మందు బాబులకు అడ్డాగా.. ప్రభుత్వ కళాశాల..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో మందు బాబులకు ప్రభుత్వ కళాశాల అడ్డగా మారింది. వారం రోజులపాటు దసరా సెలవులు ఉండడం.. సెక్యూరిటీ లేకపోవడంతో మందుబాబులు కళాశాలకు వచ్చి మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో పాఠశాల విద్యార్థులు వాటిని చూసి అవాక్కయ్యారు. కళాశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో మందుబాబులు అడ్డాగా మారిందన్నారు. మందుబాబుల ఆగడాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఉన్నతాధికారులు…