణిలో మార్పులు చేసేందుకు రూ. 8 లక్షలు డిమాండ్.*

*భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు.* 

*నిన్న రాత్రి నుంచి ఇద్దరి ఇళ్లలో కొనసాగుతున్న అధికారుల తనిఖీలు.* 

*బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసీబీ.*

*బాధితుడు నుంచి డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.* 

*జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి.*

కోడి పుంజుల పల్లి అంగన్ వాడి కేంద్రం లో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య (ఇసిసిఇ), అనువల్ డే వేడుకలు

ఎండపల్లి,నేటి ధాత్రి
కోడి పుంజుల పల్లి అంగన్ వాడి కేంద్రం , లో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య, అనువల్ డే వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలు బాల బాలికలను ఆకట్టుకున్నాయి, ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని కోడిపుంజులపల్లి లో నీ అంగన్ వాడి కేంద్రం లో ,అంగన్ వాడి ఉపాధ్యాయురాలు కొప్పుల పుష్పలత ఆధ్వర్యంలో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య (ఇసిసిఇ) లో భాగంగా మహిళలు,బాల బాలికలు హాజరై పలు కార్యక్రమాలను వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మహిళలు, బాల బాలికలు పాల్గొన్నారు

మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

గణపురం

మండల కేంద్రంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కావటి రజిత అధ్యక్షతసమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సమావేశంలో ఎంపీడీవో భాస్కర్, ఎమ్మార్వో ,వైస్ ఎంపీపీ విడిది నేని అశోక్, కో ఆప్షన్ సభ్యుడు ఎండి చోట మియా, ఎంపీటీసీలు ,గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు మండల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం.

నెంబర్ ప్లేట్ లేని 24 వాహనాలు రెండు ఆటోలు సీజ్.

25 లీటర్ల గుడుంబా 1700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. ఇద్దరిపై కేసు నమోదు.

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామ పరిధిలోని ఒంటిప్ప తండ గ్రామంలో గురువారం రోజున భూపాలపల్లి డిఎస్పి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఇందులో భాగంగా సరైన ధ్వపత్రాలు మరియు నంబర్ ప్లేట్లు లేని లేని 24 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు సీజ్ చేయడమైనది, అలాగే 25 లీటర్ల ప్రభుత్వ నిషేధ గుడుంబా మరియు 1700 లీటర్ల బెల్లం పానుకమును ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది, ఈ సందర్భంగా డి.ఎస్.పి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయం గనుక ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అలాగే ఎటువంటి సమస్య వస్తే వెంటనే 100 కాల్ చేయగలరని ముఖ్యంగా గ్రామంలో యువకులు, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గంజాయి, గుట్కా,గుడుంబా , గ్యాంబ్లింగ్ లాంటి వాటి దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో చిట్యాల సిఐ డి మల్లేష్ యాదవ్, చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్, రేగొండ ఎస్సై రవికుమార్, టేకుమట్ల ఎస్సై ప్రసాద్ ,చిట్యాల సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ బృందం పాల్గొన్నారు.

మహా మండలంలో మెడికల్ మాఫియా జోరు.

నిబంధనలు అనుమతులకు తోట్లు జనరిక్ మందుల విక్రయాలు.

ప్రతి ఆర్.ఎం.పి వద్ద మెడికల్ షాపు నిర్వహణ.

మహాదేవపూర్ పలివెల మండలాల్లో 38 మెడికల్ షాపుల నిర్వహణ.

అద్దె ఫార్మసీ సర్టిఫికెట్, తో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫార్మసిస్టులే.

కాసుల మత్తులో డ్రగ్స్ అధికారులు, అక్రమ మెడికల్ నిర్వహణపై నేటికీ చర్యలు లేవు, అధికారులకు అయ్యప్ప గుడి అక్షింతలు.!?.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

మెడికల్ షాప్ నిర్వహణ మందుల విక్రయాలు ఆషామాషీ వ్యవహారం కాదు అద్దె ఫార్మసీ సర్టిఫికెట్ తో నిర్వాహకునికి సంబంధించిన వారందరూ ఫార్మసిస్టులే అనుకుంటూ ప్రజలకు మందులు విక్రయించడం జరుగుతుంది. మెడికల్ షాప్ నిర్వహణకు సంబంధించి కనీస నిబంధనలు కూడా లేకుండా మహదేవ్పూర్ పలివెల ఉమ్మడి మండలంలో మెడికల్ మాఫియా రెచ్చిపోవడం జరుగుతుంది. నేడు ప్రజలు సత్వర ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మందుల దుకాణాలను నమ్ముకుని ఉండడం వాటిని ఆసరాగా చేసుకున్న మెడికల్ మాఫియా నిర్వాహకులు ఫార్మసీ కెమిస్ట్ అండ్ రిజిస్ట్ అనే పదాన్ని అద్దె సర్టిఫికెట్ తో నిర్వాహకుల కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు కూడా ఫార్మసిస్టుగా మారి మందులను విక్రయించడం జరుగుతుంది. ఇలా మందులు విక్రయించడం అమాయక రోగుల ప్రాణాలకు సంబంధించి కేవలం మందులపై ఉన్న ఎంఆర్పి ధర కి ప్రాధాన్యమిస్తూ కంపెనీ బ్రాండెడ్ మందులకు బదులు ఉమ్మడి మండలమంతా జనరిక్ బంధువులను విక్రయిస్తూ పేద రోగుల నుండి కాసులు దండుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉమ్మడి మండలం చరిత్రలోనే జిల్లా డ్రగ్ అధికారి మందుల దుకాణాల తనిఖీలు చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం లేవు.

మహా మండలంలో మెడికల్ మాఫియా జోరు.

మెడికల్ షాప్ మందుల దుకాణం నేడు ప్రజాజీవనంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందుల అవసరాలకు వేద ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరూ మెడికల్ షాప్ లో విక్రయించే మందులపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. మహదేవ్పూర్ ఉమ్మడి మండలంలో మందుల విక్రయాలకు సంబంధించి ప్రధాన గ్రామాలు ఒక మెడికల్ మాఫియాగా ఏర్పడి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఫార్మసీ అనుమతులు లేకుండా కేవలం బీఫార్మసీ సర్టిఫికెట్ లను అద్దెకు తీసుకొని నామమాత్ర మెడికల్ పరిజ్ఞానం ఉన్న లేకున్నా సులువుగా డబ్బు సంపాదించాలని ఆశతో ప్రజల ఆరోగ్యాలను కూడా చూడకుండా విచ్చలవిడిగా మెడికల్ షాపులు ఏర్పాటు చేసి మందులను విక్రయిస్తున్నారు. కేవలం ఒకరు ఇద్దరు బీఫార్మసీ అర్హత ఉండి మెడికల్ షాపులు నిర్వహిస్తున్న క్రమంలో ఓకే లైసెన్స్ పై వారు కూడా అనేక మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకుని మందులను విక్రయించడం జరుగుతుంది.

నిబంధనలు అనుమతులకు తోట్లు జనరిక్ మందుల విక్రయాలు.

మెడికల్ షాప్ నిర్వాహణ సాధారణ ఇతర దుకాణాలు ఏర్పాటు చేసినట్లు చేసే పరిస్థితి ఉండదు.డ్రగ్ లైసెన్స్ డిపాజిట్ ఫీజు లేదా చలాన్ ఇన్‌వాయిస్‌లు,ప్రాంగణం కోసం బ్లూప్రింట్ లేదా కీ ప్లాన్.ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకునే ఆధారం.యజమానులు లేదా భాగస్వాముల గుర్తింపు మరియు చిరునామా రుజువు,ప్రాంగణం యొక్క యాజమాన్య రుజువు,నమోదిత మరియు ,పూర్తి సమయం పని చేసే నమోదిత ఫార్మసిస్ట్ లేదా సమర్థ వ్యక్తి యొక్క అఫిడవిట్.డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 ప్రకార కఠిన నిబంధనలతో మెడికల్ షాప్ నిర్వహణ తోపాటు విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి మండలంలో విచ్చలవిడిగా నిర్వహించబడుతున్న మెడికల్ షాపులకు ఇలాంటి అనుమతులు లేకున్నప్పటికీ సాధారణ గ్రామపంచాయతీ పరువు రిజిస్ట్రేషన్ తో బందుల దుకాణాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక మందుల విక్రయాలకు సంబంధించి కంపెనీ మందులకు హోల్ సేల్ ధర రిటైల్ ధరకు పోలిస్తే కేవలం 10% మార్జిన్ ఉంటుంది గనుక జనరిక్ మెడిసిన్ 60 శాతం మార్జిన్ లాభం రావడంతో మెడికల్ షాపుల్లో అన్ని జనరిక్ మందుల విక్రయాలు మరో విచిత్రం ఏమిటంటే ప్రైవేట్ కంపెనీలు శాంపుల్ అందించినటువంటి రిప్రెజెంట్ న్యూస్ ద్వారా వచ్చిన బంధువులను ఒక ప్రధాన నగరం నుండి నో సెల్ అని ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి మండలంలోని మెడికల్ షాపుల్లో విక్రయాలు జరపడం కొనసాగుతుంది.


ప్రతి ఆర్.ఎం.పి వద్ద మెడికల్ షాపు నిర్వహణ.

ఇక ప్రస్తుతం మహాదేవపూర్ గుమ్మడి మండలంలోని 26 గ్రామాల్లో ఒకవైపు మండల కేంద్రం నుండి మొదలుకొని ఆరు మూల ప్రాంతాల వరకు ప్రాథమిక చికిత్స కేంద్రం పేరుతో ఒక వ్యక్తి కుర్చీ వేసుకుని డాక్టర్ అంటూ తన పక్కకు మరో వ్యక్తి మందుల దుకాణం ఏర్పాటు చేసుకొని డాక్టర్ చిట్టి తీసుకున్న తర్వాత ఆ మెడికల్ షాపులకు వెళ్లి మందులు తీసుకోవడం ఆనవాయి, కానీ ఈ డాక్టర్ రాసింది ఏమిటి మెడికల్ షాప్ వివాహకుడు ఇచ్చిన మందులు తీసుకోవచ్చా అనే విషయానికొస్తే, ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే మందులు తక్కువ డోస్ ఉండడం కూడా ఇటు మెడికల్ నిర్వాహకులకు సంపాదించుకునే దారి అని చెప్పవచ్చు, ఎందుకంటే ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చే పారాసెటమాల్ 200 ఎంజిలు ఉంటే అదే డోలో పారాసెటమాల్ 500 ఎంజి మెడికల్ షాపుల్లో ఇవ్వడం జరుగుతుంది, కేవలం 40 నిమిషాల్లోనే వచ్చిన జనాన్ని మాయం చేసే ఘనత మెడికల్ షాపు దక్కించుకుంది. దూల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఆ మెడికల్ షాప్ నిర్వాహకులు మీకు తెలుసా దూలపై అతనికి పరిజ్ఞానం ఉందా సాధారణ వ్యక్తి డోలో మెడిసన్ వేసుకోవచ్చా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులపై మెడికల్ నిర్వాహకునికి ఏమైనా తెలుసా అలాంటి ఏమి విషయాలు అవసరం లేదు, ఎందుకంటే దాని పేరు మెడికల్ షాప్ అది ఆ రోగికి రోగాన్ని తక్షణం సాయం చేస్తుంది. ఇలా ఆర్ఎంపీల ముసుగులో వేల రూపాయలు మెడికల్ షాపుల ద్వారా అమాయక పేద రోగులను బురిడీ కొట్టిస్తూ సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఇలా సులువుగా అమాయకులను పెద్ద పెద్ద రోగాల్లో నెట్టే ప్రయత్నంలో తెలిసి తెలవని బంధువులను వారికి అందిస్తూ వేల రూపాయలను సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.

అద్దె ఫార్మసీ సర్టిఫికెట్, తో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫార్మసిస్టులే.

ఫార్మసిస్ట్ అవసరం లేదు మహదేవ్పూర్ మండలంలో మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకొని జనరిక్ మందులు ప్రజల్లో నాటుకుపోయిన కొన్ని కంపెనీ బంధువులను ఏజెన్సీల ద్వారా రప్పించుకొని మరోవైపు మెడికల్ రిప్రజెంటిటివ్ ల నుండి అందించే షాంపులను కూడా పెట్టుకుని ఫలానా మెడికల్ షాప్ అని ఒక చిన్నది రూమ్ లో నాలుగు మందులు డబ్బాలతో కూర్చుంటే సరిపోతుంది. అదే మెడికల్ షాప్, ఎవరైనా ప్రశ్నిస్తారని ముందే ఊహించిన మెడికల్ మాఫియా నెలకు 1500 రూపాయల చొప్పున అందించి ఒక డీఫార్మసీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీని లామినేషన్ చేసి మందుల డబ్బాలపై అతికిస్తే సరిపోతుంది, ఎవరు కూడా అడిగే పరిస్థితి ఉండదు. ఇంట్లో చిన్న పిల్లల నుండి మొదలుకొని పండు ముసలి వరకు అందరూ ఫార్మసిస్టులే, ఒక తెల్ల చిట్టి వస్తే సరిపోతుంది వారందరికీ తెలుసు చిట్టి వస్తే దేవుడు కరుణించినట్టే దాని తర్వాత ఒక తెల్ల సంచి అది కూడా ప్లాస్టిక్ రహిత, పేపర్ కవర్ ప్రజల ఆరోగ్యాలకు ప్లాస్టిక్ హానికరం కానీ ఏమీ తెలవని దొంగ ఫార్మసిస్టులు దొంగ మెడికల్ షాపులు మాత్రం సేఫ్ ఈ విధంగా ఆ తెల్ల కవర్ నిండిపోయి సుమారు 600 నుండి 800 వరకు బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇలా వైద్య విద్య ఫార్మసీ డ్రగ్ పై ఎలాంటి అవగాహన కనీస పరిజ్ఞానం లేకుండా ఒక లక్ష రెండు లక్షల రూపాయల పెట్టుబడి తో ఉమ్మడి మండలమంతా కిరాణం కొట్టులకు మించిపోయి మెడికల్ షాపులు ఏర్పాటుచేసి మందులు విక్రయించడం జరుగుతుంది.

కాసుల మత్తులో డ్రగ్స్ అధికారులు, అక్రమ మెడికల్ నిర్వహణపై నేటికీ చర్యలు లేవు, అధికారులకు అయ్యప్ప గుడి అక్షింతలు.!?.

ఇక మహాదేవపూర్ మండలంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా కనీస ఫార్మసీ చట్టాలకు దోచుకోకుండా ఒకవైపు షాంపూల్ మెడిసిన్ మరోవైపు కంపెనీల పేరుతో జనరిక్ మందుల విక్రయాలు మెడికల్ అంటే ఏమిటో తెలవని వారు కూడా ఫార్మసిస్టులుగా మారిపోయి విచ్చలవిడిగా మందుల విక్రయాలు చేస్తుంటే జిల్లా డ్రెస్ అధికారులు మాత్రం న్నెత్తి చూడడం లేదు. డ్రగ్స్ అధికారులు మెడికల్ షాపులపై దాడులు చేయడం జరిగిందని మెడికల్ షాపుల్లో నిర్వహణ అనర్హులుగా ఉండి మందుల దుకాణం నిర్వహిస్తున్నారని మెడికల్ షాపులో అమ్మే మందులు నిషేధిత మందులను విక్రయిస్తున్నారని ఇలాంటి సందర్భాలు మహాదేవపూర్ ఉమ్మడి మండలం అలాగే మహదేవ్పూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో జిల్లా డ్రగ్ అండ్ ఫార్మసీ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు, కేవలం ఒక యూనియన్ అధికారులకు మహదేవ్పూర్ మండల కేంద్రానికి ముందు ఒక అయ్యప్ప స్వామి ఆలయం అయ్యప్ప భక్తులకు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అయ్యప్ప దేవుడి సాక్షిగా ఆ అధికారి ఆలయం వరకి పరిమితమై స్వామివారిని దర్శించుకుని అక్షింతలు తీసుకొని వెళ్లిపోవడం జరుగుతుందని విశ్వనీయ సమాచారం, అయ్యప్ప స్వామి అక్షింతలు తీసుకున్న ఆ అధికారులు ఉమ్మడి మండలంలో మెడికల్ షాపుల నిర్వహణపై ఇలా చర్యలు తీసుకుంటారు స్వామివారికి కోపం వస్తుందని అక్షింతలతో సంతోషంగా వెళ్లిపోవడం జరుగుతుందని తెలుస్తుంది.

ప్రభుత్వ ఆసుపత్రికి స్టాఫ్ నర్స్ లే దిక్కు..

సమయపాలన పాటించని వైద్యులు.

విజిటింగ్ పేరుతో డ్యూటీ మధ్యలోనే డుమ్మా..

ఉన్నత వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడి సమయపాలన కరువు.

నర్సంపేట,నేటి ధాత్రి :

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తూ పల్లె దవాఖానలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.కానీ ఆ ఆసుపత్రులలో వైద్యుల సమయపాలన లేక మెరుగైన వైద్యం లోపిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అత్యవసర పరిస్థితుల్లో వెళ్లిన రోగులకు ఆసుపత్రిలో స్టాఫ్ నర్ లే దిక్కవుతున్నారు.ఇదే పరిస్థితి దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వం ఆరోగ్య కేంద్రంలో బుదవారం మధ్యాహ్నం జరిగింది.దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన కక్కెర్ల రమేష్ తెలుకాటుకు గురయ్యాడు.వెంటనే చికిత్సా నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లగా స్థానిక వైద్యాధికారి అందుబాటులో లేరు.వెంటనే స్పందించిన స్టాఫ్ నర్స్ సబిత తాత్కాలిక ట్రీట్ మెంట్ చేశారు.సమాచారం మేరకు నేటిధాత్రి ప్రతినిధి ఆసుపత్రికి వెళ్లగా
వైద్యాధికారి అందుబాటులో లేరు.వెంటనే ఫోన్ ద్వారా వివరణ కోరగా మందపల్లి పల్లె దవాఖానకు విజిటింగ్ కోసం వెళ్లానని తెలిపారు.మందపల్లి పల్లె దవాఖానకు వెళ్లగా మధ్యాహ్నం 2.30 గంటలకే ఆ పల్లె దవాఖానకు తాళంవేసి వెళ్ళిపోయారు.కాగా 3-40 గంటలకు హడావుడిగా చేరుకున్న వైద్యాధికారి రోగిని పరిశీలించి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ తెలుపుతూ 10 నిమిషాల వ్యవధిలోనే నర్సంపేట సివిల్ ఆసుపత్రి,వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు రెఫర్ చేశారు.ఈ సందర్భంగా బాధితుడు రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రికి వెళ్ళగానే డాక్టర్ అడుబాటులో లేదు అక్కడి స్టాఫ్ నర్సులు వైద్యం అందించారు.చాలా సమయం తర్వాత వచ్చిన డాక్టర్ నన్ను పరిశీలించి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుపుతూ 10 నిమిషాల వ్యవధిలోనే
నర్సంపేట సివిల్ ఆసుపత్రి,వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు వెళ్ళాలని రెఫర్ చేశారని ,ఉన్నత వైద్యాధికారి అయి ఉంది కనీసం అబ్జర్వేషన్ లో ఉంచుకోకుండా నర్సంపేట సివిల్ ఆసుపత్రి,వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు వెళ్ళాలని రెఫర్ చేయడం బాడకలిగిందని తెలిపారు.పల్లె దవాఖానలలో,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు
విజిటింగ్స్,మీటింగ్స్ పేరుతో డ్యూటీలను మధ్యలోనే డుమ్మా వెళ్లిపోతున్నారని పలువురు ప్రజలు,రోగులు ఆరోపిస్తున్నారు.పిహెచ్ సి లకు,పల్లె దవాఖానలకు వైద్యాధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని తరిస్థితి నెలకొంటున్నదని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లా ,డివిజన్ స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు,ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సమయపాలన పాటించని వైద్యాధికారులు,సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సభ స్థలన్ని పరిశీలించిన చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి

17 వ తేదీన హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని పరిశీరించిన పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వేలాది మంది బి.ఆర్.యస్.పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తరలి రావాలని,ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బి.ఆర్.యస్.పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.

ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.

మీడియాతో మంత్రి హరీశ్ రావు..

రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. కలిసి పని చేశాడు.
సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాము.

కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడు. ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి.

రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోతారు

11 మంది కార్పొరేటర్లు గెలిపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారు.

కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారు.

రామ్మోహన్ గౌడ్ కు బిఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుంది. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయి.

పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకు నేను బాధ్యత తీసుకుంటాను.

మన ఇంటి సమస్య మనం పరిష్కరించకుందాం.

కాంగ్రెస్ గెలిచేది లేదు. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు.

అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయి.

హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారు.

బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపే మా లక్ష్యం..!

*బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం అనే స్వచ్ఛంద సమితి ఏర్పాటు.

*అధ్యక్షురాలుగా భూతం సుశీల

మంగపేట నేటిధాత్రి

మంగపేట మండలం రాజుపేట గ్రామంలో స్వచ్ఛందంగా బడే నాగజ్యోతిని గెలిపించడానికి, బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం అనే స్వచ్ఛంద సమితి ని భూతం సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగిందనీ. ఈ సందర్బంగా భూతం సుశీల మాట్లాడుతూ,మహిళలమైన
మేము ముందు అడుగు వేసి, మా మహిళ శక్తిని చాటి చేప్పుతామని , బడే నాగజ్యోతక్క గెలుపులో మా పాత్ర కీలకం గా ఉండబోతుందని తెలియజేశారు. బడే నాగ జ్యోతక్క ను గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తెలియజేస్తున్నాము అని అన్నారు .పేదల బాధలు తెలిసిన నాయకురాలు, ప్రజాభివృద్ధి తన జీవిత ధ్యేయంగా ఆచరిస్తున్న ఆత్మీయురాలు, ఈ సమాజమే తమ కుటుంబం అని సమాజక్షేమం కోసం ప్రతిక్షణం ఆలోచించి శ్రమించే తత్వం ఉన్న బడే నాగ జ్యోతక్క అధికారంలోకి వస్తేనే మా జీవితాల్లో అభివృద్ధి వస్తుందని, అన్నారు. ఈ కార్యక్రమంలో బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం స్వచ్ఛంద సమితి సభ్యులు భూతం సుశీల, గూడపు పద్మ, మైపా రమణ, కర్రీ‌. కుమారి, మైప నాగమణి, కర్రీ. సరస్వతి, దార్ల రామక్క, కర్రి ముత్తమ్మ, రాణి, గంపల జయ, తదితరులు పాల్గొన్నారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బెల్ట్ షాపులను నియంత్రించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్

పాలకుర్తి నేటిధాత్రి

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మధ్య మాఫియాను అరికట్టడంలో ఎక్సేంజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామాలలో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ విమర్శించారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సిపిఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం మండల నాయకులు సోమసత్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా రమేష్ పాల్గొని మాట్లాడుతూ వివిధ గ్రామాలలో వైన్ షాపు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బెల్టు షాపు వాళ్లు అధిక ధరలకు మధ్యాన్ని అమ్ముతూ మద్యం ప్రియుల జేబులు గుల్లా చేస్తూనే మరోవైపు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే వైన్ షాపు యజమానులు సిండికేట్ గా మారి బెల్ట్ షాపుల దందాను నడిపిస్తుంటే సంబంధిత ఎక్సేంజ్ అధికారులు పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు వాపోతున్నారు. బెల్టు షాపుల వల్ల గ్రామాలలో ఉదయం నుండి మొదలుకొని రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగుడంతో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పాడుతుందని ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో బెల్ట్ షాపులు వందల సంఖ్యలో వెలుస్తున్నాయని అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలంటే గ్రామాలలో బెల్ట్ షాపులను నియంత్రించాలని ఇంత జరుగుతున్న ఎక్సేంజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు కానీ షాపు యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామాలలో పేదలు, కూలీలు, యువకులు లిక్కర్కు అలవాటు పడుతూ మద్యానికి బానిసై పనులకు సైతం వెళ్లకుండా నిత్యం మద్యం మత్తులోనే వారి జీవితం తెల్లారిపోతుందని, మద్యం మత్తులో కుటుంబ కలహాలు ఎక్కువై సంసారాలు బజార్న పడుతున్నాయని బెల్ట్ షాపుల వల్ల మహిళలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడి పోతున్నారని ఇప్పటికైనా ఎక్స్చేంజ్ అధికారులు నిద్రమత్తు విడిచి బెల్ట్ షాపులను నియంత్రించాలని అధిక ధరలకు విక్రయిస్తున్న బెల్ట్ షాపుల యజమాన్యంపై చర్యలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, నాయకులు ముసుకు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

మదర్ తెరిసా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

 

మందమర్రి, నేటిధాత్రి:-

మందమర్రి పట్టణంలోని మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థిని, విద్యార్థులు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందస్తు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎన్జిఓ భువనేశ్వరి మాట్లాడుతూ, విద్యార్థినీ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ, విద్యాబుద్ధులతో ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రార్థిస్తూ, బతుకమ్మ సంబరాలు ఆనంద ఉత్సాహాలతో పాఠశాల ఆవరణలో జరుపుకోవడం జరిగిందని అన్నారు. మన పూర్విక సాంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని తెలిపారు.

మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

 

ఊరువాడ ఒక్కచోట చేరి ఆడబిడ్డలు ఆనందంగా రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ స్వాగతం పలకగా…
మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

మహిళలు తమ కష్ట సుఖాలను పాటల ద్వారా చెప్పుతూ స్వాగతం పలకగా…
మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

మాయమ్మ నువ్వమ్మ మమ్మేలు మాయమ్మ
అంటూ వేడుకొనగా…
మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు గాజుల సవ్వడితో స్వాగతం పలకగా…
మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన మన ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ
ఎంగిలి పులా బతుకమ్మ శుభాకాంక్షలు.
శ్రీమతి మంజుల పత్తిపాటి కవయిత్రి
చరవాణి 9347042218

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు

 

భూపాలపల్లి నేటిధాత్రి

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని రావణ్ గా మార్ఫింగ్ ఫోటోలు చిత్రీకరించి, వివాదాస్పద అంశాలకు తెరలేపిన కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి తీరును ఖండిస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి అయిత ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై, వారి కుటుంబ సభ్యులపై అధికారాన్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో వారి ప్రతిష్ట దిగజార్చేందుకు బిజెపి చేస్తున్న కుటీల రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బిజెపి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం దారుణమైన, హేయమైన చర్యగా అభివర్ణించారు భారత్ జోడోయాత్ర తర్వాత రాహుల్ గాంధీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక మతిభ్రమించి బిజెపి పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు ఇప్పటికైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చల్లూరి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కొమురయ్య, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్,కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, చిట్యాల మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మూల శంకర్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పొనకంటి శ్రీనివాస్, కంచర్ల సదానందం, కాగితోజు రమణాచారి, అయిలవేణి రమేష్, పుల్ల మహేష్,ఖాసీం,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బీర్తి పృద్వి,చుంచుల మహేష్, ఉస్మాన్,నోముల నారాయణ, మూత సహదేవ్, మట్టేవాడ సురేష్, అఖిల్,మురళి,సాగర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ పార్టీ లోకి నవాబుపేట బిఎస్పి,మాజీ మండల అధ్యక్షులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం పోమాల గ్రామానికి చెందిన,
బిఎస్పి మాజీ మండల అధ్యక్షులు,పిడుగు సుధాకర్.తన సొంత గూటికి చేరుకున్నారు. మాజీమంత్రి వర్యులు& ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గులాబీ కండువా కప్పి బి, ఆర్, ఎస్, పార్టీలో కీ ఆహ్వానించారు. గురువారం రోజు ఎంపీటీసీ ఊర్మిళాదేవి ఆధ్వర్యంలో మరియు బి, ఆర్, ఎస్, పారీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, ఆధ్వర్యంలో పిడుగు సుధాకర్ చేరడం జరిగింది. పిడుగు సుధాకర్ మాట్లాడుతూ,గత తొమ్మిదేళ్లుగా సుస్థిర సుపరిపాలన అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది అని, అన్నారు. బిఆర్ఎస్, పార్టీ బలపరిచిన.
లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలిపిద్దాం అని తెలిపారు.

భద్రాచలం మంత్రి కేటీఆర్ వస్తున్నందున సీఐటియు నాయకుల అక్రమ అరెస్టు

 

అంగన్వాడీ,ఆశా,మధ్యాహ్న భోజన కార్మికుల మానవహారం రాస్తా రోకో
ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
భద్రాచలానికి మంత్రి కేటీఆర్ వస్తున్నందున భద్రాచలం ఆఫీసు లో ఉన్న అంగన్వాడీ సీఐటీయూ నాయకులు జిలుకర పద్మ, ఎం బీ నర్సారెడ్డి,పాల్వంచలో సీఐటీయూ నేత దోడ్డా రవి కుమార్ లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి దుమ్ముగూడెం పోలీసు స్టేషన్ కు తరలించడానికి నిరసనగా గుండాల లో గత ఇరవై రోజులుగా అంగన్వాడీ లు, ఆశా వర్కర్లు 6రోజులుగా గత మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు(సీఐటీయూ) ఎంఆర్ఓ, ఎంఈఓ ఆఫీసుల వద్ద గల సమ్మె శిబిరాలను ప్రదర్శనగా వచ్చి పీ హెచ్ సి సెంటర్ కూడలి వద్ద రాస్తా రోకో, మానవహారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కే మరియ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా నాయకులు వజ్జ సుశీల,పాయం సారమ్మ , ఎం డి నజ్మ లు మాట్లాడుతూ ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వకపోగా సమ్మె లో ఉన్న కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యాహరిస్తున్నదని అన్నారు.ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని, లేనిచో సమ్మె తీవ్రం చేస్తామన్నారు.సీఐటీయూ నేతలు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీలు కౌసల్యా,కళావతి,నీలిమ, వెంకటమ్మ,సరోజ, ఆశా లు అదిలక్ష్మి,వినోద,ఈశ్వరి,లక్ష్మీ,జయమ్మ,మధ్యాహ్న భోజన కార్మికులు పొంబాయిన లక్ష్మీ,నర్సమ్మ,చంద్రక్క,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

డబ్బులు ఊరికే రావు!

https://epaper.netidhatri.com/

`గిట్టుబాటు కావాల్సిందే!

పెట్టుబడి రాబట్టాల్సిందే!!

`గాంధీ భవన్‌ కు వేసిన సున్నాలతో సహా ఖర్చు వసూలు చేసుకోవాల్సిందే?

`పిసిసి పదవే రేవంత్‌ రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని అప్పట్లో వెంకట రెడ్డి అన్నదే…

`ఆ ఖర్చు ఇలా జమచేసుకోవాల్సిందే!

`ఆయారాం…గయారాం!?

`కాంగ్రెస్‌ లో అంతా గందరగోళం!

 

`వచ్చే వాళ్లు ఎందుకు వస్తున్నారో క్లారిటీ లేదు?

` గెలుస్తామన్న నమ్మకం ఎంతుందో తెలియదు?

` కాంగ్రెస్‌ గాలి వుందో లేదో అర్థం కావడం లేదు?

` బిజేపి పని అయిపోయిందని, కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు?

`వచ్చే వాళ్లంతా గాలి వాటం నాయకులే?

`ఒకవేళ వచ్చిన వాళ్లు గెలిచినా, పార్టీ అధికారంలోకి రాకుంటే హాండ్‌ ఇవ్వరన్న గ్యారంటీ లేదు?

`మంచి మంచి నాయకులే కాంగ్రెస్‌ ను వీడారు?

`గర్‌ వాపసీ అని వచ్చే వాళ్లు మళ్ళీ గడప దాటరా?

`టిక్కెట్ల లొల్లి ఆగలేదు?

`టికెట్ల అమ్మకం గోల ఆగడం లేదు?

`కర్ణాటకలో బలమైన నేతలున్నారు…అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తోడైంది.

`తెలంగాణ లో ప్రభుత్వ వ్యతిరేకత లేదు.

`కాంగ్రెస్‌ మీద ప్రజలకు సానుభూతి లేదు.

`తెలంగాణలో సీనియర్లున్నారు…బలమైన నాయకులు లేరు?

`వాళ్ల గెలుపుపై వాళ్లకే ఆశలు అంతంత మాత్రం.

`వాళ్లు నలుగురిని గెలిపించడం కష్టం.

`కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం గాలిలో దీపం!

హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయంలో కాంగ్రెస్‌ను ఎవరూ ఓడిరచాల్సిన పనిలేదని ఊరికే అనరు. తనను తాను బతికించుకోవాల్సిన తరుణమైనా సరే, మునిగిపోతున్నా సరే ఓడిరచుకునే విషయంలో వున్నంత పట్టుదల గెలుపులో చూపించుకోరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం వరకు రాజకీయంగా ఎదురులేని సమయంలో గెలుస్తూ వచ్చింది. కాని ఎప్పుడైతే దేశ రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావంతో కాంగ్రెస్‌ చతికిల పడడం, లేవడం పరిపాటిగా మారినా, ఇకపై బతికి బట్టకుడుతుందా? లేదా? అన్నది అందరికీ అనుమానమే. అందుకే కాంగ్రెస్‌లో ఎవరు ఎప్పుడు నాయకులౌతారో? అన్నది తెలియకుండాపోయింది. ఎవరు కాంగ్రెస్‌ను కాపాడతారో? అన్న ఎదురుచూపులు మిగులుతున్నాయి. ఇదే అదునుగా కాంగ్రెస్‌ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకున్న రేవంత్‌ రెడ్డి ఆడిరది ఆట పాడిరది పాటౌతుంది. రేవంత్‌కు రాజకీయం ఆట విడుపుగా మారితే, సీనియర్లకు రాజకీయ సంకటం మొదలైంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు ఆ మాత్రం మిగిలి వున్న కాంగ్రెస్‌ను రేవంత్‌ పూర్తిగా మింగేయడం ఖాయమని అందరూ చెబుతున్నమాటే. రేవంత్‌ చేరిన నాటి నుంచి అదే మాట చెబుతున్నారు. అదే బాటలో కాంగ్రెస్‌ సాగుతోంది. పాత కాపులు నిలబెట్టింది లేదు. కొత్త కాపు ఉద్దరిచ్చింది లేదు? అన్న సామెతలాగా కాంగ్రెస్‌ పరిసి ్ధతి మారిపోయింది. రేవంత్‌ను ముందు పెట్టి అధిష్టానం ఆట ఆడుతోంది. రేవంత్‌ను విమర్శిస్తూ సీనియర్లు గోల చేస్తున్నారు. ఇక్కడ దేనికీ సింక్‌ కావడం లేదు. అధిష్టానం రేవంత్‌ను ఎందుకు ఎందుకు అంత గడ్డిగా నమ్ముతుందన్నదానిపై ఎవరికీ సష్టత లేదు. సీనియర్ల మాట ఎందుకు కాదంటున్నారన్నదానిపై ఎక్కడా వివరణ లేదు. కాని పాము, ముంగీస ఆటలు సాగుతున్నాయి. ఎవరి బలం ఎంత అన్నది మాత్రం తెలియకుండాపోయినా రేవంత్‌ పెత్తనం మాత్రమే పైకి కనిపిస్తోంది. గత ఆరు నెలల కాలంగా రేవంత్‌రెడ్డి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ షురూ చేసిండన్న సంగతి అందరికీ తెలుసు. ఒక్కొ నియోజకవర్గంలో ఒకరిద్దరికి పైగా అశావహులను లైన్లో పెట్టిండని తెలుసు. ఆనాడు మాత్రం ఏ సీనియర్‌ మాట్లాడలేదు. ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకుంటుండు అన్న ప్రచారం సాగిస్తున్నారు. అంతే తమకంటే పరోక్షంగా రేవంత్‌ అతి బలవంతుడని ఒప్పుకున్నట్లౌతుందన్నది తెలుసుకోలేకపోతున్నారు.
రేవంత్‌ రెడ్డి ఎలా పిసిసి. అధ్యక్షుడు అయ్యారన్నదానిపై ఎవరి లెక్కలు వారికి వున్నాయి.
ఎందుకంటే స్వతాహాగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌వాది కాదు. పచ్చి కాంగ్రెస్‌ వ్యతిరేకి. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దగ్గర నుంచి రాష్ట్ర స్ధాయి నేతలను ఎవరినీ వదిలిపెట్టకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకుడు. అలాంటి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమే ఆశ్చర్యకరమైన విషయం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరు అనేది నానుడే అయినా, తిట్టిన కాంగ్రెస్‌లో నాయకుడు కావడం వేరు. కాంగ్రెస్‌కే నాయకుడు కావడం వేరు. కాని రేవంత్‌రెడ్డి ఏకంగా పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు. రేవంత్‌ తిట్టిన తిట్లు విన్న నేతలు ఇప్పుడు ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ఇదే రాజకీయం అంటే ఇంత వరకు బాగానే వుంది. ఇప్పుడు రేవంత్‌ టిక్కెట్టకు పెద్దఎత్తున డబ్బులు తీసుకుంటున్నాడని అంటున్న కాంగ్రెస్‌ నేతులు గతంలో రేవంత్‌ రెడ్డి కోట్లు పెట్టి పిసిసి. పదవి కొనుక్కున్నాడంటూ ఆరోపణలు చేశారు. అంటే కాంగ్రెస్‌లో పదవులు కావాలంటే అడిగినంత సమర్పించుకోవాల్సిందే అన్నది సీనియర్లే నేర్పినట్లైంది. కోమటి రెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్‌ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పిసిసి. అధ్యక్షుడు అయ్యాడు అన్న మాటలు చెప్పిందే…తెలంగాణ ప్రజలు విన్నదే…ఇప్పుడు రేవంత్‌రెడ్డి టిక్కెట్టు అమ్ముకుంటున్నాడన్న మాట మాట్లాడే అర్హత వారికి వుందా? డబ్బులు ఊరికే ఎవరికీ రావు..ఆనాడు పెట్టిన డబ్బు రేవంత్‌ తిరిగి ఎలా సంపాదించుకోవాలన్నదానిపై లెక్కలుండవా? మిగతా నాయకుల డబ్బులు మాత్రమే , డబ్బులా? రేవంత్‌ పెట్టిన ఖర్చుకు లెక్కుండొద్దా? పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నా గాంధీ భవన్‌ బాగు చేసుకోలేకపోయారు? కొత్త గాంధీభవన్‌ కట్టుకోలేకపోయారు? కొన్నేళ్ల తర్వాత గాంధీభవన్‌ కు కొత్త కళ తెచ్చింది రేవంత్‌రెడ్డి కాదా? ఆయన పిసిసి. అధ్యక్షుడు అయ్యాకే కొత్త కొత్త రంగులు వేయలేదా? లోపల అంతా ముస్తాబు చేయలేదా? అందుకు రేవంత్‌కు ఖర్చు కాలేదా? అదంతా తిరిగి రాబట్టుకోవద్దా? గాంధీ భవన్‌కు వేసిన సున్నాల సొమ్ముతో సహా పెట్టిందంతా రాబట్టుకోవాల్సిందే….ఆ ఖర్చు జమా ఖర్చులో వేసుకోవాల్సిందే…కాదనే అధికారం..అర్హత ఎవరికీ లేదు. కాంగ్రెస్‌ చేసుకునే స్వయంకృతాపరధాంలో ఎప్పుడూ సెల్ప్‌ గోల్‌ చేసుకోవడం అలవాటే…
నిజంగా కాంగ్రెస్‌కు చిత్త శుద్ది వుంటే రేవంత్‌ను మించిన నాయకుడే కాంగ్రెస్‌లో దొరకలేదా?
అంటే ఔననే సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వస్తే నేనే సిఎం. అన్న నాయకులు అనేక మంది. ఇప్పటికీ ఒక వేళ పార్టీ అధికారంలోకి వస్తే నేనే సిఎం అంటూ ఇంకా కలలు కంటున్నవాళ్లు ఏం తక్కువ లేరు. కాని పార్టీని కాపాడుదాం..నిలబెడదాం…ముందుండి నడుద్దాం…పార్టీని రక్షించుకుందా…కష్టపడి అధికారంలోకి తీసుకొద్దామన్న ఆలోచన వున్న నాయకులు ఎంత మంది వున్నారు. తెలంగాణ రాగానే నాకు పిసిసి కావాలంటూ కోరి మరీ అధ్యక్షుడు అయిన పొన్నాల లక్ష్మయ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీని నడపడం నావల్ల కాదని వదిలేశాడు. నేను వుండలేనంటూ పార్టీకి మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడయ్యాడు. కాని ఏం లాభం? అతి బలవంతంగా పిపిసి. అధ్యక్షుడిగా కొనసాగాడు. ఆఖరుకు ఇక నా వల్లకాదంటూ ఆయనకూడా కుర్చీ దిగిపోయాడు. ఆ తర్వాత పిసిసి. నాకే కావాలని కొట్లాడిన వారు లేరు. ఇస్తే తప్ప తీసుకోము అన్నట్లు మాట్లాడినవారే ఎక్కువ. సీనియర్లు బలంగా వుంటే రేవంత్‌ ఎందుకు పోటీకి వచ్చేవారు…పిసిసి. సీటు ఎలా సాధించేవారు? అయినా కాంగ్రెస్‌నాయకుల్లో ఐక్యత లేదు. రాదు…వస్తుందన్ననమ్మకం ఇప్పటికీ లేదు. సీనియర్లలలోనే తలోదారి నడిచేవారే ఎక్కువ. అందుకే రేవంత్‌రెడ్డిది ఆడిరది ఆట పాడిరది పాటగా మారింది. నిజానికి పొన్నాల లక్ష్మయ్య పిసిసి. అధ్యక్షుడుగా వున్న సమయంలో కాంగ్రెస్‌ అంతో ఇంతో బలంగా వున్నది. కాని పైకి ఎంతో వీక్‌గా కనిపించింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడు వున్న సమయంలో కూడా కాంగ్రెస్‌ ఊపు మీదేవుంది. కాని లోన ఏదో వెలితిగా వుండేది. రేవంత్‌ రెడ్డి రాకతో ఎంతో జోష్‌ నిండిరది. లోన మాత్రం అంతా ఖాళీగానే వుంది. రేవంత్‌ పిసిసి. కాకముందు ఉప ఎన్నికల్లో కనీసం ఎంతో కొంత ప్రభావం చూపుతూ వచ్చింది కాంగ్రెస్‌. కాని రేవంత్‌ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉప ఎన్నికలో కూడా కనీసం డిపాజిట్‌కూడా రాకుండాపోయాయి. ఇదీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు పైకి పెంచినట్లు కనిపించినా, గ్రౌండ్‌కు దిగిజార్చిన గ్రాఫ్‌.
ఇదిలా వుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌లో జోష్‌ నింపినట్లు చేసిన రేవంత్‌స్కెచ్‌ మాత్రం ఆయనకు కాసుల పంట పండిస్తోందని అంటున్నారు.
ఎందుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కర్నాటకలో బిజేపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌ గెలిస్తే, తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఊపు రావడం అంటేనే మమ్ములను చూసి ముంత ఒలకబోసుకోవడం…దాన్ని చూసి ఇతర పార్టీలనేతలు కాంగ్రెస్‌కు క్యూకట్టడం..అది రేవంత్‌రెడ్డికి అనుకూలంగా మారడం…ఒక రకంగా సీనియర్లు చెబుతున్నట్లు ఆదాయవనరుగా మారడం…! ఇంత వరకే రాజకీయం… ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడదు..కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదు. రేవంత్‌ జేబులు నిండడం తప్ప మరోకటి లేదు…ఈ మాటలంటున్నది ఎవరో కాదు… సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ నేతలు..కరిమింగిన వెలగపండు గదరా…రేవంత్‌ తీరు..అంటున్నారు సీనియర్లు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version