కడుపులోనే ఖతం!

`ఆడపిల్ల పుట్టొద్దా! అసలు బతకొద్దా!?

`కడుపులో పడడమే ఆడపిల్ల చేసుకున్న నేరమా?

`వరంగల్‌ జిల్లా కేంద్రంగా విచ్చలవిడిగా బ్రూణ హత్యలు!

`ఇటీవల అబార్షన్‌ వికటించి మహిళ మృతి!

`వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసింది?

`నిత్యం పదుల సంఖ్యలో అబార్షన్లు?

`ఓ ప్రాథమిక చికిత్స కేంద్ర నిర్వాహకురాలి నిర్వాకం?

`మూడు సార్లు జైలుకెళ్లొచ్చినా ఆపని వ్యాపారం?

`లక్షలకు లక్షలు వసూలు?

`అబార్షన్‌ వికటించి, ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి చేర్ఛినా దక్కని మహిళ ప్రాణం?

`వీటన్నింటికీ చక్రం తిప్పుతున్నదెవరు?

`పురిటిలోనే ఆడపిల్లలను ఆగం చేస్తున్నారు?

`కడుపులోనే పసికందుల ప్రాణాలు తీస్తున్నారు?

`ఇదో పెద్ద రాకెట్‌…?

`హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు అందరూ సంప్రదించేది ఆ మహిళనే!

`తెలంగాణ వ్యాప్తంగా వందలాది ఆసుపత్రులకు ఆమెతో లింకులే?

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బృణ హత్యలు…ఇంకా ఎంత కాలం విందాం…ఎంత కాలం చెప్పుకుందాం…ఇంకా ఏ ఆటవిక సమాజంలో బతుకుతున్నాం….? రాజుల కాలం నుంచి వింటూనే వున్నాం…ఇంకా భ్రూణ హత్యలు చేస్తూనే వున్నాం…ఇంకెంత కాలం…ఆడ..మగ తేడాలు…! ఆడపిల్ల పుట్టడమే నేరమా? ఆడపిల్ల కడుపులో పడడమే శాపమా? ఆడ పిల్ల పుట్టొదా? పుట్టినా బతుకొద్దా? బతికి రేపటి తరానికి దారి చూపొద్దా… ఈ ప్రపంచానికి మానవ మనుగడను అందించించొద్దా? అయినా ఒక జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు? మూగ జీవాలను చంపడమే నేరమైన మన సమాజంలో కళ్లు తెరవని పసిగుడ్డును కర్కషంగా అత్యంత ఫాషవికంగా చిద్రం చేయడానికి మనసెలా వస్తోంది? ఒక ఆడపిల్లను చంపడం అంటే అమ్మను చంపడం కాదా? అమ్మలేకుండా ఈ సృష్టి వుంటుందా? ఈ సృష్టిలో అమ్మలేకుండా ఏ జీవైనా పురుడుపోసుకుంటుందా? సృష్టికి మూలమైన అమ్మనే పురిటిలోనే నులిమి, నలిపి చంపడం పాపం కాదా? ఆపదలు వస్తే అమ్మా అని కొలుస్తాము…అడ్డంకులు ఎదురైతే దేవతలకు పూజలు చేస్తాము..కాని ఆడపిల్ల మన ఇంట్లో పడుతుంటే వద్దనుకుంటాము? మగ సంతామనే కావాలి…ఎంత మంది మగాళ్లు పుట్టిన ఫరవాలేదు…కాని ఆడపిల్ల మాత్రం వద్దనుకునే సమాజం, తనను తానే నాశనంచేసుకుంటోంది….బృహత్యలు చట్టరిత్యా నేరం: 

మన దేశంలో గర్భస్ధ లింగనిర్దారణ పరీక్షలు చట్టరిత్యా నేరం. పిసి.పిఎన్‌డిటి. ఆక్ట్‌ 1994 ప్రకారం గర్భధారణ, పూర్వ గర్భస్ధ పిండ నిర్ధారణ పరీక్షలు చేసే వారికి, చేయించుకునే వారికి కూడా శిక్షలున్నాయి. మూడు సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తారు. ఇవే కాకుంగా లింగనిర్ధారణ పరీక్షల విషయంలో వరకట్న వ్యతిరేక శాసనాలు…నిశేద చట్టం 1961 ప్రకారం లింగనిర్ధారణ పరీక్షలు నేరం.అమాయక ప్రజలు బలహీనతలను ఆసరాగా చేసుకొని, ప్రాణాలు నిలపాల్సిన చేతులతో ప్రాణాలు తీస్తున్నారు. ఆడ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఓ వైపు పెద్ద ఎత్తున పెట్టబడిపెట్టి పెద్ద పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్న వాళ్లు, మరో వైపు వైద్యం సరిగ్గా తెలియకపోయినా డాక్టర్లుగా చెలమణీ అయ్యేవాళ్లు ఓ రాకెట్‌గా ఏర్పాటె ఈ దుర్మాగర్గం నెరుపుతున్నారు. ప్రజల బలహీనతలతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ కోట్లాది రూపాయల ప్రాణం ఖరీదు వ్యాపారం సాగిస్తున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా అందుకు కేంద్రంగా నడుస్తోందంటే వైద్య వృత్తి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

లింగనిర్ధారణ పరీక్షలు చేయడమే నేరమైనప్పుడు తప్పని పరిస్ధితుల్లో చేయొచ్చన్న చిన్న లొసుగును కూడా వాడుకుంటూ ఇలా ఆడపిల్లల జీవితాలు పిండ దశలోనే పిసికేస్తున్నారు..పాపాలు మూటగట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే తాజా వెలుగులోకి వచ్చింది. ఓ జంటకు ఇప్పటికే ఇద్దరమ్మాయిలున్నారు. ఆ ఇద్దరితో ఆ జంట సరిపెట్టేకుంటే బాగుండేది. కాని కొడుకు కావాలి. పున్నామన నరకం నుంచి బైట పడేయాలన్న మూఢ నమ్మకం మన దేశంలో ఎంతో మంది జీవితాలను అర్ధాంతరంగా తనువు చాలించేలా చేస్తోంది. మరోసారి గర్భం దాల్చిన అమ్మాయికి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దాంతో మళ్లీ ఆడపిల్ల అని తేలింది. అప్పటికే సమయం కూడా మించిపోయినా ఆ పిండం వుంచుకోకూడదని ఆ కుటుంబం భావించింది? కాసుల కక్కుర్తి కోసం ఎలాంటి ఆబార్లన్లైనా చేయగలిగిగే వాళ్లు కూడా జిల్లాలో తయారయ్యారు. అలాంటి వారిలో ఓ జంట వైద్య వృత్తిని అడ్డుపెట్టుకొని ప్రాణాలను కూడా తోట కూర కాడల్లా తుంచేసే కార్యక్రమాలు గత కొంత కాలంగా సాగిస్తున్నారు. ఇప్పటికే వైద్య వృత్తిని అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులు చేస్తున్న మహిళపై మూడు క్రిమినల్‌ కేసులు నమోదై వున్నాయి. మూడు సార్లు జైలు జీవితం కూడా అనుభవించింది. అయినా సరే ఇలాంటి భ్రూణ హత్యలు చేయడం ఆపడం లేదు. కొన్ని సార్లు ఈ ఆఫరేషన్‌ వికటించి, తల్లి ప్రాణాలు కూడా కోల్పోయేందుకు కారణం కావడం జరుగుతూనే వుంది. ఈ నిపుణురాలుకాని, వైద్య విద్యతో సంబంధం లేకపోయినా నకిలీ అవతారమైన ఆ మహిళా వైద్యురాలికి జిల్లాలోని అనేక ఆసుపత్రులతో సంబంధాలున్నాయి. ఇలా వికటించిన కేసులు ఆయా ఆసుపత్రులకు పంపించడం మేలు జరిగితే ఆయా కుటుంబాలనుంచి లక్షలు వసూలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఒక వేళ ఏదైనా ఆపరేషన్‌లో తేడా జరిగి, మహిళల ప్రాణాలు కోల్పోతే వారికి నష్ట పరిహారం చెల్లించి మరీ కేసులు నమోదు కాకుండా చూసుకుంటున్నారు. నిత్యం పదలు సంఖ్యలో అబార్షన్లు చేసుకుంటూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతో కలిసి వాటాలు పంచుకుంటున్నారు. ఏటా కొన్ని కోట్ల రూపాయాల నేరమైన దందాను సాగిస్తున్నారు. 

తాజాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే ఓ మహిళకు సదరు నేరస్ధురాలైన వైద్యురాలు ఆపరేషన్‌ చేసి పిండాన్ని తీసే ప్రయత్నం చేశారు? ఏం జరిగిందో గాని రక్త స్రావం ఎక్కువ కావడంతో ఆమెను వరంగల్‌లోని ఓ పేరు మోసిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఎంతో రక్తం పోయిన మహిళకు ఆ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న క్రమంలో గుండెకు సంబంధించిన సమస్య ఎదురైంది? దాంతో వెంటనే తేరుకున్న ఆ ఆసుపత్రినుంచి ఆ మహిళను మరో ఆసుపత్రికి తరలించారు. కాకపోతే అక్కడ చికిత్స అందుతున్న సమయంలోనే ఆ మహిళ ప్రాణాలుపోయాయి. దాంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ మహిళను పంపించేసి ఆసుపత్రులు, వైద్యురాలి ముసుగులో వున్న కిలేడి చేతులు దులుపుకున్నారు…ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. మొగ్గలోనే ఓ పసి ప్రాణాన్ని తుంచేశారు…ఇద్దరు అమ్మాయిలను అనాధలను చేశారు…? ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలకు దిక్కెవరు? ఓ అమాయపు జంట ఆశలను ఆసరాగా చేసుకొని ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న తల్లికి నిర్లక్ష్యంగా వైద్యం చేసి, పిండాన్ని తీసేసే క్రమంలో ఆమె ప్రాణం తీశారు. ఇద్దరు అమ్మాయిలు అనాధలను చేశారు.. వారి ఆలనా,పాలనా ఎవరు చూస్తారు? వారి జీవితాలకు ఎవరు భరోసా కల్పిస్తారు. సహజంగా ఇలాంటి సందర్భంలో ఏ డాక్టరైనా కడుపు తీయించుకోవడం నేరమన్న సంగతైనా చెప్పాలి. ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదని వారిలో చైతన్యం నింపాలి. ప్రాణాలు నిలిపే వైద్య వృత్తిలో వుంటూ కాసులకు కక్కుర్తి పడే వాళ్లు తయారు కావడంతో ఇలాంటి దుర్మార్గాలు దర్జాగా సాగుతున్నాయి. ఎక్కడో ఒకటి వెలుగులోకి వస్తున్నా, వాటిని కరెన్సీ కట్టల మాటున దాచేస్తున్నాయి. జిల్లా వైద్య శాఖ ఏం చేస్తోంది? నిద్ర పోతోందా?

ఇలా భ్రూణ హత్యలు విచ్చలవిడిగా జరుగుతుంటుంటే, అయాకుల ప్రాణాలు తోడేస్తుంటే, కడుపులోనే పిండాలను చిదిమేస్తుంటే ఏం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన వెలుగులోకి ఇన్ని రోజులైనా వైద్య శాఖ ఎందుకు కదలడంలేదు. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఇలాంటి దుర్మార్గాలు నిత్యం జరుగుతుంటే మంతి ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఆమెకు ఈ సంఘటన తాలూకు వివరాలు తెలిశాయా? లేదా? ఒక వేళ తెలిస్తే మంత్రి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్నది కూడా ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా దోషులను గుర్తించండి. తప్పు చేసిన వారిని పట్టుకోండి. నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేయండి. అన్యాయం పాలైనా ఆ కుటుంబాన్ని ఆదుకోండి. భవిష్యత్తులో భ్రూణ హత్యలు చేయడానికి ఏ డాక్టరైనా భయపడేలా చర్యలు తీసుకోండి…హెచ్చరికలు జారీ చేయండి. ఇంతటి దుర్మార్గానికి కారణమైన ఆసుపత్రుల లైసెన్పులు రద్దు చేయండి? వైద్యలు లైసెన్పులు కూడా సస్పెండ్‌ చేయండి? ఆసుపత్రులమీద నిరంతర నిఘా ఏర్పాటు చేయండి. ఆడపిల్లను బతికించండి…!

ఇదిగో ఆధారం! రాజీనామాకు ఎప్పుడు సిద్ధం!?

`ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ విసిరిన ఛాలెంజ్‌ కు ఇవిగో సాక్ష్యాలు?

`సవాలు విసిరి మరీ రిజిస్ట్రేషన్‌ శాఖను చిక్కుల్లోకి నెట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌!

`పరోక్షంగా శాఖకే సవాలు విసిరిన వైనం?

`పై అధికారుల చేతగాని తనాన్ని ఎద్దేవా చేసినంత ఉదంతం?

`తన అవినీతికి పట్టుకోలేకపోయారని ఎగతాళి చేసినంత పనిచేసిన సబ్‌ రిజిస్ట్రార్‌?

` అవినీతికి అడ్డాగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం మార్చి ప్రైవేటు వ్యక్తుల జోక్యం తేటతెల్లం?

` ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా? లేదా!

` ఇన్ని సాక్ష్యాలను మరుగున పడేసిన విచారణ అధికారులు కూడా దోషులే?

`పత్రికలన్నీ కథనాలు రాసినా స్పందన లేని అధికారులు ఇప్పుడేం చెబుతారు?

`ఎవరీ బిక్షపతి?

`అతనికి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి సంబంధం ఏమిటి?

`లాగిన్‌ ఐడి అతని చేతికెలా వచ్చింది?

`ప్రైవేటు వ్యక్తులకు లాగిన్‌ ఐడి ఇవ్వడం నేరం కాదా?

`సబ్‌ రిజిస్ట్రార్‌ ను ఇంత కాలం వెనకేసుకొచ్చిన వాళ్లది కూడా తప్పే?

`ఏళ్లకేళ్లు తిష్ట వేసుకొని సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన తప్పులకు రుజువులివి!

`తప్పులు చేసి, నేటిధాత్రి మీద నిందలేస్తే ఊరుకుంటామా?

`ఇంతకన్నా రుజువులేం కావాలి?

`ఇప్పటికైనా విచారణ మొదలుపెడతారా? మీనమేషాలే లెక్కిస్తారా!

`నేటిధాత్రి చేతిలో సబ్‌ రిజిస్ట్రార్‌ అక్రమాల చిట్టాలు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ములుగులో సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన అక్రమాలకు నిరదర్శనం. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారని చెప్పడానికి సాక్ష్యం. అక్రమాలు చేసినట్లు కనిపిస్తున్న దృశ్యం…ప్రైవేటు వ్యక్తికి లాగిన్‌ ఐడి కూడా ఇచ్చినట్లు తేట తెల్లం…బైట పడిన వ్యక్తి నామదేయం…ఇప్పుడేం చెబుతారు? ప్రకటించినట్లే సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం నుంచి తప్పుకుంటారా? తప్పు జరిగిందని ఒప్పుకుంటారా? అయినా బుకాయించడానికి కొత్త దారులు వెత్తుక్కుంటారా? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారా? అంతా తూచ్‌ అంటారా? ఇవన్నీ కల్పితాలంటూ కొత్త రాగం అందుకుంటారా? జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాక కూడా బుకాయిస్తే సరిపోదు…తాను తప్పు చేయలేదంటే ఎవరూ ఒప్పుకోరు…? అతి విశ్వాసం అనర్దాలకు దారి తీస్తుంది. ఒక తప్పు వంద తప్పులను చేసేందుకు ఆస్కారమిస్తుంది. ఇంత కాలం ఏ అధికారులైతే సబ్‌ రిజిస్ట్రార్‌ను వెనకేసుకొచ్చారో…వాళ్లును కూడా ఒక్క మాటతో సబ్‌ రిజిస్ట్రార్‌ దోషులను చేసినట్లే లెక్క. ఎందుకంటే తాను ఎలాంటి తప్పు చేయలేదని పై స్ధాయి అధికారులకు కూడా తెలుసున్నంతగా గొప్పగా తనను తాను చిత్రీకరించుకున్నారు. అంటే పెద్దల ఆశీస్సులు తనకు మెండుగా వున్నాయని, తానేం తప్పులు చేసినా చూస్తూ ఊరుకున్నారని చెప్పకనే చెప్పినట్లైంది. పైగా తనపై వచ్చిన ఆరోపణలపై కూడా జరిగిన విచారణల్లో కూడా తప్పేం లేదని తేలినట్లు కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ చెప్పుకున్నారు. అంటే విచారణ కోసం వచ్చిన అధికారులు కూడా పొరపాటు చేశారని చెప్పినట్లే లెక్క. ఒక వేళ విచారణ చేసిన అధికారులకు సబ్‌ రిజిస్ట్రార్‌ లాగిన్‌ ఐడి ప్రైవేటు వ్యక్తికి ఇచ్చినట్లు కనిపెట్టలేకపోయారా? బైటపట్డా ఆమెను వెనకేసుకొచ్చారా? ఆమెకు క్లీన్‌ చీట్‌ ఇచ్చారా? అంటే విచారణ చేపట్టే అధికారులకు కూడా ఆమె ఇక్కడ ఇరికించేసినట్లే లెక్క. తాను చేసిన అక్రమాలన్నింటిలో పై స్ధాయి అధికారుల పాత్ర కూడా వుందని స్వయంగా సబ్‌ రిజిస్ట్రారే వెల్లడిరచినట్లైంది. ఓ వైపు సవాలు విరుసురుతూనే మరో వైపు ఎన్ని తప్పులు చేసినా వెకనేసుకొచ్చిన అధికారులకు కూడా ముప్పు తెచ్చేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ వెనకాడడం లేదన్నది కూడా తేలిపోయింది. తను తప్పించుకునేందుకు ముందే మార్గం సుమగమం చేసుకుంటూ, ప్రతి దాంట్లో పైస్ధాయి పెద్దలను ఇరికిస్తూ వచ్చారన్నది తేటతెల్లమైంది. ఇప్పుడు ఉన్నతాధికారులు ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. 

ఇంతకీ బిక్షపతి ఎవరు? 

ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయలంలో ప్రభుత్వ ఉద్యోగా? ప్రైవేటు వ్యక్తా? సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తిపేరు డాక్యుమెంట్లలోకి ఎలా చేరింది? బిక్షపతి ప్రైవేటు వ్యక్తి అయితే కార్యాలయంలో విధులెలా నిర్వర్తించారు? ఆయనను ఎవరు రిక్రూట్‌ చేసుకున్నారు? ఎలా విధులు అప్పగించారు? ప్రభుత్వమేమైనా కాంట్రాక్టు పద్దతిన తీసుకున్న ఉద్యోగా? అయినా రిజిస్రేషన్‌ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగులకు అంత స్వేచ్ఛ వుంటుందా? లాగిన్‌ ఐడిని ఉపయోగించేంత శక్తి వుంటుందా? ఇదంతా సబ్‌ రిజిస్ట్రార్‌ కనుసన్నల్లో జరగుకుండా వుంటుందా? సబ్‌ రిజిస్ట్రార్‌కు తెలియకుండా లాగిన్‌ ఐడి తెలుస్తుందా? ఓపెన్‌ అవుతుందా? ఒక ప్రాంతానికి చెందిన భూమలైన స్ధిరాస్ధులు, ప్రభుత్వ ఆస్ధులు, స్థలాలు, ముఖ్యంగా అటవీ భూముల నిర్వహణ జరిగే ప్రాంతంలో బాధ్యతాయుతమైన సబ్‌ రిజిస్ట్రార్‌ ఎంత అంకితభావంతో వుండాలి. ఎంత కర్తవ్య దీక్షతో వుండాలి. అది వదిలేసిన కార్యాలయాన్ని ఎవరి చేతిలోనే పెట్టేసి, జరగాల్సిన అక్రమాలకు కేంద్రంగా మార్చేసి తానేమీ ఎరగను? తనేం తప్పు చేయలేదు? తప్పు చేస్తే ఇంత కాలం ఎలా వుంటాను? అంటూ కొత్త పల్లవి అందుకోవడమే కాదు…తన తప్పులు నిరూపిస్తే ఉద్యోగం మానుకుంటానని కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రకటించారు…

ఒక మంచి పని చేయడానికి ఎంత దూరమైనా వెళ్లొచ్చు. 

ఎంత సేవైనా చేయొచ్చు…ఇది ఎవ్వరూ కాదనలేరు. ఎంత దూరమెళ్లినా, ఎవరికీ అన్యాయం చేయకుండా వుంటేనే ఏ సేవకైనా అర్ధం పరమార్ధం వుంటుంది. దోసెడు దోచుకున్నట్లు ఆరోపణలు కంటి ముందుకనిపిస్తున్నా, పిడికెడు పెట్టి కొండంత ప్రచారం చేసుకుంటుంటే ప్రజలు గుర్తించలేరా? పెట్టే పిడికెడు కష్టపడి సంపాదించింది కాదు…పేదలను కష్టపెట్టి దోచుకున్నదాంట్లో నుంచి మెతుకులు విదిలిస్తే గమనించలేరా? పెట్టిన పిడికెడుకు పుట్టెడు ప్రచారం చేసుకుంటే సరిపోదు…దోచుకున్న దోసెడుకు కూడా సమాధానం చెపాల్సి వస్తుంది? పవిత్రమైన ఉద్యోగ నిర్వహణలో వుంటూ, ప్రజల భూములకు రక్షణగా నిలవాల్సిన కుర్చీలో కూర్చొని ఆ భూములకే ఎసరు పెడుతుంటే జనానికి తెలియకుండా పోతుందా? పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే కనిపించదా? జనం దగ్గర దోచుకోవడానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్‌ దాచుకున్నదేమీ లేదు? కర్తవ్యం గంగలో కలిపి, చెంచా నైవేద్యం చేతిలో పెట్టి నాకిస్తా..? అందిన కాడికి దోచేస్తా…భూములను చెరపట్టేవారికి అండగా వుంటా? అంటే జనం సహిస్తారా? తానేమీ తప్పు చేయలేదంటూనే తనపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏదో విచారణ చేపట్టి, క్లీన్‌ చీట్‌ ఇచ్చినట్లు చెప్పుకున్నా బాగుండేది? 

కాని ఓ ఎవరో ఒక వ్యక్తి విచారణ చేసి, తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని సర్టిఫికెట్‌ ఇచ్చాడని చెప్పుకోవడంలోనే డొల్లతనం బైటపడిరది. పైగా కార్యక్రమాలలో ఎమ్మెల్యే సీతక్క చేసే సేవా కార్యాక్రమాలలో పాలు పంచుకుంటూ, ఆమెతోపాటు వెళ్లినంత మాత్రాన సబ్‌రిజిస్ట్రార్‌ చేసేది కూడా సేవే అని ఎవరూ అనుకోవడం లేదు. అంతే కాదు సీతక్కతో పాటు వెళ్లి, సేవ చేస్తున్నట్లు కనిపించడం కూడా పెద్దఎత్తున ప్రచారానికి వాడుకోవడం జరుగుతుంది. ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగులు వితరణల్లో పాల్గొన్నప్పటికీ బైటకు ప్రచారం చేసుకోవడం కనిపించదు. కాని సబ్‌ రిజిస్ట్రార్‌ చేసే గోరంత సాయానికి కొండంత ప్రచారం అన్నది అందరూ చెప్పుకునే మాటే…ఇక ఇటీవల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం సాక్షియగా జరుగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటీ బైటకు వస్తుండడంతో దివంగత తన తండ్రిని ముందు పెట్టుకొని సానుభూతి ప్రయత్నం కూడా వదలుకోవడం లేదు. తన తండ్రిని నక్సలైట్లు చంపారని సబ్‌ రిజిస్ట్రారే చెప్పుకుంటుంటోంది? మరో వైపు తనపై మావోయిస్టు సానుభూతి పరురాలన్న ముద్ర వేయాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తోంది? ఒక ఉద్యోగి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా నేరమే…గతంలో ఎంతో మంది ఉద్యోగులను కూడా పోలీసు వ్యవస్ధ విచారణ చేసిన సందర్భాలు ములుగు ప్రాంతాల్లోనే కోకొల్లలు…! అసలు ఆ మాట నోటినుంచి వెలువడి ఉద్యోగులను కూడా విచారించకుండా పోలీసులు వదల్లేదు..ఇది చరిత్ర. అంతే కాదు తన తండ్రి కమ్యూనిస్టుగా చెప్పుకుంటూనే తన తండ్రిని నక్సలైట్లు చంపారని చెప్పడం నిందలో భాగమా? గొప్ప కోసమా? అలాంటప్పుడు తాను సానుభూతి కోసం చెప్పుకోవడంలో అర్ధమేమిటి? ఒక వ్యక్తి నక్సలైట్లకు వ్యతిరేకంగానో, లేక పోలీసులకు అనుకూలంగానో, పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నవారిని మాత్రమే నక్సలైట్లు చంపేవారని చెప్పుకునేవారు…మరి తన తండ్రి కమ్యూనిస్టు అని తెలిసినా తర్వాత నక్సలైట్లు చంపారంటే ఏదో బలమైన కారణం లేకుండానే జరిగిందా? అయినా గతం తాలూకు సంఘటనలను కూడా అడ్డం పెట్టుకొని ఉద్యోగ నిర్వహణ వదిలేసి, సేవ కార్యాక్రమాల పేరు చెప్పి, అక్రమాలు చేస్తుంటే కూడా మీడియా చూస్తూ ఊరుకోవాలా…? ప్రశ్నించకూడదు? అక్షరం రాయకూడదు? తనకు వ్యతిరేకంగా రాస్తే నిందలేస్తా? లేకుంటే కేసులు నమోదు చేయిస్తా? అనగానే సరిపోదు…మీడియా తన కర్తవ్యం నుంచి పారిపోదు…మీడియా అన్నది సజీవమైన ఒక వ్యవస్ధ…వ్యక్తులు భయపేట్టాలని చూస్తూ వణికేదు…బెనికేది కాదు…ప్రజా స్వామ్యానికి నాలుగో స్ధంభం…దాన్ని కూడా కలుషితం చేస్తా…నేను చేసే తప్పులన్నీ ఒప్పులని రాయించుకుంటా? అనుకుంటే అక్షరాలెవరికీ బానిసలు కాదు…? ప్రశ్నలకు ప్రతిరూపాలు…అన్యాయాలను ఎదిరించే అస్త్రాలు!

ఉపేక్షిస్తే లాభం లేదు! వేటేస్తేనే మేలు!?

అవకాశవాదులను సాగనంపాల్సిందే!

ఎన్నికల ముందు తలనొప్పులు తెచ్చేవారిని దూరం పెట్టాల్సిందే!

పార్టీ నిరంతర ప్రవాహం….

పార్టీ పురుడపోసుకున్న నాటి నుంచి వచ్చేవారు వచ్చారు…

వెళ్లేవారు వెళ్లిపోయారు…

రాజకీయాల్లో హత్యలుండవు…ఆత్మహత్యలే అన్నది నిజం…

ఎన్నికల మందు ప్రశాంతత పార్టీకి ఎంతో అవసరం….

పంటి కింద రాళ్లను పక్కన పెట్టాల్సిందే…

పక్క పార్టీల వైపు చూస్తున్నవారిని పంపేయాల్సిందే…

తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకున్న నాటి నుంచి నేటి దాకా వచ్చే వాళ్లు వచ్చారు..వెళ్లే వాళ్లు వెళ్లారు…మధ్యలో వదిలేసి వెళ్లి మళ్లీ వచ్చి చేరిన వారున్నారు..ఇంకా వెళ్లేందుకు అదును చూసుకుంటున్నవాళ్లు వున్నారు…పంటి కింద రాయిలా మారిన వాళ్లుకూడా వున్నారు…పక్క పార్టీల వైపు చూస్తున్న వారూ వున్నారు…రాజకీయ పార్టీ అన్నది నిరంతర ప్రవాహం…అది కొత్త నీరును చేర్చుకుంటూ వెళ్తుంది…అంతే కాని ఆగిపోయేది కాదు..స్వార్ధ పరులు ఎల్ల కాలం ఒకే దగ్గర వుండరు…అంకిత భావం వారిలో ఎప్పుడూ కనిపించదు. ఎప్పటికప్పుడు దారుల వెతుక్కుంటూ వుంటారు…ఎంత ప్రాధాన్యమిచ్చినా చంకన పెట్టుకున్నా జారి పోయేందుకే సిద్ధంగా వుంటారు….అలాంటి వాళ్లు ఎంత కాలం వున్నా పార్టీకి ప్రయోజనం లేదు. అత్యాశను వదలుకోరు…అంతా నాకే అనుకుంటారు…తనకు తాను గొప్పగా ఊహించుకుంటారు…అలాంటి వాళ్లు ముందు ఎవరూ ముందుకు వెళ్లొదు..పదవులు అందుకోవద్దు…ఇతరులు ఎదుగుతుంటే చూడలేరు…ఇలాంటి మనస్తత్వం వున్న వారు పార్టీకే ప్రమాదరకంగా మారుతారు…ఇతరల పాత్రలు కూడా తమకే కావాలని కుత్సితాలు పన్నుతుంటారు…ప్రజలు తిరస్కరించినా పదవులు కోరుతుంటారు…తీరకపోతే పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టే కుట్రలకు తెరతీస్తుంటారు..అలాంటి ప్రతి పార్టీలోనూ వుంటారు…కాకపోతే అధికార పార్టీలో కాస్త ఎక్కువ మోతాదులో వుంటారు…కాని మరీ మితిమీరిన ఆశలతో పార్టీకి తీరని నష్టం చేకూర్చుతుంటారు…అవసరమైతే పార్టీకి కష్టం తెచ్చిపెట్టే కుతంత్రాలు కూడా చేస్తుంటారు…అలాంటి వారితో ఏ పార్టీకైనా జాగ్రత్త…అవసరం…

                             పైకి ప్రశాంతంగా సాగుతున్నట్లు కనిపించే నీటి కాలువలో వేగమంతా అడుగులోనే వుంటుంది….పైకి ఎంతో పచ్చగా వున్న చెట్టు వేరులోనే పురుగు చేరుతుంది. కాలువ ముంచుతుంది. చెట్టు పుట్టిపోతుంది. పైనంతా ప్రశాంతంగానే కనిపిస్తున్నా లోలోన వేరు పురుగులు చేరి వృక్ష్యాన్ని తింటున్నట్లు పార్టీలో కొందరు వ్యక్తులు నిత్య అసమ్మతి వాదులుగా తయారై, పార్టీకి చేటు చేస్తున్నారు. పార్టీ ఆశ్రయంతో పైకొచ్చి, రాజకీయంగా వెలుగులోకి వచ్చి, అందివచ్చిన పదవులు అందుకొని, కోట్లుకూడేసుకొన్నవాళ్లు చాలా మందేవున్నారు. ఇప్పుడు వాళ్లు పార్టీకి నష్టం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. నిజాలు గ్రహించే స్ధితిలో అలాంటి నాయకులు లేరు. ప్రజలతో సంబంధాలు పెద్దగా లేవు. ఎంత సేపు తాను…తన పదవి…తన రాజకీయం ఇంతే…ఇలాంటి నేతలు పైన పటారం లోన లొటారం లాంటి పార్టీలలో చేరేందుకు, కండువాలు మార్చేందుకు రెడీ అంటున్నారు. 

                  మాకు పదువులిస్తారా? లేక దూకమంటారా? టిక్కెట్లు ఇస్తారా? లేదంటే ప్రతిపక్షపార్టీల వైపు చూడమంటారా? అన్నట్లు భహిరంగ సంకేతాలే ఇస్తున్నారు. అలాంటి వారు ఎవరో పార్టీకి కూడా పూర్తిగా తెలుసు. ఒకనాటి వారి జీవితాలు వారికి గుర్తులేదు. నిన్నటి రోజులు మర్చిపోయారు. రేపటి రోజులపై ఆశలు పెంచకుంటూ కలలు గంటున్నారు. ఒక వేళ వారి కలలు నెవరవేరాలంటే కాస్తో, కూస్తో కొంత సమయం ఆగాలి. కాని వారికి అంత ఓపికలేదు. మిడిమిడి జ్ఞానంతో నేతలైనప్పుడు ఇంతకన్నా వాళ్లు ఎక్కువ ఆలోచించేలేరు. పార్టీ ప్రయోజనాల కోసం వారు పాటుపడరని తేలిపోయింది. అయినా వారిని ఉపేక్షించడం వల్ల తాము బలవంతులమని, సమర్ధులమని, తాము లేకపోతే పార్టీకి ఇబ్బందులున్న భ్రమల్లో తేలియాడుతున్నారు. పార్టీకి చేటు తెస్తున్నారు. ఇలాంటి వారు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకొకరున్నారు. వారి సంగతి తెలుసు. వారి రాజకీయ పరిజ్ఞానం తెలుసు. ప్రజల్లో వారికున్న బలం తెలుసు. తెరాస జెండా కింద బతికిన వారు కూడా జెండాముందు కాలరెగిరేస్తామంటున్నారు. 

                      అలాంటి వారిపై పార్టీ వేటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా వేచి చూసి సమయం ఇవ్వడమే నష్టదాయకంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే వెంటనే అలాంటి నాయకులపై పార్టీ ఎప్పుడో దృష్టిపెట్టింది. అలాంటి నాయకుల్లో మేయర్‌గా పనిచేసిన బొంతు రామ్మోహన్‌ ముందు వరసలో వున్నట్లు తెలుస్తోంది. ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ ప్రాదాన్యతనిచ్చారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే జీవితాంతం పార్టీకి విధేయుడుగా వుంటాడని నమ్మారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎవరూ ఊహించిన పదవిని బొంతు రామ్మోహన్‌కు ఇచ్చారు. కాని ఆ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త పదవిమీద బొంతు రామ్మోహన్‌ ఆశలు పెంచుకున్నాడు. గత ఎన్నికల్లోనే పార్టీని బ్లాక్‌ మెయిల్‌ చేసినంత పనిచేశాడు. ఒక పదవి చేసిన వారు ప్రతి సారి పదవి కావాలనుకోవడం తప్పు కాదు…కాని సమయం సందర్భం వుంటాయి. కాలం కూడా కలిసి రావాలి.  

               తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పటికీ పార్టీకి సేవ చేస్తూ ఎలాంటి పదవులు అందని వారు కూడా వున్నారు… అయినా వాళ్లు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. కాని కొందరు పదవులు అందుకొని కూడా మళ్లీ మళ్లీ తమకే పదువులు కావాలిన అత్యాశ వున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో వున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఎన్టీఆర్‌ కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ వచ్చాడు. కాని ఆయనకు ఎమ్మెల్యే సీటు రావడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా వున్నంత కాలం ఆయనకు పార్టీ టిక్కెట్టు దక్కలేదు. అంతే కాదు ఆయన హైదరాబాద్‌ మేయర్‌ గా పనిచేసినా ఎమ్మెల్యే టిక్కెట్టు కావాలనుకున్నప్పుడు పార్టీ ఇవ్వలేదు. ఎదరుచూశాడు.పార్టీ నుంచి పిలుపు కోసం మేయర్‌ అయిన తర్వాత కూడా పదేళ్లు ఎదరు చూశాడు. అదీ పార్టీ కోసం నాయకులకు వుండే నిబద్దత. అంతే కాని మేయర్‌గా పనిచేస్తూనే నాకేం తక్కువ అని ఎమ్మెల్యే సీటు కోరి అబాసుపాలైనా, పార్టీని ఇబ్బందులకు గురిచేసినా పార్టీ బొంతు రామ్మోహన్‌ను కడుపులో పెట్టుకున్నది. మరోసారి కూడా ఆయన సతీమణికి అవకాశం కల్పించింది. ఇలా ఒకసారి పదవులు పొందినవారు వెంటనే పదవుల కోసం ఎదరు చూసిన వారు తెలుగు రాజకీయ చరిత్రలో చాలా మందే వున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు మేయర్‌గా పనిచేసి, తెలుగుదేశంపార్టీ కోసం జీవితం త్యాగం చేసిన బంగి అనంతయ్య అంటే ఎంతో ఫేమస్‌. కాని ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇప్పటికీ రాలేదు. అలా అని ఆయన పార్టీని కాదనలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సినీ నటుడు, మాజీ ఎంపి. మురళీ మోహన్‌కు టిటిడి చైర్మన్‌ పదవి చేపట్టాలని కోరిక. కాని ఆ కోరిక ఈనాటికి తీరలేదు. అలా అని ఆయన పార్టీ వదిలేయలేదు. ఇలా పదవులు రానంత మాత్రాన పార్టీకి ద్రోహం చేసే యోచన చేస్తూ స్వార్ధపూరిత రాజకీయాలు చేయడం అలవాటు చేసుకున్నవారిని పక్కన పెట్టడమే కరక్టు. 

                 తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీకి చేటు తెచ్చేందుకు కంకణం కట్టుకున్న వారందరినీ పక్కన పెడితే తప్ప లాభం లేదు. కొల్లాపూర్‌ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలుచేశారు. తన వర్గం అంటూ పార్టీకి వ్యతిరేకంగా కౌన్సిలర్లును నిలబెట్టారు. ఆనాడే ఆ నాయకుడిపై వేటు వేస్తు ఇప్పుడు ఈ బెదిరింపులు వుండేవి కాదు…ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే వుంది. ఇలాంటి వారి పార్టీకి ప్రయోజనం అన్నది ఎప్పుడూ వుండదు. అలాంటి వారు తమకు తాముగానే అసమ్మతి వాదులుగా ముద్రలేసుకుంటుంటారు.. పార్టీ పరపతిని దిగజార్చుతుంటారు.. అందుకే వారిని దూరం పెట్టడం ఎంతో మంచిది…ఇదే ఆలోచన ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది….వారి పని అయిపోయినట్లే,చర్యలు తప్పవనే వాఖ్యలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్దగా బలం లేదు. ప్రజల్లో వారిపై నమ్మకం లేదు. పదేళ్లుగా వారు నిర్ధిష్టమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది లేదు. అరవైఏళ్ల గోసనుంచి విముక్తి కావించి, ప్రజా సంక్షేమ రాజ్య నిర్మాణం చేసి, ప్రగతికి తెలంగాణను చిరునామాను చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రజలక వున్న నమ్మకం అంతా ఇంకా కాదు. ఇంకా ఎన్నేళ్లైనా చెక్కుచెదిరేది కాదు. ఈ ఎన్నికలే కాదు, భవిష్యత్తులో కూడా ప్రతిపక్షాలకు ఆశలేలేవు. కాని తన్నింటి వాసాలు లెక్కబెట్టే కొందరు ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను చూసి పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ మారుతామని పరోక్ష సంకేతాలిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ భుజ్జగిస్తుందన్న భ్రమల్లో తేలియాడుతున్నారు. అధికార తెరాసను వదిలి ప్రతిపక్షాలలోకి వెళ్లే పదవులు వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఆ పార్టీలలో నాయకత్వ లేమిని తాము తీర్చుతామన్న ఆశల్లో వెళ్లినా, జనం ముఖం చూస్తారన్న నమ్మకం లేదు. కూడారన్న సంగతి తెలిసి కూడా బురద రాజకీయమే రంజుగా వుంటుందనుకునేవారు ఎంత కాలమైనా మారరు…వారిని పార్టీ వదులుకోక తప్పదు…కొత్త తరం ఆవిష్కరణ జరక్క తప్పదు…

డోర్నకల్‌ కవితకే…!

కుటుంబ సభ్యులు కూడా కవితవైపే…!

వారసత్వం ఆడపిల్లకే…!

చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం!

ప్రజల కోసం శ్రమించే తత్వం…

పార్లమెంటు సభ్యురాలిగా అదనపు ప్రాధాన్యం….

నిత్యం ప్రజలతో మమేకం…

ఈసారి మంత్రి అయ్యే అవకాశం…

డోర్నకల్‌ అభివృద్ధికి కవిత గెలుపు ఎంతో బలం..

సమాజంలో ఉన్నత వర్గాల రాజకీయాలు వేరు…సమజానికి దూరంగా, మైదాన ప్రాంతాలకు ఆవల, మరో ప్రపంచంగా కనిపించే గిరిజన ప్రాంతాలలో రాజకీయాలు వేరు…ఇక్కడి ప్రజలు ఎంతో అమాయకులు. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నా, ఇంకా వారి జీవితాల్లో పూర్తి స్ధాయి వెలుగులు నిండిరది లేదు. సమాజంలో అందరితో సమానంగా బతుకుతున్నది లేదు. ఇప్పటికీ వారి ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం పూర్తి స్ధాయిలో వుండదు. వైద్య సదుపాయాలు అందడం జరగదు. విద్య, వైద్యం పూర్తి స్ధాయిలో కల్పన ఇంకా కలగానే మిగులుతున్న రోజులు…ఈ పరిస్ధితి దేశ వ్యాప్తంగా వున్నదే…అలాంటి ప్రాంతాల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకులు అతి కొద్ది మంది మాత్రమే వున్నారు. గిరిజన జీవితాలకు అండగా నిలిచి వారు తక్కువగానే వున్నారు. ఇప్పటికీ మెజారిటీ గిరిజనులు కొండలు, కోనలు, చెట్టూ, పుట్టను నమ్ముకొని, అడవి తల్లి నీడన జీవితాలు గడుపుతున్నారు. అలాంటి వారి జీవితాలు రాత్రికి రాత్రి మార్చడం ఎవరి వాల్లా కాదు..అలాగని వదిలేసే విషయం కాదు…అందువల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధి అన్నది జరగాలంటే వారి జీవితాల మీద అవగాహన ఒక్కటే వుంటే సరిపోదు…వారి జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు నిరంతరం తపించే, శ్రమించే నాయకత్వం కావాలి. ఆ చిత్త శుద్ది నాయకుడిలో వుండాలి. ఆ లక్షణాలు వుండి, ఇప్పటికీ ఆ ప్రజలతో మమేకమైన వున్నవారు…అలాంటి వారిలో రెడ్యా నాయక్‌ , మాలోతు కవితలాంటి వారు వున్నారు. 

అందరూ ఊహిస్తే అవి రాజకీయాలెలా అవుతాయని రాజుల కాలంలోనే చెప్పుకునేవారు. వేసే అడుగులు, రాజకీయ ఎత్తుగడలు అన్నవి అవతలి వారికి అనువుగా వస్తే ఏముంటుంది మజా! ఊహించని దెబ్బలు కొట్టడంలోనే వుంది అసలు చాణక్యత. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలాంటి ఎత్తులు వేస్తారన్నది ఎవరికీ అంతుపట్టనిది…అందుకే ప్రతిపక్షాలకు ఎన్నేళ్లు గడిచినా నిద్ర పట్టనిది…లక్ష్యం ఒక వైపు చూపించి, బాణం మరో వైపు సంధించింది ఊహించని దెబ్బ కొట్టడంతో కేసిఆర్‌ దిట్ట….అందుకే ఉద్యమ కాలం నుంచి ఆయన అనుసరించిన వ్యూహాలలో కొత్తదనం కనిపించకపోయినా, ఫలితాలు మాత్రం దిమ్మతిరిగేలా వుంటాయి. అందుకే ఎన్నికలంటే ప్రతిపక్షాలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదిర్శస్తున్నా…కేసిఆర్‌ ఎటు వైపు నుంచి ఎటు రాజకీయం సందిస్తారన్నది ఎవరికీ అర్ధం కానిది…అంతు చిక్కనిది…అలాంటి రాజకీయం కూడా డోర్నకల్‌లో సరికొత్త వ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారా? అన్న చర్చ పెద్దఎత్తున జరుగుతున్నదే…అందరూ అంచనాలు వేస్తున్నదే…? అయితే ఆసారి డోర్నకల్‌ నుంచి అందరూ టిఆర్‌ఎస్‌ నుంచి రెడ్యానాయక్‌ రాజకీయ వారసుడిగా రవిచంద్రనాయక్‌ పోటీ చేస్తారని అనుకుంటున్నారు. కాని డోర్నకల్‌ నుంచి మహాబూబాబాద్‌ ఎంపి. మాలోతు కవితను రంగంలోకి దింపడానికి కారు పార్టీ సమాయత్తమౌతుంది. ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ తీయడానికి గులాబీ పార్టీ సరికొత్త వ్యూహాన్ని అనుసరించనుంది. 

డోర్నకల్‌ నియోజకవర్గం ఆది నుంచి రెడ్యానాయక్‌ కుటుంబానికి కంచుకోట. అక్కడి నుంచి రెడ్యానాయక్‌ 1989 నుంచి 2009లో తప్ప వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం కూడ వుంది. సీనియర్‌ ఎమ్మెల్యేగా, డోర్నకల్‌ నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ ఆయనకు మంచి పేరుంది. రాష్ట్ర స్ధాయి నేతగా మంచి గుర్తింపు వుంది. సుధీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో, ప్రజా సేవలో వుండడమే ఎంతో గొప్ప విషయం. అలాంటిది ప్రజా ప్రతినిధిగా మూడుదశాబ్ధాలపాటు ప్రజల మన్ననలు పొందుతూ గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకు ఒక నాయకుడికి తన జీవితం కన్నా, తన ప్రజల జీవితం మీద మక్కువ ఎక్కువ వుండాలి. వారి అభివృద్ధి కోసం ఆలోచనలు వుండాలి. నిరంతరం ప్రజల్లో వుండాలి. రాజకీయ ఎత్తుగడలను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తుండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే దూర దృష్టి కావాలి. ప్రజలు కోరుకున్న రీతిన రాజకీయం చేయాలి. ప్రగతివైపు తన నియోజకవర్గాన్ని పరుగులు తీయించాలి. అప్పుడు తప్ప నాయకుడికి సుధీర్ఘమైన ప్రజా ప్రతినిధిగా ప్రజల దీవెనలు అందడం దుర్లభం. కాని రేడ్యానాయక్‌ ప్రజలను గుండెల్లో పెట్టుకొని వారి కోసం పనిచేయడం ఒక ఎత్తేతే, ఆయనను కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకోవడం వల్లనే ఐదుసార్లు గెలవగలిగారు. అలాంటి గుణం పునికి పుచ్చుకున్న వారసురాలు మాలోతు కవిత. చిన్న తనంలోనే ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం మహబూబాబాద్‌ ఎంపిగా ప్రజలకు సేవలందిస్తున్నారు. గతంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను ఎమ్మెల్యేగా వున్న సమయంలోనే ఆ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు. ఇప్పుడు కనిపిస్తున్న అనేక అభివృద్ధి కార్యాక్రమాలు ఆమె చలవతోనే మొదలైనవే…వాటి ఫలాలు నేడు ప్రజలకు అందుతున్నవి…అలాంటి కవిత…ఈసారి ఎమ్మెల్యేగా అందరూ మహబూబాబాద్‌ నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు…మెజార్టీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు…కాని ఆమెను పార్టీ డోర్నకల్‌ నుంచి పోటీ చేయించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో బలంగా వుంది. అలాగే బలమైన నాయకత్వాలు కూడా వున్నాయి. అలాంటి నాయకత్వాలలో ఆధిపత్య పోరును ఎగదోసి, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలని చూస్తున్నాయి. కాని వారి ఆశలు నెరవేరని రాజకీయాలు నెరపడంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌దిట్ట. అందుకే రెడ్యానాయక్‌కు కాకుండా డోర్నకల్‌ నుంచి పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితను పోటీచేయించాలని చూస్తున్నారు. దాంతో అటు మహాబూబాబాద్‌, ఇటు డోర్నకల్‌ రెండూ మళ్లీ గులాబీ పార్టీ ఖాతాలోనే వుంటాయి. అయితే రెడ్యా నాయక్‌ కుటుంబంనుంచి కూడా ఆయన కుమారుడిని డోర్నకల్‌ నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాని వాటికి ప్రత్యేకమైన దృవీకరణ లేదు. టిఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం కవితనే ఎంపిక చేయాలని, ఎన్నికల్లో గెలిపించుకోవాలని చూస్తోంది. 

చిన్న వయసులోనే మాలోతు కవిత రాజకీయాల్లోకి రావడమే కాదు, తన తండ్రి ప్రజలతో ఎలా మమేకమౌతున్నారన్నదానిని చిన్నప్పటినుంచి గమనిస్తూ వస్తోంది. ఉన్నత విద్యావంతురాలైన కవిత ప్రజల ఆలోచనా విధానం తెలుసు. వారి అవసరాలు తెలుసు. సమాజ శ్రేయస్సు కోసం తానేం చేయాలన్నది తెలుసు. తన సామాజిక వర్గ సమస్యలు తెలుసు. ఎన్నేళ్లు గడిచినా వారికి పూర్తి స్ధాయి గుణాత్మక మార్పులు ప్రభుత్వాలు ఎందుకు తీసుకురావడం లేదో తెలుసు. అందుకు ఒక్కొమెట్టు ఎలా వారి ప్రయోజనాల కోసం ప్రగతి దారులు వేయాలో కవితకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే తన గిరిజనం కోసం ఎంతో చేయాలన్నదే రాజకీయంగా ఆమె ఆశయం. అన్ని వర్గాల ప్రజల్లాగా వాళ్లు కూడా నాగరిక సమాజం చూడాలి. అనుభవించాలి. అడువుల్లో వున్నా, పట్టణ సౌకర్యాలు వారికి అందాలి. అందుకు చాల కృషి జరగాలి. ప్రభుత్వాలు వారి కోసం ఇప్పుడు కేటాయిస్తున్న నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. ప్రత్యేక సబ్‌ ప్లాన్‌ల ద్వారా నిధులు కేటాయిస్తున్నా, అనుకున్న ప్రయోజనాలు నెరవేరడం లేదు. అయితే ఇంకా ప్రభుత్వంతో కొట్లాడి గిరజన సమాజానికి మేలు చేసేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన ప్రణాళికలు ఎన్నొ అవసరమనేది కవిత ఆలోచన. 

ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధి అయిన మాలోతు కవిత ఆ ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తుంది. వారి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజలను ఆమె గుర్తు పడతారు…ఒక్కసారి కవితను కలిసి వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత కనిపించినా పేరు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి ఆమె సొంతం. అందుకే ఆమె తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఏ పనులు జరిగాయన్నదానిపై కూడా ఆమెకు పూర్తి స్ధాయి అవగాహన వుంటుంది. ఇక పేదల పాలిట ఆమె పెన్నిధి అని అంటుంటారు. ఇక రాజ్యాంగం, చట్టం, చట్ట సభల వ్యవహారంలో ఆమెకు సంపూర్ణమైన అవగాహన కూడా వుంది. వెనుకబడిన ప్రాంతమైన మహబూబాబాద్‌ జిల్లా పరిధిలోని ప్రజలు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ విషయంలో ముందుగా మాలోతు కవితనే ఆశ్రయిస్తారు. ఏ పని కావాలన్నా ముందు ఆమెనే సంప్రదిస్తారు. కవితది లౌక్యం తెలిసిన ముక్కుసూటి తనం. ఏ విషయంలోనూ దాపరికం వుండదు. మంచిని మంచీ అని, చెడును చెడు అని చెప్పడానికి కూడా వెనుకాడని మనస్తత్వం. ప్రజలు నిత్యం రకరకాల సమస్యలతో ఆమె వద్దకు వస్తుంటారు. అయితే అందులో జరగని పనులు కూడా కొన్ని సార్లు ప్రజలు తెస్తుంటారు. అలాంటప్పుడు వారిని మభ్యపెట్టడమో, పది సార్లు తిప్పుకోవడమే ఎట్టిపరిస్ధితుల్లోనూ చేయరు. తన వద్దకు వచ్చిన ఆ పని అవుతుందనుకుంటే ఆలస్యం చేయరు. కాని పనిని వెంటనే చెప్పేస్తారు. నిజాలు వివరిస్తారు. ఎంతసేపైనా వారికి ఓపికతో సమాధానం చెబుతారు. అందుకే ఈ విషయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలు కూడా ఆమె వెళ్లి తమ సమస్యలు చెబుతుంటారు. వచ్చినవారిలో తన నియోజకవర్గ ప్రజలు కాదన్నది కూడా ఆమె చూడరు. ఎవరొచ్చినా వారి సమస్యపరిష్కరించకుండా వుండలేరు. అలా తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలే మెండుగా వున్నాయి. ఈసారి మాలోతు కవిత పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయించాలని పార్టీ కూడా ఆలోచిస్తోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రం కచ్చితంగా మాలోతు కవిత మంత్రి కావడం ఖాయం. మహాబూబాబాద్‌ జిల్లాకు మహార్ధశ రావడం తధ్యం….

నో ఫైర్‌ సేఫ్టీ!?

దొరలెవరు? దొంగలెవరు?

ఎలాంటి సర్టిఫికేషన్‌ లేని ఆసుపత్రులు, విద్యా సంస్థలు!

సర్టిఫికెట్లు ఇవ్వలేదని అధికారులు?

ఉన్నట్లు నమ్మిస్తున్న ఆసుపత్రులు, విద్యా సంస్థలు?

ఆన్‌ లైన్‌ అప్లికేషన్లు, భోగస్‌ సర్టిఫికెట్లు?

రోహిణిలో ఫైర్‌ ఆక్సిడెంట్‌ మర్చిపోయారా?

కళ్యాణ లక్ష్మి షాపింగ్‌ మాల్‌ కథ కంచికేనా?

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా?

ప్రమాణాలు గాలికొదిలి, ప్రాణాలు పోగొడతారా?

ఆసుపత్రులా, నరకానికి తెరిచిన ద్వారాలా?

విద్యా సంస్థల్లో పిల్లల ప్రాణాలకు భరోసా ఎలా?

వ్యాపారం తప్ప, ప్రాణాలకు విలువే లేదా?

భయం లేని తనంతో ఇరుకు భవనాలలో ఆసుపత్రులు?

ఏ ఒక్క ఆసుపత్రి సేఫ్టీగా లేదు?

విద్యా సంస్థల్లో సౌకర్యాలు లేవు?

అంతా గోల్‌ మాల్‌ గోవిందం?

ప్రజల ప్రాణాలతో చెలగాటం?

వెలుగు చూస్తున్న భయంకరమైన నిజాలు?

పట్టింపు లేని అధికారులు?

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రులకు వెళ్తున్నారా? ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆలోచనతో నరక కూపాలకు దారులు వెతుక్కుకుంటున్నారా? పెద్దాసుపత్రులు ఎన్ని పైసలు ఖర్చైనా సరే అనుకుంటున్నారా? పైపైన మెరుగులు చూసి మోసపోతున్నారా? ఆసుపత్రి చూస్తే ఎంతో పెద్దదిగా వుందని భ్రపడుతున్నారా? భరోసా మీద లెక్కలేసుకుంటున్నారా? ఒక్క క్షణం ఆగండి! అవి ఆసుత్రులు కాదు…నరకానికి నకళ్లు…నరకలోకానికి దారులు…! ద్వారాలు తెరిచిన వైకుంఠదామాలు? బతికుండానే చితిమంటలు పేర్చే స్మశానాలు…అదృష్టం బాగుండి…వైద్యం కోసం వెళ్లినా, ప్రాణం నయమైనా, భూమ్మీద నూకలు బాగుంటే గాని, క్షేమంగా ఇల్లు చేరలేరు? అయినవాళ్లను కళ్లారా చూసుకోలేరు.. ఏ మాత్రం కిందమీదైనా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రాణాలతో చూసుకోలేరు…అంతా బాగుందనుకున్న సమయంలోకూడా అంతా బూడిదైపోవచ్చు…ఇది కథ కాదు…ఆసుత్రుల్లో జరిగుతున్న అగ్ని ప్రమాదాల పరిణామాలు…బతికుండగానే నిప్పుల పాలై, అరుపులు, ఆర్ధనాదాలు పెట్టుకుంటుంటే ప్రాణాలు పోతుంటే సజీవ సాక్ష్యాలుగా, బూడిద రూపాలుగా మారిన బతుకులెన్నో…వున్నాయి..? ఇవి ఆసుత్రుల సంగతి….

ఇక బడుల సంగతి మరీ ఘోరం….

పిల్లల భవిష్యత్తు మీద గంపెడాశలతో, మార్కెట్లో ప్రచార పటాటోపాన్ని చూసి, వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారా? లక్షల రూపాయలు పోయినా ఫరవాలేదు…పాఠాల గురించి ఆలోచిస్తున్నారే గాని, మీ పిల్లల ప్రాణాల గురించి ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? ఆ బడులు ఎంత వరకు సేప్టీ అన్నవి తెలుసుకుంటున్నారా? అడ్మిషన్ల కోసం వెళ్లినప్పుడు ఫీజులు గురించి అడిగి తెలుసుకుంటున్నారే గాని, మా పిల్లల్ని చేర్పిస్తే, ఎంత వరకు బడి సురక్షితమని, తమ పిల్లలు క్షేమమని తెలుసుకుంటున్నారా? గొర్రెలు దూరినట్లు దూరి, లక్షలు లక్షలు చెల్లించి పిల్లల ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నారా? ఎంత సేపు ర్యాంకెంత? వారి చదువెంత? భవిష్యత్తులో అమెరికా దూరమెంత? అందుకు అయ్యే ఖర్చెంత? అంటూ లెక్కలేసుకుంటున్నారే గాని, బడి బాగుందా? బడి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలున్నాయా? అన్న కనీస అవగాహన తల్లిదండ్రులకు వుంటుందా? ఇవేవీ మనకే పట్టడం లేదు? ఇక యాజమాన్యాలకేం పడుతుంది? వారికి భయమేముంటుంది? అధికారులకెలా పడుతుంది? పుట్టగొడుగుల్లా…పిట్ట గూడుల్లా…గాలి కూడా సరిగ్గా దూరని గదులతో, అంతస్థుల మీద అంతస్ధులుగా కట్టిన బడిలో చదివిస్తున్నారు..చదవు కొంటున్నారు…ప్రమాదాలు జరిగినప్పుడు కడుపుకోతలు మిగిల్చుకుంటున్నారు…జీవితాంతం జీవచ్చవాలుగా బతుకుతున్నారు…

   మరి షాపింగు మాల్స్‌…పండగలు…పబ్బాలు…శుభ కార్యాలు…

కొద్ది రోజుల్లో ఇంటి నిండా ఆనందాలు…సంతోషాలు…బంధువులు..కొత్త బంధుత్వాలు…పెళ్లిళ్లు…పేరంటాలు…పుట్టిన రోజులు ఇలా వేడుకల కోసం కొత్త బట్టలు, ఇతర సామాన్లు కొనుగోలు కోసం షాపింగులకు మాల్స్‌కు వెళ్తున్నారు…? కాని అడుగు వేసేప్పుడు తొలి మెట్టులోనే ధరలు తక్కువట? అని ముచ్చట్లు పెట్టుకుంటామే గాని, అడుగు లోపల పెట్టినంత సులువుగా బైట పడతున్నారా? అన్నది ఆలోంచికుంటున్నారా? లేదు…అందరూ వెళ్తున్నారు…మేం వెళ్తున్నాం…ఇంతే…మనలో చాలా మంది ఆలోచన అంతే…అంత దూరం వరకే….? ఎవరు మారాలి? ఎవరు మార్చాలి? ఎవరిది తప్పు? ఎవరిది లోపం? ఎవరిది పాపం? ఎవరిది నేరం? రా…రామ్మంటూ అందమైన లోకం కనిపించినంత అందంగా భవనం వుంటే చాలా? దానిలో సౌకర్యాల కల్పనతోపాటు, ప్రమాదాలు జరక్కుండా ప్రమాణాలున్నాయా? ఇది ఎవరు తెలుసుకోవాలి? జనమా? ప్రభుత్వమా? ఇవేవీ ఆయా శాఖలకు పట్టవా? జనం చచ్చిపోతున్నా…కదలరా? 

  అధికారులు ఏం చేస్తున్నారు? భవనాల నిర్మాణం దగ్గర నుంచే నిర్లక్ష్యం?

 ఏ భవనం ఎలాంటి అవసరాలకు ఉపయోగించాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించకుండా పర్మిషన్లు ఇవ్వడం? చేతులు తడుపుకోవడం…ఆపై దులుపుకోవడం? ఇదేనా బాధ్యత కల్గిన అధికారులు చేయాల్సింది? రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్ధితి. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్‌ జిల్లాల సంగతే చూస్తే, తాజాగా విచిత్రమైన సందర్భం కనిపిస్తోంది. గతంలో హన్మకొండ బస్టాండ్‌ పరిసరాల్లో కనిపించే లాడ్డింగ్‌లన్నీ ఆసుపత్రులైపోయాయి? అసలు ఒక ఆసుపత్రి ఏర్పాటుకు ఎన్ని రకాల నియామాలు అమలు చేయాలన్నదానిపై కూడా ఎవరికీ అవసరంలేదు. ఎంతో కాలం దూరం వెళ్లాల్సిన పనిలేదు. ఆ మధ్య రోహిణీ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలు మన కళ్లముందే వున్నాయి. అయినా ఏ ఒక్క అధికారి కదిలింది లేదు. ఆసుపత్రులు సందర్శించింది లేదు. వాటిని మూసేసింది లేదు…మరి అవి ఎలా నడుస్తున్నాయి? ఇరుకైన స్థలాలు…ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగడానికి కూడా అవకాశం లేని బిల్డింగుల్లో పెద్ద పెద్ద ఆసుపత్రుల నిర్వహణ జరగడం జనాలకు ప్రాణగండం కాదా? ఎంతో పేరున్న ఆసుపత్రి అని కలరింగులిచ్చుకునే రోహిణీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే ఎంత పెద్ద నష్టం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగు చేసుకుందామని వచ్చి రోహిణీలోచేరి, వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని అగ్నిప్రమాదం మూలంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు? మరి అలాంటి ఆసుపత్రి మీద తీసుకున్న చర్యలేమిటో ఇప్పటి వరకు తెలియదు? జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారి ఏం చేశాడో తెలియదు? ఏం రిపోర్టు ప్రభుత్వానికి అందించాడన్నది ఎవరకీ తెలియదు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు బాదితుల పక్షాన నిలవాల్సిన అధికారి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నదానిపై ప్రశ్నించిన ప్రభుత్వ పెద్దలు లేరు? ఆ అధికారిపై చర్యలు లేవు? కాని ఆ అధికారి ఇచ్చిన రిపోర్టు మూలంగా మళ్లీ ఆసుపత్రికి అనుమతి ఎవరిచ్చారన్నది తెలియదు? ప్రజలకు ఏమీ తెలియదు? ప్రభుత్వానికి ఏమీ తెలియదు? కాని ఆసుపత్రి నడుస్తుందన్నది అందరికీ తెలుసు. ప్రజలు ప్రాణాలు అగ్ని ఆహుతి అయ్యాయని తెలుసు. మొత్తం మీద ఆసుపత్రి వర్గాలు పెద్దలను ప్రసన్నం చేసుకున్నారన్నది తెలుసు….

   మాకేం తెలియదు…అంటూ చేతులు దులుపుకోవడం మాత్రమే తెలిసిన ఫైర్‌ డిపార్టు మెంటు ఏం చేస్తోంది? 

ఎలా సర్టిఫికెట్లు జారీ చేస్తోందని నేటిధాత్రి ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్‌ లాంటి నగరాల్లో మున్సిపల్‌ ఫైర్‌ విభాగం, జిల్లా ఫైర్‌ విభాగమంటూ విడదీసి చోద్యం చూస్తున్నారు…ఏదైనా ఘటన జరిగితే మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు…? నెల నెల ఆసుపత్రుల నుంచి మమాళ్లు తీసుకుంటున్నారు? చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే హన్మకొండ, వరంగల్‌ జిల్లాల్లో వున్న ఆసుపత్రుల నిర్వాహాకులు ప్రభుత్వ అధికారుల సంతకాలు, స్టాంపులు కూడా తయారు చేసుకొని, ఏకంగా సర్టిఫికెట్లు కూడా తయారు చేసుకొని, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్లు పొందుతున్నట్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా సర్టిఫికెట్లు తయారౌతున్నాయన్న సంగతి ఫైర్‌ డిపార్టుమెంటుకూ తెలుసు….కాని కదిలేవారేరీ…పట్టుకునేవారేరీ…కేసులు నమోదు చేసేవారేరీ? అందరూ అందరే…నెల నెల తమకు అందాల్సినవి అందుతున్నాయా? లేదా అన్నది అధికారులు చూసుకుంటున్నారు? మా జోలికి రాకుండా వుంటున్నారని ఆసుపత్రి వర్గాలు చెల్లింపులు చేసి చేతులు దులుపుకుంటున్నారు? ప్రమాదాలు జరిగినప్పుడు చూసుకుందామన్న నిర్లక్ష్యంగ వ్యవహరిస్తున్నారు? రోహిణీ లాంటి అంత పెద్ద ప్రమాదం జరిగితే ఏం జరిగింది? మనకేం జరుగుతుందన్న నమ్మకంతో ప్రజల ప్రాణాలతో చెలగామాడుతున్నారు…అలాంటి ఆసుపత్రులు…విద్యా సంస్ధలు…షాపింగ్‌ మాల్స్‌…ఆయా శాఖల పనితీరు….అధికారుల అలసత్వాలు…నిర్లక్ష్యాలపై మీ నేటిధాత్రిలో త్వరలో వరస కథనాలు…భయంకరమైన నిజాలు…అరచేతిలో ప్రజలు ప్రాణాలు….కాసుల కక్కుర్తిలో అధికారులు…వారి బాగోతమంతా ఇక వరుసగా….!

ఖాకీ వనంలో కీచకులా!?

 

`పోలీసు ఉద్యోగం పవిత్రమైంది.

`పాపపు పనులు చేసేవారిని పట్టుకునేది.

`అన్యాయాలు చేసేవారిని అడ్డుకునేది…

`నేరస్ధులును గుర్తించి సమాజాన్ని రక్షించేది

`ప్రజలకు శాంతి భద్రతలు అందించేంది

`అందరిలో బతుకు భరోసా కల్పించేంది

`ఆపదలో వున్నవారిని కాపాడేది…

`అనుక్షణం ప్రజల యోగక్షేమాల కోసం పనిచేసేది…

`ప్రాణాలకు తెగించి, ఇతరుల ప్రాణాలు రక్షించేది…

`ధైర్య సాహసాలతో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేది…

`కీచకులైన వారిని ఉపేక్షిస్తే వ్యవస్ధకే మచ్చది?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రజల తొలి ప్రభుత్వం పోలీస్‌ స్టేషన్‌. ప్రజలకు ధైర్యం పోలీస్‌ స్టేషన్‌. ప్రజలకు భరోసా పోలీస్‌ స్టేషన్‌. ఇదీ ప్రజల్లో పోలీసు వ్యవస్ధ మీద వుండే నమ్మకం. విశ్వాసం. పోలీసు వ్యవస్ధ వుండడంతోనే ప్రజలు ప్రశాంతంగా వుండగలుగుతున్నారు. హాయిగా జీవిస్తున్నారు. అందుకే పోలీసు వ్యవస్ధ ఎంతో బాధ్యతాయుతమైంది. పోలీసు ఉద్యోగం ఎంతో పవిత్రమైంది. ఖాకీ దుస్తుల మాటున కరుకైన కాఠిణ్యం కనిపించినా, కనికరమనే హృదయం దాగి వుండాలి. పాపపు పనులు చేసేవారిని పట్టుకోవాలి. తప్పులు జరక్కుండా చూసుకోవాలి. సమాజానికి రక్షణగా వుండాలి. సమాజంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తొక్కే తొలి గడప పోలీస్‌ స్టేషన్‌. అక్కడ మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. పేద, ధనిక అనే బేధం లేకుండా అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్ధది. అన్యాయాలు చేసేవారిని అడ్డుకునేది. నేరస్ధులను గుర్తించేది. వారికి శిక్షలు పడేలా చేసేది. సమాజంలో తప్పులు జరక్కుండా చూసేది. మరి అలాంటి వ్యవస్ధలో కొందరు చేస్తున్న తప్పుల మూలంగా మొత్తం వ్యవస్ధమీదే నమ్మకం పోయేలా చేసుకుంటున్నారు. ఎంతో పవిత్రమైన ఉద్యగం చేస్తూ అపవిత్రమైన పనులు సాగిస్తున్నవారు కూడా వున్నారంటూ నిత్యం అనేక వార్తలు వస్తున్నాయి. ఎక్కడో అక్కడ పోలీసుల వ్యవస్ధలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా వుంటున్నారు. ఇది కూడా నిత్య కృత్యమైపోతోంది. అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులు. అమాయకులపై పోలీసుల ప్రతాపం అంటూ ఎప్పుడూ వింటున్నదే…ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, మరోపార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయడం తెలిసిందే..ఇవన్నీ ఉద్యోగ నిర్వహణలో కొన్ని జరిగేవే అనుకోవడం కూడా పరిపాటే…అలాంటిది ఆడ పిల్లల మీద అత్యాచారాలు చేయడం, మహిళలన బెదిరించడం, మోసం చేయడం కూడా అలవాటు చేసుకుంటున్నారా? గతంలో సినిమాల్లో తప్ప పోలీసులు లాకప్‌లో మహిళలను ఇబ్బందులు పెట్టినట్లుగాని, అత్యా చారాలు చేసినట్లు బైట విన్నవి లేవు. కాని తాజాగా కొందరు పోలీసు అధికారుల వ్యవహారం మొత్తం పోలీసు వ్యవస్ధమీదే అనుమానపు చూపులు చూసేదాకా వచ్చింది. సమాజం మొత్తం ఓ ఇద్దరు పోలీసులు చేసిన నీచాన్ని ఎండగుడూతూ పోలీసు వ్యవస్ధను వేలెత్తి చూపిస్తోంది. 

                            పోలీసు అధికారులంటే ఉన్నత విద్యావంతులు

 సమాజం చదువున్న వారు. సమాజాన్ని అర్ధం చేసుకున్నవారు. మంచి చెడులు తెలిసిన విజ్జులు. వెలుగు చీకట్లను విశ్లేషణ చేయగలిగేవారు. ఎంతో కఠినమైన శిక్షణ పూర్తి చేసుకొని అంకిత భావంతో ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తుంటారు. శిక్షణ అనంతరం తన కర్తవ్య నిర్వహణపై ప్రతిజ్ఞ చేసి వచ్చేవారు. ప్రజలకు మేలు చేస్తానని, అమాయకులకు అండగా నిలుస్తామని, అన్ని వర్గాలకు ఒకే రకమైన న్యాయం అందిలే చేస్తానని శపథం చేసి వస్తారు. రాజ్యాంగం గురించి తెలిసి వాళ్లు, చట్టాల మీద పూర్తి స్ధాయి అవగాహన కల్గినవాళ్లు పోలీసు అధికారులు. పోలీసు ఉద్యోగం చేయాలని కోరుకునేవారిలో కూడా కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు కూడా వుంటాయని ఒక పరిశోధనలో తేలింది. తమకు ఆ వృత్తి పట్ల మమకారం, ప్రజలకు సేవ చేసే అవకాశం, సమాజంలో గౌరవమైన జీవితం ఇలా కొన్ని విషయాల్లో కలలు గని పోలీసు ఉద్యోగం ఎంచుకుంటారని అంటారు. మరి అంతటి ఉన్నత స్ధాయి ఆలోచనలు వుండేవారిలో భరితెగింపు ఎలా ఆవాహిస్తోంది? తప్పులు చేయడం మానవ సహజం అన్నది పోలీసు శాఖలోనూ వుంటుందా? నీచపు పనులు చేయడం మొదలు పెట్టాక, అవివేకులకు, ఎంతో వివేవకవంతులైన విజ్ఞులకు తేడా లేదా? తప్పులు చేసేవారిని పట్టుకొని వారికి ఎలాంటి శిక్షలు వేయాలో కూడా కేసులు నమోదు చేసే పోలీసులు అవే తప్పులు చేయడంలో అర్ధమేమిటి? ఏ తప్పు చేసినా డిపార్టుమెంటు కాపాడుతుందన్న నమ్మకమా? లేక నన్నెవరూ ఏమీ చేయలేరన్న అహాంకారమా? ఖాకీ దుస్తులు వేసుకున్నదే తమకు అన్యాయాలు, అక్రమాలు చేయడానికి లైసెన్సు దొరికినట్లు ఊహించుకోవడమా? ఓ వైపు నీచపు పనులు మరోవైపు, వందల కోట్ల రూపాయలు ఆర్జన అనేది ఒక సిఐకి ఎలా సాధ్యం? ఎంత మందిని ఇబ్బందులకు గురి చేస్తే అన్ని కోట్లు సంపాదిస్తారు…ఓ వైపు అక్రమ సంపాదనలు, మరో వైపు మహిళలపై అత్యాచారాలు చేయడానికి కూడా కొందరు ఎందుకు వెనకాడడం లేదు? 

                           ప్రపంచంలో ఏ దేశంలోనైనా మహిళలకు రక్షణ అన్నది ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం

అందుకు పోలీసు వ్యవస్ధ, న్యాయ వ్యవస్ధలకు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు కూడా వున్నాయి. మహిళా రక్షణ కోసం అనేక చట్టాలున్నాయి. ఆకతాయిగా అమ్మాయిలను టీజ్‌ చేసినా అది నేరమే…అలాంటిది ఒక సిఐ మహిళ కణతపై సర్వీసు రివాల్వర్‌ పెట్టి మరీ అత్యాచారం చేయడం అంటే కంచే చేను మేసినట్లు కాదా? అందుకేనా ఆ పోలీసు అధికారి ఉద్యోగం చేస్తున్నది? గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు సదరు సిఐ మీద అనేకం వున్నాయని కూడా అంటున్నారు. సమాజంలో అత్యాచారానికి పాల్పడిన వారిపై అనేక కఠిన చట్టాలు తెచ్చారు. అందుకు ఎవరూ మినహాయింపులు కాదు. గతంలో వరంగల్‌లో ఓ అమ్మాయి మీద ఆసిడ్‌ దాడి చేసిన యువకులను ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఈ మధ్య దిశ కేసులోనూ అదే జరిగింది. మరి అలాంటిది ఓ పోలీసు అధికారి పూర్తి సృహతోనే నేరం చేశాడు. కక్ష్య పెంచుకొని ఇబ్బందులకు గురి చేశాడు. భర్తను కేసుల్లో ఇరికిస్తానని బెరించాడు? ఆమె చెప్పినట్లు వినకపోతే బ్రోతల్‌ కేసు నమోదుచేస్తానని బెరించారని చెబుతున్న తర్వాత కూడా విచారణ పేరుతో కేవలం సస్పెన్షన్‌ చేయడం అంటే అర్ధమేమిటన్న ప్రశ్న సమాజం నుంచి ఉత్పన్నమౌతోంది. వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలి? అలా చేయకపోవడం మూలంగానే పోలీసుల్లో కూడా విచ్చలవిడి తనం పెరుగుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఆ మధ్య అమాయకులైన వారిపై ధర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారిని కమీషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేసిన గంటలోనే మరో పోస్టింగ్‌ ఇచ్చారన్న ఆరోపణలు వుండనే వున్నాయి. ఇక మల్కాజిగిరి స్టేషన్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఓ మహిళను ప్రేమించి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవమే నేరం. అయినా ప్రేమించిన అమ్మాయిని ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు..నా కోసమే వుండాలన్నంత వికృతానికి దిగజారుతుంటే ఎవరు బాధ్యులు. అంటే ఖాకీ దుస్తుల మాటన ఏమైనా చేయొచ్చన్నంత విపరీతం వారిలో ఎందుకు పెరిగిపోతోంది. సమాజానికి రక్షణ కల్పించాల్సిన వ్యవస్ధలోనే ఇన్ని లోపాలు వుంటే, ప్రజల రక్షణ బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తిస్తారన్న భరోసా ఎలా వస్తుంది? ప్రెండ్లీ పోలీసింగ్‌ అంటే అర్ధం ఇదేనా? అని ప్రశ్నింస్తున్న సమాజానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వమా? పోలీసు వ్యవస్ధా!!

వాళ్లు నమ్మదగినవాళ్లే కాదని ముందే చెప్పాం!

టిఆర్‌ఎస్‌ పెద్దలు వినలేరు?

ఈటెల మోసాలు ఎనాడో బైటపెట్టాం?

ప్రభుత్వం పట్టించుకోలేదు?

ఉద్యమ కారుడి ముసుగులో పెంచుకున్న వ్యాపారం గురించి రాశాం!

పౌరసరఫరాల శాఖను మేస్తున్నాడని చెప్పినా వినపడలేదు?

అసైన్డ్‌ భూముల బాగోతం ఏనాడో చెప్పాం! మీరు కదల్లేదు?

ఈటెల పోలీసులను పురిగొల్పి కేసులు పెడితే ఎదుర్కొన్నాం?

బెదరకుండా, అదరకుండా ఈటెల అవినీతి మరింత బైట పెట్టాం!

గటిక విజయ్‌ కుమార్‌ గురించి ముందే హెచ్చరించాం!

సిఎంవోలో సాక్షిగా అక్రమాలకు తెరతీశాడని చెప్పాం!

వినిపించుకోలేదు సరికదా!

నేటిధాత్రి ఎమ్‌ప్యానల్‌ మెంటు ఆపారు?

బొంతు గురించి ఎన్నో సార్లు రాశాం…ఎప్పుడో పుట్ట పగలడం ఖాయం?

నమ్మిన వాళ్లను ముంచి, బిజేపిలో చేరితే సచ్చీలురౌతారు?

పార్టీలో ఇలాంటి వాళ్లు చాలా మందే వున్నారు?

వారిని గుర్తించి ప్రజల ముందు వుంచుతాం…

జనం గుండెల్లో అక్షర నాదం…నేటి ధాత్రి అక్షర వేదం.

వాళ్లు నమ్మదగిన వాళ్లే కాదని ముందే చేప్పాం…! ప్రజల సొమ్ము తింటున్నారు. కోట్లు కూడేసుకుంటున్నారు. ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నారు. పైరవీలతో పైసాపైసా వెనకేసుకుంటున్నారు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతో కోట్లకు పడగలెత్తుతున్నారు. నమ్మకం వున్న చోటే మోసానికి తావుంటుందని నిరూపిస్తున్నారని నేటిధాత్రి ఎంతో కాలంగా చెబుతూనే వస్తోంది. కాని నేటిధాత్రి అక్షరాలది అరణ్య రోధనే అయ్యింది. పట్టించుకున్నవారు లేరు…కనీసం వాటిని గురించి ఆరా తీసిన వాళ్లు లేరు. నిజాలు చెప్పిన నేటిధాత్రినే ఇబ్బందులకు గురిచేసే పనులు చేస్తున్నా, పాలక పక్షం పెద్దలు పట్టించుకోలేదు. వారినే నమ్మారు…. అక్రమార్కుల గురించి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నేటిధాత్రి అక్షరాలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ దాకా ఈ అవినీతి పరులు చేరనివ్వలేదు. నమ్మి దగ్గర పెట్టుకున్న వాళ్లే నిమ్మించి గోతులు తీస్తుంటే కనుక్కోలేకపోయారు. నిజాలు చెప్పిన నేటిధాత్రి మీద క్షక్ష్య పెంచుకున్నారు. ఆఖరుకు చెప్పుకోవడానికి ఎంత సిల్లీగా వుంటుందంటే అక్రిడిటేషన్‌ కార్డు సైతం ఆపించారు…హెల్త్‌ కార్డు జారీ చేయలేదు…ఆసుపత్రిలో వైద్యం అవసరం వచ్చినప్పుడు కూడా సాయం అందుకుండా చేశారు..అలాంటి వారు ప్రభుత్వ సిఎంవో కార్యాలయంలో తిష్ట వేసుకొని కూర్చొని నేటిధాత్రిని అణచివేసే కుట్ర చేశారు. అయినా పార్టీ పెద్దలు, పాలక పెద్దలు వారినే నెత్తిన పెట్టుకున్నారు. నిజాలు చెప్పిన వాళ్లు విరోధులయ్యారు. 

ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్న వారు ఆప్తులయ్యారు. అందలమెక్కారు. ఒక్కసారిగా వారి అసలు స్వరూపం తెలిసి అవాక్కయ్యారు. అదేదో నేటిధాత్రి చెప్పినప్పుడే కదిలితే, తేరుకుంటే ఎంతో బాగుండేది. ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదాకా కళ్లు తెరవలేకపోయారు. ఈటెల రాజేందర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. సిఎంలో సిపిఆర్వోగా పనిచేసిన గటిక విజయకుమార్‌ విషయంలోనూ అదే జరిగింది. ముందు నుంచి హెచ్చరిస్తున్న నేటిధాత్రి చెప్పిన విషయాలే నిజాలయ్యాయి. ఉద్యమకాలం నుంచి ఎంతో నమ్మి, ఆయనను పక్కన పెట్టుకొని, ఆయన కోసం కొందరిని పక్కన పెట్టి మరీ నమ్మితే ఈటెల రాజేందర్‌ చేసిందేమిటో తెలిసే వరకు కాలం ఎప్పుడో చేయిదాటిపోయింది. ఈటెల రాజేందర్‌ వ్యాపారం సామ్రాజ్యం ఎంతో పెరిగిపోయింది. ప్రభుత్వాలు తేల్చలేనంత దూరం వెళ్లిపోయింది. ఈటెల రాజకీయం కూడా ఏకు మేకైంది…ఈటెల మంత్రిగా తన ప్రస్ధానం మొదలైన నాటి నుంచి చేస్తున్న జిత్తులు రాస్తూనే వున్నాం. అసైన్డ్‌ భూముల ఆక్రమణ గురించి నేటిధాత్రి చెప్పింది. సివిల్‌ సప్లయ్‌ శాఖలో జరిగిన అవినీతిని మొత్తం బైట పెట్టింది. పార్టీకి నిజాలు చెబుతూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా వుండాలని ఎంత చెప్పినా వారి చెవికెక్కలేదు. నేటిధాత్రి వార్తలు ఆనాడు అబద్దాలుగా కనిపించాయి. కాని అవే నిజమయ్యాయి. 

అవినీతి పరుడైన ఈటెల మూలంగా నేటిధాత్రి ఎదుర్కొన్న కేసులు, ఎదరైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈటెల రాజేందర్‌ పోలీసులను పురిగొల్పి కేసులు నమోదు చేస్తే, ఆనాడు బిజేపి నేతలే అన్యాయమన్నారు. తెలంగాణలోని 23 జిల్లాల్లో ఏక కాలంలో ఈటెల అక్రమాలపై ధర్నాలు చేశారు..కాని అదేంటో ఆ ఈటెల రాజేందర్‌నే బిజేపి పెద్దలు అక్కున చేర్చుకున్నారు. ఆదరించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌పై మాట్లాడేందుకు ఒక అస్త్రంగా ఈటెలను వాడుకుంటున్నారు. ఇవి నైతికతను ఆపాదిస్తాయా? అన్నది బిజేపి పెద్దలే ఆలోచించుకోవాలి. అవినీతి పరుడుని తేలిన మరుక్షణం ఆయన బిజేపిలో చేరి తనంత సచ్చీలుడు లేడని కితాబిచ్చుకుంటున్నాడు. అక్రమ ఆస్ధులను పేదలకు పంచుతున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. కష్టపడి సంపాదించిన సొమ్ము కాకులెత్తుకుపోతున్నట్లు నానా యాగీ చేస్తున్నాడు. అక్రమ సంపాదనదారుడు ఈటెలే గాయి, గాయి చేస్తున్నాడు. తన ఆస్ధులు లాక్కుంటున్నారంటూ అపవాదులేస్తున్నాడు… ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీదనే పోటీ చేస్తానని బీరాలు పలుకుతున్నాడు. పుట్టింది టిఆర్‌ఎస్‌లో, పెరిగింది టిఆర్‌ఎస్‌లో…అక్రమ సంపాదనాపరుడై బైటకు వెళ్లగొడితే తేలు కుట్టిన దొంగలా వుండాల్సిన వాళ్లే, అరుస్తున్నారు..ఆగమాగం చేస్తున్నారు…ప్రభుత్వ పెద్దల మీదనే బురద జల్లుతున్నారు. నమ్మించి మోసం చేసే నైజం ఈటెలదని నేటిధాత్రి ఎంత చెప్పినా వినిపించుకోని వాళ్లు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాలేదా? 

ఎంతో నమ్మి, పక్కన పెట్టుకుంటే సిఎంపిఆర్వో గటిక విజయ్‌కుమార్‌ చేసిందేమిటి? ప్రభుత్వానికి సేవ చేయాల్సిన సమయంలో, పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన తరుణంలో, అన్నీ వదిలేసి ఆస్ధులు కూడబెట్టుకునే పనిచేస్తున్నాడంటే ఒక్కరైనా విన్నారా? ఒక్కరైనా నేటిధాత్రి నిజాలను ఆలకించారా? కనీసం ఎందుకు ఇలా నేటిధాత్రిలో కథనాలొస్తున్నాయన్నదానిపై ఆరా తీశారా? లేదు! ఓ వైపు గటిక విజయ్‌ కుమార్‌ అక్రమాలకు పాల్పడుతున్న విషయాలు వెలుగులోకి తెస్తుండడంతో అతను నేటిధాత్రి మీద కక్ష్య పెంచుకున్నాడు. సమాచార శాఖలో పత్రికను అడ్డుకునే ఎత్తుగడలు వేశాడు. నేటిధాత్రిని అణిచే కుట్రకు తెరతీశాడు. అయినా నేటిధాత్రి వెరవలేదు. బెదరలేదు. ఎట్టకేలకు నేటిధాత్రి కథనాలు నిజమయ్యాయి. గటిక విజయ్‌కుమార్‌ సిఎంవోను నుంచి సాగనంపబడ్డాడు. కాని ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని వదిలేశారు. దాంతో ఆయన కూడేసుకున్న సొమ్ముతో తమ్ముడిని బిజేపిలోకి పంపించే యోచన చేస్తున్నాడు. బిజేపిలో చేరి సచ్చీలుడుగానే కాదు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా గటికి విజయ్‌కుమార్‌ పావులు కదుపుతున్నాడు. 

                  ఒకనాడు ఒక సామాన్యమైన జర్నలిస్టు. జీతం మీద ఆధారపడి జీవనం సాగించే జర్నలిస్టు కొంత కాలం పాటు సిఎంవోలో పనిచేస్తే వందల కోట్ల ఆస్ధులు సంపాదించొచ్చా? సహజంగా జీతంతో జీవితం వెల్లదీసే ఉద్యోగులు ఒక్క నెల జీతం ఆలస్యమైతేనే ఆగమాగమౌతారు. అలాంటిది గటిక విజయ్‌కుమార్‌ను సింఎంవోతోపాటు, విద్యుత్‌ శాఖ ఉద్యోగం కూడా కోల్పోయి ఎంతో కాలమైతుంది. అయినా ఆయన ఎక్కడా ఎలాంటి పని చేయడంలేదు. అంటే ఎంత వెనకేసుకుంటే అంత నిశ్చింతగా బతకుతున్నాడు. ఇప్పుడు తాజాగా ఎన్నికల మీద దృష్టిపెట్టినట్లు, టిఆర్‌ఎస్‌ మీద పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందకు బిజేపిని ఎంచుకొని, తనపై కేసులు కాకుండా చూసుకొని రాజకీయాలు చేయడానికి సిద్ధమౌతున్నాడని సమాచారం. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వ పెద్దల ఉదాసీనత మరోసారి ప్రస్పుటంగా కనిపిస్తోంది. జర్నలిస్టుగా పనిచేసినంత కాలం లేని ఆస్ధులు ఐదేళ్లపాటు సిఎంపిఆర్వోగా పనిచేయగానే వచ్చాయంటే ఏ తరహా పైరవీల వ్యాపారం సాగించాడో అర్ధం చేసుకోవచ్చు. ఎంత సక్రమ సంపాదనా పరుడైనా వందల కోట్లు ఐదేళ్ల కాలంలో సంపాదించడం అన్నది కుదిరేపని కాదు. అక్రమార్జన వుంటే తప్ప వందల కోట్లు సంపాదించుకోవచ్చని గటిక విజయ్‌కుమార్‌ నిరూపించినట్లే లెక్క. 

అలాగే గతంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా వుండి చేసిన అక్రమాలపై కూడా నేటిధాత్రి అనేక కథనాలు రాసింది. ఆయన కథ కూడా కంచికి చేరింది. కాని ఆయన ఇప్పుడు తనంత గొప్ప నాయకుడు లేడన్నట్లు రాజకీయ వేదిక కోసం ఆరాపడుతున్నాడు. బిజేపి వైపు చూస్తున్నాడు. ఇలా ప్రభుత్వంలో పనిచేస్తూ మేయర్‌ పాత్ర పోషిస్తూ బొంతు రామ్మోహన్‌ చేసిన అక్రమాలపై నేటి ధాత్రి ఎన్ని వివరాలు చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో తన సంపాదన కూడా పాపం పెంచుకున్నట్లు పెంచుకున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నదే…కాని టిఆర్‌ఎస్‌ పెద్దలు మాత్రం కదలడం లేదు. ఏదో ఒకనాడు బొంతు కూడా తాను సచ్చీలుడిననే పాత్రలో దూరిపోయే సమయం కూడా పెద్దగా దూరం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. అవినీతి పరులపై నేటిధాత్రి అక్షరాలు ఇంత వరకు వృధా కాలేదు. గతంలో జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా కలెక్టర్‌ అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చి, జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టడానికి కూడా నేటిధాత్రే కారణమన్న సంగతి తెలిసిందే…! అడుగడునా ఆటంకాలు ఎదురైనా, అక్రమార్కులను వదలిపెట్టకుండా, నిప్పులాంటి నిజాలను అక్షరాలుగా మలిచి, ప్రపంచం ముందు వారిని దోషులుగా నిలబెట్టిన చరిత్ర నేటిధాత్రిది…ఉద్యమ కాలంగా ఉద్యమాన్ని భుజాన మోసి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రగతి కోసం సాగుతున్న అక్షర యజ్ఞమే నేటిధాత్రి….! మా అక్షరాల నైజం నిజం…మేం చెప్పదలుకున్నది చెబుతాం…నిజాలు వెలుగులోకి తెస్తాం… ప్రజల ముందు వుంచుతాం…! తెలంగాణ కోసం కొట్లాడిన అక్షరాలు…తెలంగాణకు అన్యాయం చేసే వారిని కూడా వదిలిపెట్టదు…! మా అక్షర ప్రయాణం ఎంతో కఠిన తరం…అయినా అలవోకగా అక్షరాలు పేర్చి, అవినీతిని చీల్చి చెండాడుతాం..వెలుగురేఖలు ప్రసరించేందుకు దివిటీలమౌతాం.. నిరంతరం జనం గుండెల్లో అక్షర నాదం చేస్తూనే వుంటాం!

‘‘బొంతు’’…బరితెగింపు?

పార్టీ పరువు తీయడమే అంతరంగమా?

గోడ దూకడం కోసమే ఎత్తుగడా?

పార్టీ పెద్దలను కూడా ఎదిరించగలనని సంకేతమా?

ప్రతిపక్షాలు తనవైపు చూడడం కోసమేనా?

అసమ్మతి నేతలతో బొంతు మంతనాలు నిజమేనా?

ఒక్కసారి మేయరైతేనే ఇంత హంగామానా?

ఎంత సంపాదించకపోతే అంత అతివిశ్వాసముండునా?

ఇంత హంగామా ఎవరూ చేయలేదు?

ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డులో బాణాసంచా…

పొరపాటున మెట్రో స్టేషనుపై నిప్పురవ్వలు పడివుంటే?

నిత్యం సందడిగా వున్న చోట ఏదైనా ప్రమాదం జరిగివుంటే?

రోడ్డుకిరువైపులా ఫ్లెక్సీలు….

గంట పైగా ట్రాఫిక్‌ జామ్‌….

నడి రోడ్డు మీద హంగామా…

తిట్టిపోసిన జాతీయ మీడియా…

పార్టీ పరువు బజారుకీడ్చిన బొంతు

బొంతుపై చర్యలుండేనా? ఇంకా వేచి చూసే ధోరణేనా!?

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

పదవుల యావ తప్ప ప్రజా సేవ తెలియని వాళ్లంతా నాయకులైతే రాజకీయాలు చేస్తారే గాని ప్రజలనేముద్దరిస్తారని పెద్దలు ఎప్పుడో చెప్పారు…ఇప్పుడు కొందరి వ్యవహారం సరిగ్గా అలాగే వుంది. సహజంగా నాయకుడు ప్రజా క్షేత్రం నుంచి ఉద్భవించాలి. ప్రజా సేవ తెలిసి వుండాలి. ప్రజలకు అడుగడుగునా మేలు చేసే గుణంలో నుంచి నాయకుడు పుట్టాలి. అంతే కాని కలిసొచ్చే కాలానికి నాయకుడైతే, కాలం వెంట పరుగెత్తడం తప్ప, ప్రజల వైపు చూసే అవకాశమే వుండదు. ఉద్యమం పుణ్యమా అని నాయకుడై, జనం నమ్మి గెపిస్తే ప్రజా ప్రతినిధైతే ప్రజలకు మేలు చేసే పనులు ఏమైనా చేశానని చెప్పుకునేందుకు ఒక్కటి కూడా లేని వాళ్లు చాలా మంది వుంటారు. ప్రజల కోసం పనిచేయాల్సిన సమయంలో స్వలాభం కోసం పనిచేసే వాళ్లు సంపాదనా పరులైనప్పుడు ప్రజలు అన్న పదం కాకుండా, పదవులు అన్న పదమే పదేపదే వినిపిస్తారు. సహజంగా ఏ నాయకుడైనా ప్రజలకు సేవ చేసే బాగ్యం కల్గించాలని కోరుకుంటారు…కాని కొందరు ప్రజల పేరు చెప్పుకొని బాగుపడేందుకు రాజకీయాలు ఉపయోగించుకుంటారు…ఎప్పుడూ ఏదో ఒక పదవి కావాలని కోరుకుంటారు? అందుకు ఎంతకైనా తెగిస్తారు? ఎవరినైనా మోసం చేస్తారు? అలా చాలా మంది వుంటారు..అలాంటి వారిని ప్రజలు దూరం పెట్టాలి. పార్టీలు కూడా వారిని దరి చేరకుండా చూసుకోవాలి. కాని రాజకీయాల్లో వస్తున్న మార్పులు కూడా అలాంటి నాయకులకే అనుకూలమౌతున్నాయి. వారినే అందలమెక్కిస్తున్నాయి. దాంతో వాళ్లు పార్టీ పరువు తీయడానికి కూడా వెనుకాడడం లేదు…? అందుకే తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో కొందరు నేతలు చేసే పనులు వివాదాస్పదమౌతున్నాయి. పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అలాంటి ఘటనలో బొంతు రామ్మోహన్‌ పుట్టిన రోజు వేడకులు టిఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా పరిణమించాయి.  

పుట్టిన రోజు వేడుకలు అందరూ చేసుకోవాలి. ఆడంబరంగా చేసుకోవాలి. కాదని ఎవరికీ అనే హక్కు లేదు.కాకపోతే సమస్యను రోడ్డు మీదకు వచ్చినప్పుడే ఎవరైనా ప్రశ్నిస్తారు? నిలదీస్తారు? నిందిస్తారు? తాజాగా మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తన పుట్టిన రోజుల వేడుకల కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జాతీయ మీడియా తిట్టిపోసేంత? అన్నట్లైంది. నిజానికి అంగరంగ వైభవంగా బొంతు రామ్మోహన్‌ పుట్టిన రోజు వేడుకలు అని చెప్పాల్సిన మీడియా ఎందుకు తిట్టిపోసింది? అన్నది కూడా పార్టీ ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఒక్కసారి మేయరైనంత మాత్రానా ఇంత హంగామా అవసరమా? అధికార పార్టీ పేరు చెప్పుకొని జాతీయ రహదారి మీద ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం అవసరమా? ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన పుట్టిన రోజున దీవించిన వారికంటే తిట్టిపోసిన వారే ఎక్కువైతే ఆ వేడుకలు చేసుకొని ఏం లాభం? శాపనార్ధాలు పెట్టినంక ఆ వేడుకలకు ఏం పరమార్ధం? ఎంత ఖర్చు చేస్తే ఏం లాభం? రోడ్డు మీద వెళ్లిన ప్రతి ఒక్కరూ తిట్టిన తిట్టుతిట్టకుండా తిట్టినవాళ్లే…తన పుట్టిన రోజు వేడుకల కోసం యాదగిరి గుట్టకు బొంతు రామ్మెహన్‌ స్వయంగా బస్సులు ఏర్పాటు చేసి తీసుకెళ్లిన వాళ్లు తిట్టిపోశాక..ఇక పుట్టిన రోజు వేడుకలకు ఏమైనా అర్ధముందా? ఐదు వందలు ఇస్తామని జనాన్ని తీసుకెళ్లి వంద రూపాయలు చేతిలో పెట్టారని మహిళలు దీవెనలు ఇవ్వాల్సిన రోజున శపించేదాకా తెచ్చుకోవడం మూర్ఖత్వం కాదా? అతి విశ్వాసానికి నిదర్శనం కాదా? నడిమంత్రపు సిరి చూసుకొని మిడిసి పడడం కాదా? అని సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్‌ నాయకులే అంటున్నారు. ఇక ఉప్పల్‌ క్రాస్‌రోడ్డు అన్నది ఎప్పుడే వందలాది మందితో బిజీబిజీగా వుంటుంది. జిల్లాల నుంచి వచ్చే బస్సులు, సిటీ బస్సులతో ఎప్పుడూ కిక్కిరిసి వుంటుంది. పైగా పక్కనే ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ వుండడంతో ఎప్పుడూ ఎంతో రద్దీగా వుంటుంది. అక్కడ ఎప్పుడూ ట్రాఫిక్‌ జామ్‌ వుంటుంది. అలాంటి చోట వచ్చిపోయే వాహనాలన్నీ ఆపేసి, బాణా సంచా కాల్చడం ఒక రకంగా నేరమే? పైన మెట్రో స్టేషన్‌ వుంటుంది. పక్కనే పదుల సంఖ్యలో జిల్లా డిపోల బస్సులు, సిటీ బస్సులు కూడా ఆగి వుంటాయి. ఆ పక్కనే తహసిల్ధార్‌ కార్యాలయానికి వచ్చేవారి వందలాది వాహనాలుంటాయి. దాని ఎదురుగానే పోలీస్‌ స్టేషన్‌ వుంటుంది. ఆ పక్కనే మున్సిపల్‌ కార్యాలయం వుంటుంది. ఏదైనా జరగరానిది జరిగితే, ఒక్క నిప్పురవ్వ ఏ బస్సు మీద పడినా ఎంత ప్రమాదం జరిగేది? నిప్పురవ్వలు మెట్రో స్టేషన్‌ వరకు చేరితే పరిస్ధితి ఎలా వుండేది? ఈ మాత్రం అవగాహన లేకుండా వేడుకల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం నాయకత్వ లక్షణమా? ఇక రోడ్డుకిరువైపులా వందలాది ప్లెక్సీలు…మరో వైపు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌…? ఇదంతా చూస్తూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమేకాదు, బందోబస్తు కూడా కల్పించడం విడ్డూరం. కొన్నివందల వాహనాల కాన్వాయ్‌ తో వెళ్లడం, మధ్య మధ్యలో షాంపెన్‌లు పొంగించడం ఇవన్నీ జాతీయ మీడియాలో చూపించడంతో తెలంగాణ పరువు గంగలో కలిపినంత పనైంది. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల తీరును ప్రపంచానికి తెలిపినట్లైంది. సహజంగా ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, నాయకులు తెలంగాణలో నాయకులంతా ఇలాగే వుంటారమో అనుకునే అనుమానం, అవకాశం లేకపోలేదు. ఓ వైపు ముఖ్యమంత్రి కేసిఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమై వున్న సందర్భంలో, జాతీయ మీడియాలో టిఆర్‌ఎస్‌ నాయకుల తీరిదని వార్తలు ప్రసారమౌతుంటే ఆయా రాష్ట్రాలలో కాలు మోపడం సాధ్యమౌతుందా? 

ఇదంతా కావాలనే రామ్మోహన్‌ చేస్తున్నాడనేది చాలా మంది టిఆర్‌ఎస్‌ నాయకుల వాదన.తాను పార్టీ మారే యోచనతోపాటు, తన బలం, బలగం పార్టీకి కూడా రుచి చూపించాలన్న ఆలోచనతో చేసిందే అంటున్నారు. బొంతు రామ్మోహన్‌ అతి విశ్వాసం కూడా ఇందుకు నిదర్శనమంటున్నారు. తాను మేయర్‌గా పదవిని నిర్వహిస్తూనే ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. కాని కుదరలేదు. కనీసం మరోసారి మేయర్‌ పదవి కోరుకున్నాడు. అదీ సాధ్యం కాలేదు..ఆపై ఎమ్మెల్సీ కావాలనుకున్నా జరగేలేదు. తాగాజా రాజ్యసభ ఎంపి కూడా కావాలనుకున్నాడట? అంటే బొంతులోని అత్యాశకు అంతు లేకుండాపోతోందన్నది టిఆర్‌ఎస్‌ నాయకులే ఎద్దేవా చేస్తున్నారు. ఇక పార్టీలో తనకు ఏ పదవి దక్కే అవకాశం లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ఆశ తీరేలా కనిపించడం లేదని అర్ధమైనట్లుంది. అందుకే సమయం అనుకూలిస్తే ఓ జాతీయ పార్టీలో చేరేందుకు రంగం కూడా సిద్దం చేసుకున్నట్లు కూడా ఆయన అనుచర గణం చెప్పుకుంటున్నారట. గతంలో టిఆర్‌ఎస్‌ వెలుగు వెలిగి, బైటకు సాగనంపబడిన నాయకుడితో బొంతుకున్న సత్సంబంధాలు కూడా ఇందుకు కలిసివస్తాయన్న నమ్మకంతోనే బొంతు ఇలా బరితేగింపు కార్యకపాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అధికారపార్టీ నాయకులు చేసే ఏ పనులైనా దాని ప్రభావం పార్టీపై పడడం సహజం. మీడియాలో వివాదం జరగడం…చర్చలకు తావివ్వడం జరిగేదే… దాంతో కావాలనే బొంతు రామ్మోహన్‌ ఇదంతా చేశాడని కూడా కొందరు టిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. తాను కోరుకుంటున్న పదవులు ఇవ్వకుండా తనను పక్కన పెడుతున్నందునే పార్టీ పరువు తీస్తే రెబల్‌గానైనా గుర్తించి, పదవులు ఇస్తారనేది బొంతు ఆలోచన కూడా అంటున్నారు. లేకపోతే పార్టీని వదిలేస్తాడేమో అన్న సంకేతాలు కూడా పంపడానికి అవకాశం వుండేలా కూడా వుంటాయన్నది ఆయన అంతరంగమన్నది చెప్పుకుంటున్నారు. అంతే కాదు అవసరమైతే పార్టీ పెద్దలను కూడా ఎదిరించగలను ? అన్న సంకేతాలు పంపించినట్లే అన్నది కూడా పెద్దలు తెలుసుకునేలా ఆయన వ్యవహారం సాగుతున్నట్లు వినికిడి. పైగా ప్రతిపక్షాలు బొంతు రామ్మెహన్‌ బలం, బలగం తెలుసుకునేందుకు, పుట్టిన రోజు వేడుకలే ఇంత ఘనంగా చేసుకునేంత వెనకేసుకున్నాడని తెలిస్తే, అడిగిన సీటు ఇస్తారన్న నమ్మకం కూడా ఇక్కడ తెలియజేసినట్లౌతుంది. ఇదిలా వుంటే టిఆర్‌ఎస్‌లో పదవుల కోరుకొని, ఎదరుచూస్తూ ఆశలు తీరక రుసరుసలు వ్యక్తం చేసున్న అసమ్మతి నేతలను కూడా ఏకం చేసి, వారితో మంతనాలు కూడా బొంతు రామ్మోహన్‌ జరుపుతున్నట్లు కూడా సమాచారం. తనకు దక్కని ఉప్పల్‌ రాజకీయాలు , కలగాబులగం చేసి, టిఆర్‌ఎస్‌ను ఇబ్బందుల పాలు చేసి, తన ప్రతాపం చూపించాలని బొంతు కంకణం కట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

కమిష్ నర్ కోట్ల కుంభకోణం పై నిశ్శబ్దంఎందుకు.!?

ఏ ఈ రాజేందర్ రెడ్డి లీలలు.

పని జరగలేదు కానీ లక్ష 30 వేలు ఫట్, మండలమంతా ఇది పరిస్థితి.!

ప్రజా దర్బార్ లో అవినీతి గుట్టురట్టు,నేటిధాత్రి మూడు నెలలు గా చెప్పుతున్న కమిషన్ మత్తులో పంచాయతీరాజ్.!?

ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణం డబ్బుతో అధికారులను కొనేశాడు, అందుకే చర్యలకు ధైర్యం రాక అధికారుల శబ్దం.!?

మహాదేవపూర్ కుంభకోణంపై కమిష్ నర్ దారి ఎది, కమీషన్ ఆ లేక చర్యలా.!?

మహాదేవపూర్-నేటిధాత్రి:

అభివృద్ధి నిధులకు సంబంధించి కోట్ల రూపాయల దుర్వినియోగంలో పలు సాక్షాలతో పాటు ప్రజలు కూడా అవినీతి భాగవతాలను నిధుల దుర్వినియోగాన్ని బయట పెట్టడం జరిగింది వంద రోజులు పూర్తి అయినప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారులు కమిషన్ కక్కుర్తి లో పడి ఇంజనీరింగ్ చీఫ్ వరకు అక్రమాలకు పాల్పడిన అధికారిని కాపాడుకుంటూ కుంభకోణ వ్యవహారాన్ని దారి మరణించే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగడం జరుగుతుంది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిష్ నర్ కోట్ల కుంభకోణ వ్యవహారంపై నేటి వరకు సి ఆర్ డి దృష్టిలో ఉందా ఉన్నప్పటికీ సి ఆర్ డి కిందిస్థాయి అధికారులకు చర్యలు సంబంధిత వ్యవహారంపై నివేదికను అందించాలని  ఆదేశించడం లాంటి కార్యాచరణ జరిగిందా లేకుంటే పంచాయతీరాజ్ జిల్లా స్థాయి అధికారులు కమిష్ నర్ ను అధికారులు కమిషన్ కక్కుర్తిలో పడి సి ఆర్ డి ని పక్కదారి పట్టించి ఎలాంటి అవినీతి జరగలేదని తెలుపడం జరిగిందా అందుకే నేటి వరకు సి ఆర్ డి మహాదేవపూర్ అభివృద్ధి నిధుల కోట్ల కుంభకోణంపై నిశ్శబ్ద వైఖరిని వ్యవహరిస్తున్నారేమో కానీ సి ఆర్ డి కి మండలంలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం సాక్షాలు బాధితులు తోపాటు ప్రజలు సైతం ఏ ఈ రాజేందర్ రెడ్డి అక్రమాలను స్వయానా జిల్లా కలెక్టర్ కు అందించడం జరిగింది అన్న వాస్తవాలు కమిష్ నర్ దృష్టికి పోకుండా పంచాయతీరాజ్ జిల్లా అధికారులు వాస్తవాలను కప్పిపుచ్చడం వలనే సి ఆర్ డి విచారణ విజిలెన్స్ ఇన్ఫోర్స్మెంట్ క్యూ సి లకు ఆదేశాలు ఇవ్వలేదు ఏమో అని చెప్పుకోవడం జరుగుతుంది.

 

 *కమిష్ నర్ కోట్ల కుంభకోణం పై నిశ్శబ్దంఎందుకు.!?* 

 

మహాదేవపూర్ మండలంలో అభివృద్ధి పనులకు సంబంధించి కోట్ల రూపాయల నిధుల కుంభకోణం గత 100 రోజులు గా అక్రమాలు సాక్షదారాలతో బాధితులు సైతం ఇటు మీడియా ముందు అటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండడం నేడు తెలంగాణ రాష్ట్రంలో నిధుల కుంభకోణ విషయంలో ఒక సాధారణ ఏఈ స్థాయి అధికారి కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడి పై అధికారుల వరకు తన చెప్పుచేతల్లో పెట్టుకొని నేటి వరకు ఏ ఈ రాజేందర్ రెడ్డి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు జిల్లా అధికారులతో పాటు ఇంజనీరింగ్ చీఫ్ ను సైతం కమిషన్ మాయలో పడేయడం జరిగిందని నేడు చర్చించుకోవడం జరుగుతుంది. మండలానికి సంబంధించిన కుంభకోణ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లో ఉన్నప్పటికీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ నేటి వరకు మహాదేవపూర్ కుంభకోణానికి సంబంధించి విచారణకు ఆదేశించకపోవడం ప్రజలకు అర్థం కావడం లేదు. మండలంలో నాలుగున్నర సంవత్సరాల నుండి అభివృద్ధి పనుల పేరుతో ఒకవైపు నాసిరకం పనులు బినామీ కాంట్రాక్టర్లకు కమిషన్ కొరకు ఎక్కువ మోతాదులో పనులు కేటాయించడం ఎక్కువ కమిషన్ అందించిన కాంట్రాక్ట్ పనులను పర్యవేక్షించకపోవడం కమిషన్ ఎక్కువ అర్చించే కొత్త పథకాలను ప్రజలు ఇబ్బందులకు గురైతున్నప్పటికీ వాటిని అమలు చేయడం ఏ ఈ రాజేందర్ రెడ్డి తను ఒక అధికారి అన్న విషయాన్ని మరిచిపోయి కాంట్రాక్టర్ రూపాన్ని బినామీలతో దాల్చడం ఇప్పటికీ మండలంలో పనులు చేయకపోయినప్పటికీ లక్షల రూపాయలు పనులు చేసినట్లు రికార్డు చేసి కోట్ల రూపాయలను దండుకోవడం జరిగింది. ఇలా నాలుగున్నర సంవత్సరాల్లో ఏఈ రాజేందర్ రెడ్డి మండల పరిషత్ అధికారి తోపాటు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ప్రజా ప్రతినిధులు అంతా ఒక్కటై భారీగా ఉన్న మండల నిధులను అభివృద్ధి పనుల పేరిట పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలను తమ జీవుల్లోకి మళ్లించుకోవడం జరిగింది. మండలంలో భారీ కుంభకోణానికి దారి తీసిన రాజేందర్ రెడ్డి మాత్రం సెలవు పెట్టి సెలవులలో సెలబ్రేట్ చేసుకుంటూ అధికారులను తలపై వస్తున్న వార్తలు బినామీల తో కమిషన్ల వ్యవహారాన్ని కొనసాగించడం జరుగుతున్నప్పటికీ సి ఆర్ డి మాత్రం స్పందించకపోవడం ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 *పని జరగలేదు కానీ లక్ష 30 వేలు ఫట్, మండలమంతా ఇది పరిస్థితి.!* 

 

అతని మేధస్సు వందనాలు అక్రమాలు సృష్టించడంలో యావత్ రాష్ట్రంలోని ఏ శాఖలో లేని అంత తెలివితేటలు ఏ ఈ రాజేందర్రెడ్డి లో చూడవచ్చు. ఎందుకంటే రాజేందర్ రెడ్డి కి కేవలం కమిషన్ ప్రభుత్వ ఖజానాలోని నిధులు తన జీబుల్లోకి రావాలని ఒక్కటే లక్ష్యం గా ముందుకు సాగే అధికారి ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖ లో నీ మహదేవ్పూర్ మండల పంచాయతీ రాజ్ ఇంజినీర్ రాజేందర్ రెడ్డి అని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అందుకు ప్రజలందరూ అక్రమాల సృష్టికర్తగా అతనికి వందనాలని చెప్పుకోక తప్పడం లేదు. ఏఈ హోదాలో ఉండి పలు అనామకులకు కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే క్రమంలో పెట్టుబడులు పెట్టి వారి పేరున వందల పనులను పూర్తిగా నాసిరకం పనులు నిర్వహించి బిల్లులను చేపట్టడం జరిగింది. అలాగే అంచనాలకు మించి అతని అక్రమాలకు సృష్టించడంలో తెలివి ఎవరికి సాటి కాదు అన్నది వాస్తవమే అన్నట్టుగా ప్రభుత్వ నిధుల పేరుతో ఎలాంటి పనులు చేపట్టకుండానే అక్కడ పెద్ద మొత్తంలో పని నిర్వహించినట్లు లక్షల రూపాయల బిల్లులను రికార్డ్ చేసి అటు బినామీలకు అందించి వారి దగ్గర నుండి ఏ ఈ రాజేందర్ రెడ్డి తీసుకోవడం ఇలా మండలంలో లెక్కలేని పనులను కోట్ల రూపాయల నిధులను పనులు చేసినట్లుగా నమోదు చేసి పెద్ద మొత్తంలో నిధులను దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. తాజాగా మండలంలోని సూరారం గ్రామంలో కాగితంలో మాత్రం పేరు పనిచేయడం జరిగిందని అక్కడ మాత్రం ఇలాంటి పని చేయలేదని అయినప్పటికీ ఒక లక్ష 30 వేల రూపాయల బిల్లును రికార్డ్ చేసి నిధులు బినామీల ద్వారా ఏ ఈ జేబుల్లోకి మళ్లించుకోవడం జరిగింది.

 

 

 *ప్రజా దర్బార్ లో అవినీతి గుట్టురట్టు,నేటిధాత్రి మూడు నెలలు గా చెప్పుతున్న కమిషన్ మత్తులో పంచాయతీరాజ్.!?* 

 

మండలంలో కోట్ల కుంభకోణం జరిగిందని నిధుల పేరుతో ఏ ఈ రాజేందర్ రెడ్డి మండల పరిషత్ అధికారి తో పాటు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై నాలుగున్నర సంవత్సరాల నుండి మండలానికి ప్రభుత్వం వెచ్చించిన కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని పలు సాక్షాలను సైతం నేటి ధాత్రి బయటపెట్టింది. కానీ కోట్ల కుంభకోణ వ్యవహారంలో మండల స్థాయి నుండి చీఫ్ ఇంజనీర్ వరకు అంతా ఏఈ రాజేందర్ రెడ్డి కమిషన్ మాయలో పడి ఉండడం నేటి వరకు అతనిపై చర్యలు తీసుకోకపోవడం సి ఆర్ డి తోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలా దృష్టిలో మహదేవ్పూర్ కుంభకోణ వ్యవహారం ఉన్నప్పటికీ మండలంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని తప్పుడు సమాచారం ఇస్తూ చర్యల కు ఆదేశించకుండా ఉండుటకు నేటికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తాజాగా నేటి ధాత్రి వరుస కథనాలను పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా స్పందించకుని క్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ రాజేందర్ రెడ్డి ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు సాక్షాలు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ పంచాయతీరాజ్ ఉన్నత అధికారులు సి ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీలు చర్యలకు ఆదేశిస్తే లేరని ప్రజలు వారి విధి నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక ప్రజా దర్బార్ లోనే ఏఈ అక్రమాలను తామే వెలిగితీస్తామని ఏకమై తమ గ్రామంలో ఏ ఈ చేసిన అరాచకాలను వెలికి తీసే క్రమంలో నీరుగా ప్రజలే రంగంలోకి దిగి పైపులు వేయకుండానే వేసినట్లు రికార్డు చేసి ఒక లక్ష 38 వేల రూపాయల బిల్లులు నమోదు చేయించి బినామీలతో డబ్బులను తీసుకోవడం జరిగింది అన్న విషయాన్ని ప్రజలు బహిర్గతం చేయడం జరిగింది. తన అక్రమాలు తెలుసుకున్న రాజేందర్రెడ్డి హటావోటిగా పైపులను అమర్చించే కార్యక్రమం చేపట్టడంతో ప్రజలు వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం పైపులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో మహాదేవపూర్ గ్రామ పంచాయతీకి పైపులను పంపించడం జరిగింది. నేటి ధాత్రి గత 100 రోజుల నుండి ఏ ఈ రాజేందర్ రెడ్డి మండలంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డాడని పలు ప్రదేశాల్లో అవసరం లేనప్పటికీ నాసిరకం పనులు అలాగే పనులు చేయకుండానే బిల్లులను రికార్డు చేయడం జరుగుతుందని వరుస కథనాలు వ్రాస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ జిల్లా అధికారులు తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడం జరిగింది. చివరికి నేటి ధాత్రి కథనాలు సాక్ష్యాలుగా ప్రజల దర్బార్ లోనే అక్రమాలకు ప్రజలే అధికారులుగా మారి వెలికి తీయడం జరుగుతుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత కమిషన్ మత్తులో ఉందో దీన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది.

 

 

 *ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణం డబ్బుతో అధికారులను కొనేశాడు, అందుకే చర్యలకు ధైర్యం రాక అధికారుల శబ్దం.!?* 

 

పి ఆర్ రాజేందర్ రెడ్డి అంటేనే ఒక అక్రమ బ్రాండ్ గా కమిషన్ కలెక్షన్ కింగ్ గా యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లా తో పాటు పంచాయతీరాజ్ శాఖలో ఒక మారు మోగుతున్న పేరు. మండలంలో కుంభకోణ వ్యవహారం పుట్టను బహిర్గతం చేసి వంద రోజులు పూర్తి అయినప్పటికీ తాజాగా కమిషన్లలో లక్షలకు పైనే అమాయక కాంట్రాక్టర్ల దగ్గర నుంచి దోచుకున్న రాజేందర్ రెడ్డి చివరికి ఎలాంటి పని నిర్వహించకుండానే తనకు ఇష్టమొచ్చినంత బిల్లును రికార్డ్ చేసి నిధులను తన జీబుల్లోకి మళ్లించే సత్తా ఉన్న ఏ ఈ ప్రజలు తిరుగుబాటై అక్రమాల చిట్టాలు బయటపడుతున్న క్రమంలో అతనిపై వేలెత్తి చూపే అధికారి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పంచాయతీరాజ్ శాఖలో లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజేందర్ రెడ్డి అంటే పిఆర్ శాఖలోనే అక్రమాలకు కమిషన్లకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారడం ఏ అధికారి అయిన రాజేందర్ రెడ్డి కమిషన్ మాయలో పడాల్సిందే ఎందుకంటే అధికారిని బట్టి కమిషన్ రేటు కమిషన్ రేటును ఫిక్స్ చేసి వారికి అందించే సత్తా కేవలం రాజేందర్రెడ్డి లోనే ఉండడం ఇక జిల్లా అధికారులతో పాటు ఉన్నత అధికారులకు ప్రభుత్వం మహాదేవపూర్ మండలానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన విషయం తెలిసి ఉండడం తమకు ఊహించినంత కమిషన్ వస్తుందని తమకు రాజేందర్రెడ్డి ఉన్నాడని జిల్లా అధికారులతో పాటు ఉన్నత అధికారులు సైతం ఒక భరోసాతో ఉండడం రాజేందర్ రెడ్డి కుంభకోణ వ్యవహారం సాక్షాలు న్యాయస్థానాలను సైతం పనికిరాకుండా చేసింది కమిషన్ వ్యవహారం నేటికి రాజేందర్ రెడ్డి పై ఈ ఒక్క పంచాయతీరాజ్ అధికారి తన విధి నిర్వహణలో బాధ్యతగా అక్రమాలపై కన్నేసిన అధికారి కరువైపోవడం ఎందుకంటే రాజేందర్ రెడ్డి మండలంలో అక్రమాలకు పాల్పడిన డబ్బులు అధికారులకు పంచిపెట్టడం జరగడంతో నేటికీ ఏ ఒక్క అధికారి ముందుకు రావడం లేదు. గత వారం రోజుల క్రింద డి ఈ సాయిలు ఏ ఈ రాజేందర్ రెడ్డి తనకేమీ కాదని అధికారులంతా నా వైపే ఉన్నారని వారి చిత్త నా దగ్గర ఉందని నాపై చర్యలకు ఆదేశిస్తే వారు ఎవరు తోడిన గోతిలో వారు కూడా పడతారని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ బినామీలకు చెప్పుకున్నట్లు మండలమంతా ఒక చర్చనీయంగా మారింది. అలాగే డి ఈ సాయిలు కూడా పలు ప్రదేశాల్లో పలువురు వ్యక్తులతో రాజేందర్ రెడ్డి కి ఏమి కాదు పంచాయతీరాజ్ శాఖలో నాసిరకం కమిషన్ అనేది సరే మామూలే ఎవరు అధికారులు పట్టించుకోరు అని చెప్పుకోవడం కూడా చర్చనీయంగా మారింది దీన్నిబట్టి చూస్తే పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులకు రాజేందర్ రెడ్డి కమిషన్ వ్యవహారం ఇక్కడ వరకు దారితీసిందో అర్థమౌతుంది.

 

 *మహాదేవపూర్ కుంభకోణంపై కమిష్ నర్ దారి ఎది, కమీషన్ ఆ లేక చర్యలా.!?* 

 

మహదేవ్పూర్ మండలంలో నిధుల దుర్వినియోగం కుంభకోణ వ్యవహారం సత్వర చర్చల్లో ఉన్నప్పటికీ జిల్లా స్థాయి పంచాయతీ అధికారులు అలాగే ఇంజనీరింగ్ చీఫ్ సైతం కమిషన్ మాయలు పడి ఉన్నారని అందుకు నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శాఖ ఉన్నత అధికారి లో ఒకరైనప్పటికీ నేటి వరకు ఏ ఈ రాజేందర్ రెడ్డి భాగవతం సి ఆర్ డి దృష్టి కి పోలేదా కావాలని కమిషనర్ ను కమిషన్ కక్కుర్తి లో ఉన్న అధికారులు పక్కదారి పట్టించారా ఇలా ఎన్నో అనుమానాలు ప్రజల్లో వ్యక్తం కాక తప్పడం లేదు. ఏది ఏమైనప్పటికీ కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఇప్పటికైనా మహదేవ్పూర్ కుంభకోణంపై తక్షణమే విజిలెన్స్ ఇన్ఫోసిమెంట్స్ క్యూసీలకు విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడుతూ కోట్ల రూపాయల నిధులను వెచ్చించిన క్రమంలో ఒకవైపు ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా మరోవైపు శాఖను అప్రతిష్ట పాలు చేసేలా వ్యవహరిస్తున్న ఏఈ రాజేందర్ రెడ్డి తో పాటు జిల్లా స్థాయి అధికారులు అలాగే మండల పరిషత్ అధికారులతో పాటు పలు ప్రజాప్రతినిధులపై విచారణ జరిపి ఇప్పటికీ అక్రమాలకు పాల్పడిన నిధులను తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా చర్యలు చేపట్టి వారిపై శాఖ పరమైన చర్యలు చేపట్టి పంచాయతీరాజ్ శాఖ నుండి వారికి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని మండలం తో పాటు యావత్ జిల్లా ప్రజలు కమిష్ నర్ ను కోరుతున్నారు. ఇక కమిషనర్ దారి ఎటు ఇటు అన్నది ఏఈ రాజేందర్ రెడ్డి పై చర్యలు తీసుకుంటే తెలుస్తుంది.

త్యాగం కూడా గర్వపడే గుణవంతుడు .పేదల పాలిట పెన్నిధి పొంగులేటి శ్రీనివాసుడు.

త్రిబుల్‌ కె వర్సెస్‌ సింగిల్‌ ఆర్‌ 

మిస్టర్‌ కూల్‌ లైఫ్‌…

గెలుపు నాడు పొంగిపోలేదు.

టిక్కెట్టు రాకపోతే కుంగిపోలేదు

నమ్మిన సిద్దాంతం కోసం సాగుతున్నారు..

వివాదాలకు దూరంగా వున్నా… విమర్శలను ఎదుర్కొన్నారు…

పార్టీలో ఇబ్బందులూ ఎదురైనా..అయినా చిరునవ్వుతోనే సాగతించారు.

ఆ ఓపికే నేడు ఎంతో పనికొచ్చింది..

పార్టీకి జిల్లాలో ఆయన పెద్ద దిక్కుగా కనిపిస్తోంది….

కొట్టుకున్నా, తిట్టుకున్నా రాజకీయంగా తొక్కుకున్నా, కమ్మలంతా ఒక్కటే అని తెలుగు రాజకీయాల్లో వున్న రాజీ నానుడి. అది ఖమ్మంలోనూ వుందంటారు. అలాంటి ఖమ్మంలో సై అంటే సై అంటూ త్రిబుల్‌ కెలను ఎదుర్కొని నిలిచిన సింగిల్‌ ఆర్‌ ….పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. బ్రాండ్‌ కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన, చెప్పగలిగిన ఏకైక నాయకుడు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అవకాశాలు కలిసొచ్చినా కొన్ని సార్లు అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టం కలిసొచ్చినా అవకాశాలన్నీ కళ్ల ముందు వాలాలి. ఈ రెండిరటిలో ఏది ఒక సెకన్‌ ఆలస్యమైనా ఇబ్బందే. ఎంచుకోవడంలో ఒక్క నిమిషం తొందర పడినా చిందర వందరే…! అన్నీ వున్నా కొన్ని సార్లు ఏదీ కనిపించదు. ఏదీ లేకపోయినా అన్నీ ఒక్కసారిగా కళ్లముందు మెదులుతాయి. వీటికి సరిగ్గా సరిపోయే నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఎంపిగా గెలిచినప్పుడు ఆయన ముందు ఏదీ కనిపించలేదు. గెలిచిన పార్టీ వైసిపికి తెలంగాణలో చోటు లేదు. ఆ తర్వాత ఆయన టిఆర్‌ఎస్‌ చేరినా, పార్టీ అధికారంలో వున్నా ఆయనకు ఏ పదవి లేదు. ఇలాంటి విచిత్రమైన చరిత్రలో ఎదుర్కొన్న నాయకుడు ఒక్క శ్రీనివాస్‌ రెడ్డి మాత్రమే కావొచ్చు. ఖమ్మం ఎంపిగా గెలిచేదాకా ఆయన ఎవరో చాలా మందికి తెలియదు. తను అడుగు పెట్టిన రంగంలో విజయాలు తప్ప అపజయాలు లేకుండా అప్రతిహాతంగా శ్రీనివాస్‌ రెడ్డి సాగిపోతున్నారు. ఎన్టీఆర్‌ కాలంలో చిన్నగా ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలు పెట్టి, ఇంతింతై వటుడిరతై అన్నట్లు అనేక రాష్ట్రాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల పనులు నిర్వహిస్తున్నారు. అనుకోకుండా ఎంపి అయ్యే అవకాశం వచ్చింది. ప్రజల దీవించారు. ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నుంచి వైసిపి పార్టీ తరుపున గెలిచారు. కాని ఆ పార్టీ తెలంగాణలో ఖమ్మం మూలలో తప్ప, మరోచోట లేకుండాపోయింది. దాంతో శ్రీనివాస్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ అవకాశం కలిసొచ్చింది. కాని అదృష్టమే కొంత కొంటెచూపు చూసింది. ఇక టిఆర్‌ఎస్‌లో చేరే అదృష్టం ఎదురైంది. కాని తర్వాత ఎన్నికల్లో టిక్కెట్‌రాకుండా పోయింది. అదృష్టం,అవకాశం రెండూ ఒకేసారి పొంగులేటిని వరించకపోవడంతో రాజకీయ జీవితం మళ్లీ మొదటికొచ్చింది. అయినా ఎన్ని వార్తలు నిత్యం చక్కర్లు కొడుతున్నా గుబాబీకి తోడుగా, కారుకు అండగా పొంగులేటి సాగుతున్నారు. ఎలాంటి విభేదాలు పొడసూపకుండా చూసుకుంటున్నారు. 

                               ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రస్తుత పరిస్ధితుల్లో హాట్‌ టాపిక్‌. గత ఏడాది కాలంగా ఆ జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవి పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి మీద ప్రభావం చూపేలా వుంటున్నాయి. అవి అనుకోకుండా జరిగినా, జరగాల్సి వచ్చి జరిగినా నాయకుల స్వయం కృతాపరాధం మూలంగానే జరిగాయన్నది మాత్రం వాస్తవం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కాని ఇన్ని జరగుతున్నా జిల్లాలో మిస్టర్‌ కూల్‌గా వున్న ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితికి బలమైన నాయకుడు. ఎమ్మల్యే వనమా నాగేశ్వరరావు కొడుకు వ్యవహారం, తాజాగా మంత్రి అజయ్‌ మూలంగా పార్టీకి జరిగిన డ్యామేజ్‌ అంతా ఇంతా కాదు. అయినా పార్టీలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వున్నాడన్న నమ్మకం కార్యకర్తలో ధైర్యాన్ని నింపుతోందని చెప్పడంలో సందేహం లేదు. భవిష్యత్తు ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆయన చుట్టే పరిభ్రమిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. పదవి వున్నా, లేకున్నా, ప్రజల కోసం, ప్రజల మధ్యే వుండే నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అదే టిఆర్‌ఎస్‌కు బలమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. రాష్ట్ర స్ధాయి నుంచి జిల్లాకు ఎన్ని రకాల మంచి పనులు అందించినా, క్షేత్ర స్దాయిలో నాయకుల వ్యవహార శైలి కూడా పార్టీని ఇబ్బందుల పాలు చేస్తుంది. నమ్మి పార్టీ ఎంతో చేస్తే ఖమ్మం జిల్లాలో ఇద్దరు నాయకుల మూలంగా పార్టీకి తలనొప్పులు వచ్చాయి. వాటిని అధిగమించాలంటే మళ్లీ పార్టీకి కనిపిస్తున్న ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. తమ స్వార్ధ రాజకీయాల కోసం శ్రీనివాస్‌ రెడ్డిని ప్రజాక్షేత్రానికి దూరం చేసే ఎత్తుగడలు చాలా మంది వేశారు. కాని వాళ్లే దూరయ్యే పరిస్ధితి వచ్చింది. 

మనిషిగా సాత్వికం. పట్టుదలలో కొండంత బలం. ఒక సామాన్యమైన రైతు కుటుంబం. ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం సామ్రాజ్యం. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, కేరళ, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ లాంటి రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలున్నాయి. అయినా ఆయన ప్రజా సేవలో వున్నారు. ప్రజలకు సేవ చేయడంలోనే తరిస్తున్నారు. పేదలంటే ప్రేమిస్తారు. వారిని అక్కున చేర్చుకుంటారు. వారి కోసం ఆయన సంపాదనలో చాలా వరకు ఖర్చు చేస్తుంటారు. కాని ఎక్కడా తన సామాజిక సేవా కార్యక్రమాల గురించి చెప్పుకోరు. ఉత్తుంగ తరంగం లాగా రాజకీయ యవనిక మీదకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో జత కట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వైపిసి తీర్ధం పుచ్చుకున్నారు. రాష్ట్రం విడిపోయినా వైసిపితోనే వున్నారు. ఆ పార్టీనుంచి ఖమ్మం నుంచి పోటీ చేశారు. ప్రస్తుత టిఆర్‌ఎస్‌ ఎపి. నామా నాగేశ్వరరావు మీద 2014లో 11వేల ఓట్లతో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గెలిచారు. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. అప్పటి వారకు ఆయన ఖమ్మం జిల్లాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత రాష్ట్రంలోని కొత్త తరం రాజకీయ నాయకులకు ఐకాన్‌గా నిలిచారు. ఎలాంటి రాజకీయ బ్యాక్‌ గ్రౌండ్‌ లేదు. తను నిర్మించుకున్న గ్రౌండ్‌తో మాత్రమే తనను తాను నిరూపించుకున్నారు. సక్సెస్‌కు తనే చిరునామా అని నిరూపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వైసిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆహ్వానం మేరకు ఒకే ఒక్క మాటతో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. తలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. 

వచ్చే ఎన్నికల్లో నీ సీటు నీదే అన్న ఒకే ఒక్క మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర సమితిలో పొంగులేటి చేరారు. నిజానికి ఓ ఎంపిగా, ఆయనకు వున్న పేరుకు ప్రతిష్టలకు, మరో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వుంటూ మరో పార్టీలో చేరరు. మరో నాయకుడైతే ఆ రూటు మరోలా వుండేది. కాని ఒక కమిట్‌ మెంటు అన్న దానిని ఆధారం చేసుకొని శ్రీనివాస్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. అయినా గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు రాలేదు. విధి విచిత్రమైంది. 2014 ఎన్నికల్లో ఏ నాయకుడినైతే ఓడిరచారో, అదే నాయకుడి గెలుపు కోసం పొంగులేటి శ్రమించాల్సివచ్చింది. బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. దగ్గరుండి గెలిపించాల్సివచ్చింది. అయినా చిరునువ్వుతోనే అన్నీ స్వీకరించారు. గత ఎన్నికల సమయంలో పార్టీలో పదవులు పొందికలో తప్పకుండా పార్టీ సరైన సమయంలో సరైన గుర్తింపునిస్తుందన్న మాటను కట్టుబడి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిన మాటకు, ఇచ్చిన హామీ కోసమే ఎదురుచూస్తున్నారు. ఎంత ఆజాశత్రువైనా రాజకీయాలల్లో చేరితే శత్రువులు తయారౌతారని అంటారు. అదే జరిగింది. ఏ పార్టీ కోసమైతే ఆయన శ్రమించారో ఆ పార్టీలో కూడా తోటి నాయకుల స్వార్ధం మూలంగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరుకు ఖమ్మం రావాలంటే పాస్‌ పోర్టు తెచ్చుకోవాలా? అని ప్రశ్నించేంత ఇబ్బంది పడ్డారు. అయినా ఎక్కడా ఆయన పార్టీని గాని, పార్టీ నాయకులపై భహిరంగంగా విమర్శలు చేయలేదు. అదేంటో కొన్ని రాజకీయాల్లో విచిత్రమైన అనుభవాలు ఎదురౌతుంటాయి. ఒక వ్యాపార వేత్తగా అనేక ఎత్తు పల్లాలు చూసిన శ్రీనివాస్‌ రెడ్డి, రాజకీయాల్లో తొలిగెలుపును చూశారు. ఓటమి తెలియని నాయకుడుగా నిలిచారు. అందుకే ఆయన ఎప్పుడూ మిస్టర్‌ కూల్‌గానే వుంటారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆయన వివాదాలు ఎదుర్కొన్నారు. మాజీ మంత్రి తుమ్మల ఓటమికి కారణమయ్యాడన్న అపవాదులు ఎదుర్కొన్నాడు. కాని లోతుగా అధ్యయనం చేస్తే 2014లోనే తుమ్మల ఓడిపోయారు. అప్పుడు శ్రీనివాస్‌ రెడ్డి గెలిచారు. తుమ్మల వల్ల ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తుమ్మల వల్ల రాజకీయంగా నష్టపోలేదు. కాని కొన్ని వివాదాలు మాత్రం ముసురుకున్నాయి. అయినా ఎక్కడా తొనకని మనస్తత్వంతో ముందుకు సాగుతున్నారు. త్యాగశీలి నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. భవిష్యత్తు ఖమ్మం జిల్లా టిఆర్‌ఎస్‌ రాజకీయాలకు పెద్ద దిక్కుగా వున్నారు.

ద్వైతాద్వైతవిశిష్టాః

` ఆత్మలో లీనమైన పరమాత్మే అసలైన లోకం


` ప్రకృతిని తనలో నిక్షిప్తం చేసుకున్న దేవుడే ఈ ప్రపంచం
` నిజమే జీవిత సత్యం…
` నిజంలోనే మనిషి బతకాలి.
` నిజమే జీవితమై బతకాలి.
` నిజాన్ని నమ్మిన వాస్తవ ప్రపంచం మనం కావాలి.
`నిజాన్ని రక్షించే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలి.
` నవ్వు నిజాన్ని రక్షిస్తే, అది నీకు రక్షణగా నిలుస్తుంది.
` ముచ్చింతల్‌లో శ్రీరామ నగరం అందంగా ముస్తాబు
` అంగరంగ వైభవంగా నేటి నుంచి వేడుకలు
` పది రోజుల పాటు ఆధ్యాత్మిక శోభతో అలరాడనున్న ప్రాంగణాలు
` ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోడీ హజరు, విగ్రహావిష్కరణ
` 12న రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్‌ సందర్శన. ముగింపు ఉత్సవాలు.
` రామానుజాచార్యుల సహాస్త్రాబ్ది ఉత్సవాలు నేడే ప్రారంభం.
తర్కం చాలా విచిత్రంగా వుంటుంది. గందగోళంగానే వుంటుంది. అర్ధమైనట్లే అనిపిస్తుంది. ఆ క్షణం గడిస్తే ఏం అర్ధం కానట్లేననిస్తుంది. ఎంత విడమర్చి చెప్పినా ఏదో సందేహం వ్యక్తమౌతుంది. అదే శాస్త్రం. అందుకే తర్కాన్ని ఎప్పుడూ నేరుగా చెప్పొద్దంటారు. వెయ్యేళ్లు గడుస్తున్నా ఇంకా కొన్ని తర్కాలు జనంలో నానుతూనే వున్నాయి. ఆచార వ్యవహారాలుగా అనుసరింపబడుతున్నాయి. వాటి వెనకున్న దైవాలను కొలుస్తున్నాయి. అవి వాటి గొప్పదనమే కాదు, అందించిన మహానుభావులు నిర్ధేశించిన జీవితం సత్యం కూడా…ఎంతో గొప్పది. అందుకే వాటిని మరో వెయ్యేళ్లు ప్రజలు ఆచరిస్తూ, అసతోమా సర్గమయా, తమసోమాజ్యోతిర్గమయా…అంటూ విరాజిల్లాలి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నేడు సమతామూర్తి రామానుజాచార్యుల సహస్త్రాబ్ధి ఉత్సవాలు మొదలుకానున్నాయి.శ్రీశ్రీశ్రీ తిండండి చినజీయర్‌స్వామి నేతృత్వంలో శ్రీరామ నగరం రూపుదిద్దుకున్నది. అక్కడ ఏర్పాటు చేసిన 261 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహం వెయ్యేళ్లైనా చెక్కుచెదరని విధంగా తయారు చేయబడిరది. ముచ్చింతల్‌ లోని శ్రీరామనగరం శోభాయమానంగా రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అంకరణలు జరుపుకున్నది. ఎటు చూసినా భక్తి పారవశ్యం నింపే ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. అయితే అసలు వెయ్యేళ్ల తర్వాత కూడా రామానుజాచార్యుల బోధనలు ఏమిటన్నది ఓసారి మననం చేసుకుందాం…
మన కళ్లకు కనిపించేందంతా వాస్తవం. ప్రతీది నిజం. మనం నిజంలో బతకాలి. నిజంలోనే జీవించాలి. నిజమే జీవితం చేసుకోవాలి. నిజాన్ని ఎల్లప్పుడూ రక్షించాలి. నిజాన్ని మనం రక్షిస్తే మనల్ని నిజం రక్షిస్తుంది. ఇది తెలియాలంటే అంతకు ముందు సమాజానికి మధ్వాచార్యులు చెప్పిన ద్వైతం తెలియాలి. ద్వైతం అంటే రెండు. ఆత్మ, పరమాత్మ అనేవి రెండు. జీవుడు, జీవాత్మ అన్నవి రెండు. ప్రకృతి, దేవుడు రెండు. ఇలా ప్రపంచంలో ఏదేని వస్తువైనా రెండు రకాలుగా కనిపించొచ్చు. ఆకాశంలో ఒకరికి మేఘాలు ఐరావతంలా కనిపించొచ్చు. మరొకరికి మరో రూపంలో కనిపించొచ్చు. అంటే జీవాత్మ, పరమాత్మ అన్నవి రెండూ వున్నాయని అందరూ నమ్మాలి. అదే ఆచరించాలని మధ్వాచార్యులు చెప్పారు. ఆత్మ అన్నది నిత్యమని, సత్యమనిదానికి మరణం లేదని, దేవుడిలో లీనమైనా, అదెప్పుడూ సజీవమే అన్నది మధ్వాచార్యులు చెప్పిన సందేశం. నీవు దైవం. నేను జీవం. దేవుడు గురువు. మనిషి శిష్యుడు. జీవాత్మ, పరమాత్మ అన్నది వేర్వేరు తెలుసుకోవాలి. కంటికి కనిపించేదైనా, కనిపించనిదైనా వాసుదేవుడి మీద ఆధారపడి వుంటుందనేది చెప్పేదే ద్యైతం.
ఇక అద్యైతం. బాషా పరంగా ద్వైతం కానిది. రెండు కానిది. అంటే ఒక్కటి. సృష్టింతా ఒక్కటే. జీవుడైనా, దేవుడైనా ఒక్కటే. జీవితం…జీవాత్మ, పరమాత్మలు వేరు వేరు కాదు. రెండూ సమ్మిళితమే. రెండూ ఒక్కటే. అందుకే దేహోదేవాలయోస్రోప్తో జీవో సనాతనహాః…అన్నది శంకరాచార్యుల అద్యైతం. అంటే దేవుడు. జీవుడు ఒక్కడే. జీవాత్మనే…పరమాత్మ. పరమాత్మలేని జీవుడు లేడు. జీవుడు లేని పరమాత్మ కూడ లేడు. బ్రహ్మ ఒక్కడే దేవుడు. బ్రహ్మ జ్ఞానమే మనిషి రూపం అన్నది శంకారాచ్యులు చెప్పిన సందేశం. కాని అది అందరూ నమ్మలేదు. సమాజంలో హెచ్చుతగ్గులు తగ్గలేదు. మరింత పెరిగాయి. చెప్పుకోవడానికి బాగానే వున్నా, అసమానతలు అంతర్లీనంగా వున్నాయి. అహం బ్రహ్మాస్మి…అని శంకరుడు అన్నట్లు అందరిలోనూ అహం పెరిగితే, నేనే గొప్ప అన్నది ఉద్భవిస్తుంది. అసమానతలు పెరిగిపెద్దవౌతాయి. మరెలా అనుకున్నప్పుడే విశిష్టాద్వైతం అన్నది ప్రచారంలోకి వచ్చింది.
ఇక విశిష్టాద్వైతం. దేవుడు వేరు. జీవి వేరు. ప్రకృతి వేరు. పంచ భూతాలు వేరు. అన్ని ఒకదానితో ఒకటి లీనమై, విలీనమై, ఏకమై ఒక్కటై విశ్వమంతాటా వ్యాప్తి చెంది వున్నాయన్నది దీని అర్ధం. జీవుడు. ప్రకృతి. ఈశ్వరుడు అన్నీ సత్యాలే అన్నది రామానుజుడు చెప్పిన సిద్దాంతం. మన శరీరంలో జీవుడున్నట్లే, శ్రీమన్నారయునుడు కూడా వున్నాడని చెబుతుంది. జీవుడు వేరు. బ్రహ్మ వేరు. జీవుడు మిథ్య కాదు. ఈ ప్రకృతిలో జీవ భిన్నత్వమే తప్ప, జీవ బేధం లేదు. విశిష్టాద్వైతం ప్రకారం దేవుడు ఒక్కడే. అతను నారాయణుడే. జీవి, ప్రకృతి ఒకే కొమ్మకు పూచినవి. పరమాత్మనుంచి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ చివరకు పరమాత్మ సన్నిధి చేరడంతో మోక్షం సిద్ధిస్తుంది. ఆ మోక్షానికి అచంచలమైన విష్ణు భక్తే ముక్తి మార్గమని అందరూ నమ్మాలి. భగవంతుని శరణాగతి ప్రతి జీవికి అవసరం. మానవులంతా సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. మోక్షంలోనే ఏ వివక్ష లేదు. కుల, లింగ వివక్షలు వుండవు. ఒక్కసారి జీవాత్మ, పరమాత్మ చెంతకు చేరితే దానికి ఎలాంటి మాలిన్యం వుండదు. కొత్తగా అంటదు. అటువంటుప్పుడు జీవుల్లో ఎందుకు ఈ వ్యత్యాసం. ఎందకీ వైరుద్యం. ఎందుకీ విపరీతం. అన్నది ప్రచారం చేయడమే విశిష్టాద్యైత మూల సూత్రం. దైవారాధనకు అందరూ అర్హులే. దైవం ముందు అందరూ సమానులే. ఈ లోకంలో అందరూ ఒక్కటే. ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. నారాయణుడే సృష్టి స్ధితి లయకారకుడు. జీవుడు చిత్తు. అచిత్తు ప్రకృతి. రెండూ నారాయణ స్వరూపాలే. అభిగమనము. ఉపాదానము. ఇజ్యము. స్వాధ్యాయము. యోగాలకు అందరూ అర్హులే. ఇదే విశిష్టాద్యైతానికి మూలం. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన. సందర్భం చెప్పుకోవాలి. సహజంగా ఏ ఉపాసకుడైనా, ఏ యోగి అయినా, ఏ బోగి అయినా, ఏ స్వామి అయినా సరే గురూపదేశం బైటకు చెప్పరు. కాని రామానుజాచార్యులు చెప్పారు. ఇదే ఆయన విశిష్టాద్వైతాన్ని ఇంకా ప్రజల్లో వెలుగొందేందుకు కారణమైంది. మనుషులంతా ఒక్కటే అన్నాడు. సమాజమంతా ఏకం కావాలన్నాడు. అందరూ ఒక్కటైనే ప్రపంచం అన్నారు. ఆయన గురువైన యమునాచార్యులు తనకిచ్చిన ఉపదేశాన్ని అప్పటికప్పుడు ప్రజలకు చెప్పాడు. నిజానికి గురూపదేశాలు చెప్పరని తెలుసు. కాని ఆ మంత్రమేమిటో ఆలయ గోపురమెక్కి అందరికీ వినిపించేలా చెప్పాడు. జగత్‌ప్రసిద్దంచేశారు. గురువు చెప్పిన మంత్రం నమో…నారాయణాయః అని అందరూ పటించాలని, పాటించాలని కోరాడు. అంటే అంటే జనులందరికీ దేవుడు మోక్షం ప్రసాదించాలని, నమో నారాయణాయః మంత్రం పటించి మోక్షసిద్ది పొందాలన్నది ఆయన అభిమతం. ఇటు జీవిగా, అటు ఆత్మగా దేవుని దృష్టిలో అందరూ సమానమైనప్పుడు, సమాజంలో హెచ్చుతగ్గులు వుండకూడదన్నది రామానుజాచార్యుల ఉపదేశం. వెయ్యేళ్ల క్రితమే మనుషులంతా ఒక్కటే అని చెప్పిన రామానుజాచార్యుల మాటలు ఇంకా ఈ సమాజంలో అనుసరించడం లేదు. అది పోవాలి. హెచ్చుతగ్గులు రూపు మాపిపోవాలి. అందరం ఒక్కటే అన్న భావన అందరిలోనూ కలగాలి. మనమంతా ఒక్కటే అన్న భావన అందరిలోనూ ఉదయించాలి. అదే అనుసరించాలి. ఇదే రామానుజాచార్యులు చెప్పింది. శ్రీశ్రీశ్రీ తిండడి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ప్రచారం చేస్తోంది. అనుసరించి, ఆచరించి సమసమాజం నిర్మిద్దాం.

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

కొత్తగూడ, నేటి ధాత్రి : ఈరోజు అఖిల భారత రైతుకూలీ సంఘం ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా కార్యవర్గం పిలుపులో భాగంగా ఏ ఐ కె ఎం ఎస్ కొత్తగూడ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో మండలంలోని గుంజేడు, మైలారం తండా, చింతగట్టు తండా, హనుమాన్ తండా, రౌతు గూడెం తండా, లడాయిగడ్డ ,రామన్నగూడెం, వేలుబెల్లి గ్రామాలలో ప్రతినిధి బృందం సందర్శించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్ష కార్యదర్శులు గుగులోతు యాదగిరి మాట్లాడుతూ మండలంలోని మిర్చి పంటను సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మిర్చి తోట లో తామర పురుగు రోగం తెల్లదోమ రసం పీల్చే పురుగు పచ్చపురుగు ఎండు తెగులు తదితర చీడపీడల వైరస్ ల తో ఈ సంవత్సరం మిర్చి రైతులను ఇప్పటికే 90% మిర్చి తోటలు నిలువునా ఎండిపోయాను అని ఎన్ని మందులు కొట్టినా తెగుళ్లు అదుపు కావడం లేదని రైతులు దిగులు చెందుతూ మనోధైర్యం కోల్పోతున్నారని వారు అన్నారు.

ఈ యొక్క తెగుళ్లను ప్రకృతి విపత్తు గా ప్రభుత్వం భావించి నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి ఒక లక్ష రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా మిర్చి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, కల్తీ లేని పురుగు మందులు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రైతులు బుర్క సూరయ్య, బెల్లి సుధాకర్, లావుడియ సుమన్ , అజ్మీర తిరుపతి, లింగంపల్లి సత్యం, గుంజ దుర్గయ్య ,బిజ్జ వెంకటలక్ష్మి ,రామదన్, సత్యనారాయణ, నర్సిరెడ్డి, కొమురం న ఉప్పలయ్య, ప్రభాకర్ ,రవీందర్, జాముల రాజు, గట్టి నాగేశ్వరరావు, లక్ష్మన్న ,కొమురయ్య, సంజీవ రావు ,భూక్య సారయ్య, గుగులొతుశ్రీను, చెన్నయ్య, సామల నాగరాజు, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం పాల్గొన్నారు.

భాద్యతలు ఇవ్వడమే ఆలస్యం ‘ప్రక్షాళనలో మునిగిన మంత్రి హరీష్‌

హైదరాబాద్‌ , నేటిధాత్రి : రాజకీయాలన్నాక ప్రతిపక్షాలు అదును చూసి రాజకీయ వ్యూహాలు పన్నుతూనే అధికార పార్టీ నాయకులు చిక్కుకోవాలని చూస్తూనే ఉంటాయి. అలా మంత్రి హరీష్‌రావు మీద ప్రతిపక్షాలు చేసే కుట్రలు కొత్తేమీ కాదు. వారి వార్తలు ఏనాడు నిజమైన దాఖలాలు లేవు. ఎప్పటికైనా నెరవేరకపోతాయా అనుకునే కలలు తీరేవి కాదు.ఎందుకంటే మంత్రి హరీష్‌రావు లక్ష్యశుద్ధి, చిత్తశుద్ది, లక్ష్యసిద్ధి ఎవరికీ తెలియదు. ఆయన ఆశలు, ఆశయాలు వేరు. అన్నీంటినీ కాదనుకొని తెలంగాణ కోసం త్యాగం చేసిన హరీష్‌ జీవితం వేరు. ఇవన్నీ ప్రపంచానికి తెలిసినా, ఎప్పటికప్పుడు మసిబూసి మారేడు కాయ చేయాలని ప్రతిపక్షాలు కుటలు పన్నుతూనే వుంటాయి. ఎప్పుడూ కొత్త ఎత్తుగడలు వేస్తూనే వుంటాయి. తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న వేళ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ పదహారు సీట్లకు గాను, ఏడు మాత్రమే గెలిచింది. అదే సమయంలో హరీష్‌రావు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ను కలవడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి అవాయింటు మెంటు ఖరారైనట్లు వచ్చిన సమాచారం మేరకే కలిసిన సందర్భమది. అది కాస్తా పెద్ద వివాదమైంది. అసలు నిజమేమిటో కేసిఆర్‌కు తెలుసు. హరీష్‌రావుకు తెలుసు. కాని హదీష్‌రావు కన్నీరు పెట్టుకునేంత దాకా అసత్య ప్రచారం సాగింది. సిద్దిపేటలో మహిళా డిగ్రీ కాలేజీ కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ను హరీష్‌రావు కలవడం జరిగింది. అంతే నాటి సీమాంధ్ర మీడియా, కాంగ్రెస్‌ పార్టీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో వుండే రవిచంద్ర ఈ నాటకం ఆడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ దగ్గరకు వెళ్తూ ఉత్త చేతులతో వెళ్లడమెందుకని రవిచంద్ర తెలివిగా హరీష్‌రావుచేతికి బొకే అందించడం జరిగింది. అందులో కూడా రాజకీయ కుయుక్తి వుంటుందని తెలియని హరీష్‌రావు బొకే వైఎస్‌కు అందించారు. అది ఫోటోలు తీసి అప్పటికప్పుడు మీడియాకు అందించి ఒక్కసారి తెలంగాణలో రాజకీయ కుదుపుకు ప్రయత్నించారు. కాని క్షణాల్లో దాన్ని తిప్పికొట్టి, జరిగిందేమిటో ప్రపంచానికి చెప్పి తెలంగాణ ద్రోహుల కుట్రను ఎదుర్శొన్న ధీశాలి హరీష్‌రావు. అంటే నాడు ఉద్యమ నాయకుడైనా కేసిఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టలేక, ఉద్యమం నుంచి దూరం చేయలేక తెలంగాణ (ప్రజల్లో ఆయన నింపుతున్న చైతన్యం చూడలేక ఏన్నో కుట్రలు పన్నారు. అందులో భాగంగా ముందు హరీష్‌రావుకు దూరం చేయాలని చూశారు. కాని కుదరలేదు. ఎందుకంటే మంటత్రి హరీష్‌రావు అంటే కేసిఆర్‌కు ఉండే అనుబంధం గొప్పది.అది తెలియక రాజకీయ గందరగోళాన్ని సృష్టించాలని ఎప్పటిప్పుడూ చేస్తూనే వచ్చారు.

2018  తర్వాత మంత్రి హరీష్‌రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో దాన్ని కూడా చిలువలు పలువలు చేసింది. కేసిఆర్‌కు, హరీష్‌రావుకు దూరం పెరిగితే మాకు లాభమని ఎత్తుగడలు వేసింది. అదీ కుదరలేదు. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకరకమైన వివాదాలు తెరమీదకు తేవడం అన్నది చూస్తూనే వున్నాం. మంత్రి హరీష్‌రావు వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం కూడా చూస్తూనే వున్నాం. తన జీవితం టిఆర్‌ఎస్‌ కంటే ముందు కేసిఆర్‌తో ముడిపడివుంది. అలాంటి కేసిఆర్‌ను కాదనుకునే పరిస్థితి హరీష్‌రావుకు ఏనాడు ఉండదు. తన జీవితాన్ని ఇంతగా తీర్చిదిద్దిన తండ్రి లాంటి నాయకుడిని దూరం చేయాలని కుట్రలు చేస్తూనే వుంటారు. ఆ మాయలో ఎవరూ పడిపోవద్దని, తనకు చెడ్డపేరు తేవొద్దని ఆయన అభిమానులకు కూడా హరీష్‌రావు చెబుతుంటారని ఆయన అనుచరులు అంటున్నారు.

 గతానికి విన్నంగా కొత్త కుట్రలు?

 గతంలో ప్రతిపక్షాలు చేసిన కుట్రలు ఫలించలేదు. కొత్తగా కుట్రలు తెరమీదకు తేవాలని చూశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలను కొత్త అస్త్రాన్ని చేసుకున్నారు. ట్రబుల్‌ షూటర్‌కు ట్రబుల్స్‌ అని కొత్త ప్రచారం మొదలు పెట్టారు. అదే హరీష్‌రావు, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎలా సాధ్యమైందని ముక్కున వేలేసుకున్నారు. మంత్రి హరీష్‌రావు చాణక్యాన్ని పైకి ప్రశంసించకపోయినా, ఆయన ఎత్తుగడలను అంచనావేయడం కష్టమనుకున్నారు. కాని దుబ్బాకతో హరీష్‌రావు మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు2018 ఎన్నికల తర్వాత చాలా కాలం పాటు హరీష్‌రావును దూరం పెట్టారన్న ప్రచారం మరీ విపరీతంగా చేశారు. హరీష్‌రావు మళ్లీ మంత్రి కాగానే కొంత కాలం ఊరుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో మళ్లీ కొత్తకుట్రలకు తెరతీశారు. ఓడిపోయే స్థానాలకు మంత్రి హరీష్‌రావును పంపుతున్నారంటూ, ఎనలేని ప్రేమలను ప్రదర్శిస్తూ, దుష్టనీతిని చూపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ పాత కథను ముందుకు తెస్తూ హుజూరాబాద్‌ విషయంలోనూ అదే విషం చిమ్మారు. అయినా వారి పప్పులు ఉదకలేదు. ఆనక మంత్రి హరీష్‌రావుకు అదనంగా వైద్య ఆరోగ్యశాఖను అప్పగించడంతో కొత్త పంథాను (ప్రతిపక్షాలు ఎంచుకున్నాయి. కొత్త వాదనకు తెరలేపాయి.

ఆరోగ్యశాఖపై అటు అపోహలుఇటు హరీష్‌ పై సానుభూతి పవనాలు

 ఇక ఈటెల రాజేందర్‌ తర్వాత హరీష్‌రావును పక్కన పెట్టేందుకే అచ్చిరాని ఆరోగ్యశాఖను కట్టబెట్టారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అందుకు కొన్ని విషయాలను ఉటంకిస్తూ లేని పోని, వితందవాదాలు చేస్తున్నారు. పుటలకు పుటలు వార్తలు వండించి పత్రికల్లో వార్చుతున్నారు. కనిపించని కుట్రలకు తెరతీస్తున్నారు. గతమంటూ, వర్తమానమంటూ లేని

పోని విషయాలు ముందుకు తెస్తున్నారు. ఈసారి మంత్రి హరీష్‌రావు ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా చూస్తున్నారు. కాని అది జరిగేది కాదు. ఆయన ఎప్పుడూ బెదిరిపోలేదు.

 ప్రస్తుత తరుణంలో కీలక బాధ్యతలు

 ప్రతి దాన్ని ఓ సవాలుగా స్వీకరించే తత్వం వున్న నాయకుడు హరీష్‌రావు. హరీష్‌రావు అంటేనే అంకితభావానికి పేరు. అలాంటి నాయకుడు ఉద్యమమైనా, పోరాటమైనా,

అభివృద్ధి అయినా అన్నింటినీ సమపాళ్లలో చూడడం ఆయనకు అలవాటు. అందుకే ఆయనను పనిరాక్షసుడు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఎప్పుడు సిద్ధిపేటలో వుంటాడో, ఎప్పుడు హైదరాబాద్‌లో వుంటాడో, ఎప్పుడు గజ్వల్‌లో అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటాడో ఎవరికీ తెలియదు. తెల్లారే సరికి సిద్దిపేటలో వుంటాడు. అర్ధరాత్రి హైదరాబాద్‌ చేరుకుంటాడు. ఎప్పుడు తింటాడో, ఎప్పుడు క్షణం కునుకు తీస్తాడో అన్నది ఎవరికీ అర్ధం కానిది. అలాంటి నాయకులు చాలా అరుదు. ఇప్పుడే కాదు ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ జెండా ఎత్తుకున్న నాటినుంచే ఇది అలవాటు చేసుకున్నాడు. అది ఆయన విజయాలకు ఎంతో తోద్చడుతోంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నీటి పారుదల శాఖ మంథత్రిగా ఆయనే చేసిన సేవలు ఉజ్వల కీర్తిని అందించాయి. ఓ వైపు మిషన్‌ కాకతీయ పనులు, మరో వైపు సాగు నీటి ప్రాజెక్టులు. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో అక్కడే హరీష్‌రావు నిద్రలు చేసిన రోజులు కూడ అనేకం వున్నాయి. ఎండనక, వాననక అక్కడే వుంటూ, పనులన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ కొత్త చరిత్ర సృష్టించాడు. నాలుగేళ్లలో ఒక బహుళార్ధక ప్రాజెక్టుకు మించిన ప్రాజెక్టును దగ్గరుండి పూర్తిచేయించాడు. కేసిఆర్‌ కలలు నెరవేర్చాడు. కేసిఆర్‌ కలల రూపాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా నాటి గవర్నర్‌తో హరీష్‌రావు కాదు, కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. అదీ హరీష్‌రావు. అలాంటి హరీష్‌రావుపై ఎన్ని కుట్రలు చేసినా విఫలమౌతున్నాయని, తాజాగా ఆరోగ్యశాఖపై కొత్త వాదనలు తెస్తున్నారు.

హరీష్‌రావు నీటి పారుదల శాఖ మంత్రి అయ్యేదాకా అసలు ఆ శాఖ మంత్రులు ఏం చేస్తారన్నది పెద్దగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే గత నలభై ఏళ్లలో ఎంతో మంది భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసినా, వాళ్లు చెరువులు, కుంటల దగ్గర నీటి సవ్వడులు మాత్రమే చూశారు. హరీష్‌రావు నీటి పరుగులు చూపించాడు. గలగల పారుతున్న కాలువలు చూపించాడు. ప్రతి ఊరులో నిండిన చెరువులు చూపించాడు. చెరువులు ఎండాకాలంలో మత్తులు దుంకేలా చేశాడు. మండు వేసవిలో చెరువుల్లో నీళ్లు చూపించాడు. పల్లెల్లో పచ్చదనం చూపించాడు. పచ్చటి పంటపొలాలకు మళ్లీ వేధిక చేశాడు. కొత్తగా ఆవిష్కరించిన చెరువులు చూపించాడు. తెలంగాణ చెరువుల్లో మాయమైన చేపలను చూపించాడు. మత్స్య పరిశ్రమకు మళ్లీ తెలంగాణలో జీవం పోయడంతో కీలక భూమిక పోషించాడు. ఇప్పుడు కూడా ఆరోగ్యశాఖలో అదే చేయబోతున్నాడు. గతంలో ఏం జరిగిందో ప్రజలు మర్చిపోయేలా చేస్తాడు. కొత్త తరం ఆరోగ్యకల్పనలో నూతన ఆవిష్కరణలు చూపిస్తాడు. సహజంగానే తన నియోజకర్ణ్ల ప్రజలైనా, ఇతరులెవరైనా సరే…. ఆయనకు ఒక్క మెసేజ్‌ పెడితే చాలు వెంటనే స్పందించడం ఆయనకు అలవాటు. కరోనా సమయంలో ఓ జర్నలిస్టు అన్నాహరీషన్నానన్ను కాపాడు అంటూ పెట్టిన మెసేజ్‌తో కదిలి ఆ జర్నలిస్టును కాపాడిని ఘనత హరీష్‌రావుది. ఆయన నియోజకవర్గంలోని ప్రతి ఇంటిలో ఏదో ఒక సాయం కనిపిస్తుంది. ఆయనకు నియోజక వర్గంలోని ఏ కార్యకర్త సమాచారం అందినా సరేక్షణాల మీద వారికి వైద్య సేవలు అందిస్తుంటారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో కరఠరోన బాధితులకు పోషకవిలువలున్న కిట్‌ను అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అలాంటి హరీష్‌రావు ఆరోగ్యశాఖ మంత్రి అయితే ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. కొత్త చర్విత లిఖించవచ్చు. పేదలు ఎంతో భరోసాగా వుండొచ్చు. ఆయన సిద్ధిపేటలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయించాడు. వెటర్నరీ కాలేజీ కూడా ఏర్పాటు జరగనున్నది. ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, నీటి పారుదల శాఖ అంటే హరీష్‌రావు అని ఎలా నిరూపించాడో, ఆరోగ్యశాఖ అంటే కూడా హరీష్‌రావు అని కొన్ని తరాలు చెప్పుకునేలా చేస్తాడనడంలో సందేహంలేదు. కరోనా మూడో తరంగం వస్తుందేమో అన్న సూచనలు అందుతున్న తరుణంలో హరీష్‌రావు కు ముఖ్యమంత్రి అదనపు బాధ్యతలు అప్పగించడంలో ఆయన సామర్థ్యమే కొలమానంగా తీసుకున్నారని చెప్పడంలో సందేహంలేదు. పైగా హుజూరాబాద్‌ ఫలితాల తర్వాత హరీష్‌రావు ప్రాభవం తగ్గుతుందని ఆశించని వారికి కునుకులేకుండా పోయింది. ఏది ఏమైనా తెరాస జెండాను (గ్రామ (గ్రామాన ఎగురవేశాడు. తన నియోజకవర్ల ప్రజల గుండెల్లొ నిండిపోయాడు. అలాంటి హరీష్‌రావుపై పనిగట్టుకొని చేసే కుట్రలు ఎప్పటికైనా ప్రచారాలుగా మాత్రమే మిగిలిపోతాయి. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు హరీష్‌రావుకు మెండుగా ఉన్నాయి.

 

 

కథ కాదు…బాల సుబ్బయ్య జీవితం…..| కౌంటర్‌ విత్‌ కట్టా…

ఒక వ్యక్తి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాడు. దిక్కు లేని వాడయ్యాడు. ఒకనాడు సమాజంలో గౌరవంగా బతికిన బాల సుబ్బయ్య ఇప్పుడు తలదాచుకుని బతకాల్సి వస్తోంది. జాలసుబ్బయ్య ఏ పాపం చేయలేదు. నేరం చేయలేదు. ఒకరికి మోసం చేయలేదు. కాని ఆయన చితికిపోయాడు. చిల్లిగవ్వ లేకుండా భయం భయంగా బతుకుతున్నాడు. ఎప్పుడూ పది మందికి లేదనకుండా, కాదనకుండా అన్నం పెట్టిన బాల సుబ్బయ్య ఆకలికి బాధపడుతున్నాడు. సమయానికి భోజనం లేక కన్నీళ్లు మింగుతున్నాడు. కొన్ని వందల మందికి ఉపాధి కల్పించి, వారి జీవితాలకు వెలుగునిచ్చిన బాల సుబ్బయ్య జీవితం చీకటి చేసుకున్నాడు. తనతోపాటు పది మంది మంచి కోరే బాల సబ్బయ్య పది మందిని చూస్తే పారిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు? కేరుకు పెద్ద మనిషిగా చెలామణి అయ్యే ఓ నేత నిర్వాకం మూలంగా బాల సుబ్బయ్య జీవితం తలకిందులైంది. ఆఖరుకు కుటుంబాన్ని కూడా చూడలేనంతగామారిపోయింది బాల సుబ్బయ్య జీవితంతన జీవితాన్ని ఇలా అంధకారం చేసిన వ్యక్తిని గురించి చెబుతూ, ఉప్పొంగిన కన్నీళ్లను తుడుకుంటూ బాల సుబ్బయ్య బోరున ఏద్చేస్తున్నాడు. ఎలా బతికిన మనిషిని ఎలా అయ్యానని ఆవేదన చెందుతున్నాడు. ఊరు , వాడ , పల్లె తన పట్నంరాష్ట్రం దాటి వచ్చి, మాట కోసం కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి పడుతున్న వేదన మాటల్లో చెవ్పలేనిది.తాను పడుతున్న ఇబ్బందులు, పడుతున్న బాధలు బాలసుబ్బయ్య నేటిధాత్రితో పంచుకున్నాడు.

 కట్టా రాఘవేంద్రరావు; నమస్తేబాల సుబ్బయ్య గారు

బాల సుబ్బయ్య: నమస్తే సార్‌

 కట్టా: ఎలా వున్నారు?

బాల: ఊపిరికి, ఉసురుకు మధ్య ఊగిసలాడుతున్నాను

 –కట్టా: అలా అనకూడదుజీవితమే ఒక పోరాటంఅన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం కొట్లాడి సాధించాలి.

బాల; నేను ఒక వ్యక్తితో అయితే పోరాటం చేయలగిగేవాడినేసార్‌కాని అవతల వ్యక్తి ముసుగులో అక్రమ వ్యవస్థ వుంది. దాన్ని డీ కొట్టలేక, బతకలేక , పారిపోలేక బతుకుతున్నాను. ఆకలిని ఎదుర్శొంటూ బతుకుతున్నాను. సమాజానికి దూరంగా బతుకుతున్నాను. ఒక నాడు గొప్పగా బతికానని చెప్పుకునేందుకు బతుకుతున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. అయినా భయం, భయంగా బతుకుతున్నాను. మంచి వాళ్లు ఇలా బతుకుంటే, నన్ను మోసం చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారు మాత్రం నవ్వుతూ బతుకుతున్నారు. హుజూరాబాద్‌లో నవ్వు నాకు రక్ష్మ నేను నీకు రక్ష అనుకుంటూ, పెంచి పెద్ద చేసిన పార్టీని ఇద్దరూ వదులుకొని, నీతి మంతులుగా తమను తాము (ప్రచారం చేసుకుంటున్నారు. అది చూస్తూ….మంచికి ఈ లోకంలో స్థానం లేదని తెలుసుకొని బతుకుతున్నాను.

.. సార్‌ఆకలిని ఆపుకోలేను. దుర్మార్గాన్ని ఊస్తూ బతకలేను. కాని ఏం చేయగలను. అసమర్హ్భుడి జీవితయాత్ర సాగిస్తున్నాను.

 కట్టా: బాల సుబ్యయ్య ఏమిటీ మీకు జరిగిన అన్యాయం?

బాల సుబ్బయ్య: మాది ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లానేను వదిహేనేళ్లుగా ఎల్‌అండ్‌టి కంపనీలో వని చేశాను. పలు రకాల పనులు చేయిస్తూ వుంటాను. ఒకరోజు నాకు ఓ ఫోన్‌ వచ్చింది. తెలంగాణలో జరుగుతున్న మిషన్‌భగీరథ పనుల్లో పైపుల జాయింట్‌ ఎలా చేయాలన్నది తెలియక కాంట్రాక్టర్లు ఆపసోపాలు పడుతున్నారట. ఆ సమయంలో ఎవరెస్టు కంపనీ నుంచి జనరల్‌ మేనేజర్‌ ఫోన్‌ చేశారు. ఆ ఉద్యోగి నాకు ఇది వరకు పరిచయం. వాళ్లు చేసే కాంట్రాక్టు పనుల కోసం మనుషులు కావాలని చెప్పినప్పుడు పంపించేవాణ్లి. అలా వాళ్లు నాకు తెలుసు. ఒకరోజు ఫోన్‌ చేసి మిషన్‌ భగీరథ పనులు మా కంపనీచేస్తోంది. పైపుల జాయింట్‌ అన్నది ఎలా చేయాలో అర్ధం కావడంలేదు. ఓసారి వస్తే మాట్లాడదామంటే రావడం జరిగింది. వచ్చానుఎలా చేయాలో చూపించాను. దాంతో సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆ పనులు కొంత కాలం చేయించుకున్నారు. తర్వాత ఈ పనులు నువ్వే సబ్‌ కాంట్రాక్టు తీసుకొని పూర్తి చేయమన్నారు. సరే నాలుగు రూపాయలు మిగులతాయి కదా? పైగా మేమే కాంట్రాక్టు తీసుకుంటే పని కూడా త్వరగా పూర్తి చేసుకొని వెళ్లిపోవచ్చు. అని నా మనుషులను రప్పించుకొని, హుస్నాబాద్‌లో ఆఫీసు తీసుకొని పనులు మొదలు పెట్టి పూర్తి చేశాను. అప్పటికే నేను బిల్లుల గురించి అడుగుతూనే వున్నాను. వనులైతే పూర్తి కాని అంటూ వాళ్లు వాయిదా వేస్తూ వచ్చారే గాని, మోసం చేస్తారని ఊహించలేదు. వాళ్లు బిల్లులు ఇవ్వడం లేదనినా దగ్గర పని చేస్తున్నవారికి ఇవ్వకుండా వుండలేను. వాళ్ల వాళ్ల అవసరాలు వారికి వుంటాయి. కుటుంబాల పోషణ కోసమే పనిచేస్తున్నారు. ఇతర మెటీరియల్‌కు డబ్బులు కావాలి. అందుకోసం మా ఊరిలో అప్పులు చేశాను. తెచ్చి ఇక్కడ పనులు పూర్తిచేశారుఇక అప్పుడు మొదలైంది నాకు వాయింపు

 – కట్టా; ముందూ వెనుక ఆలోచించకుండా ఎలా నమ్మారు?

బాల సుబ్బయ్య: కొంత కాలం వారితో నాకు వున్న సాన్నిహిత్యం నమ్మాను. అయితే అప్పుడు నేను మనుషులను పంపడం వరకే నా పని. కాని ఇలా కిరికిరి పెడతారని మాత్రం తెలియదు. మొదట కొన్ని పనులకు బిల్లులు బాగానే ఇచ్చారు. కాని నన్ను నమ్మిస్తున్నారని అనుకోలేదు. నేను మోసపోతానని ఊహించలేదు. అడిగిన సమయానికి బిల్లులు ఇస్తుండడంతో నేను మరింత నమ్మకం పెంచుకున్నాను. వాళ్లు మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని తెలుసుకోలేకపోయాను. మొదట సరిగ్గా ఇచ్చిన వాళ్లు, తర్వాత కాస్త ఆలస్యం చేస్తున్నా గట్టిగా అడగడానికి నాకు మొహమాటం అడ్డం వచ్చింది. అవతల పెద్ద పెద్ద వాళ్లు. కొండా విశ్వేశ్వరరెడ్డి అధికార పార్టీ ఎంపి. పైగా అపోలో ఆసుపత్రులు. ఇన్ని చూస్తూ కూడా వాళ్లు మోసం చేస్తారని అనుకుంటామా? చేసిన వనులకు మరిన్ని పనులు వస్తాయని అనుకుంటామే తప్ప, మోస పోతామని అనుకోంఇదే వాళ్లకు కలిసొచ్చింది. బకరా దొరికాడనుకున్నారు. నాకు నేల నాకించారు. కోలుకోకుండా చేశారు.

  కట్టా: మీకు మోసం చేసిన వ్యక్తి ఎవరు ..?

బాల సబ్బయ్య! నన్ను నమ్మించి మోసం చేసింది మాజీ ఎంపి. కొండా విశ్వేశ్వరరెడ్డి.

  కట్టా: ఎంపి పేరు మీద ఎలాంటి సంస్థ ఉండదు కదా?

బాల : అవును సార్‌ఎవరెస్టు కంపనీ అన్నది కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకు పేరు మీద ఉంది. నాయకులు దేని నుంచైనా తప్పించుకునేందుకు అదే కదా? చేస్తుంటారు. నా విషయంలోనూ అదే చేశారు.

 – కట్టా: నేరుగా ఆయనతో మాట్లాడి ఈ డీల్‌ కుదుర్చుకున్నారా?

 – బాల సుబ్బయ్య?: భలే వారు సార్‌ఆయనతో మాట్లాడడం అన్నది తర్వాత. పెద్ద పెద్ద కంపనీలకు నా లాంటి చిన్న కాంట్రాక్టర్‌ వెళ్లి వాళ్లతో మాట్లాడాల్సిన పరిస్థితి వుండదు. ఆ కంపనీలోనే ఉన్నత స్థానంలో వున్న ఉద్యోగులే అన్నీ మాట్లాడుతుంటారు. మా విషయంలోనూ అదే జరిగింది. కాకపోతే నాకు అన్యాయం జరిగిందన్న సంగతి కొండా విశ్వేశ్వరరెడ్డికి తెలుసు. తెలిసినా ఆయన స్పందించ లేదంటే కావాలనే వాళ్లు అన్యాయం చేస్తున్నారని అర్ధమైంది. దాంతో తేరుకున్న నేను కొండాను కలవాలని ప్రయత్నించగాప్రయత్నించగా ఒకసారి కలిశారు. అప్పుడు సరే సరే అంటూ ముక్తాయించారు. అయినా నాకు బిల్లులు రావడం లేదు. దాంతో మళ్లీ ఆయనను కలిశాను. అయినా నాకు బిల్లులు రాలేదు. దాంతో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌తో 2018 ముందు ఫోన్‌ చేయించాఅప్పుడు కొండా విశ్వేశ్వరెడ్డి ఎమ్మెల్యేను ఆ విషయం నీకు సంబంధం లేదు. వదిలేయ్‌ అన్నాడట. దాంతో ఆ ఆశ కూడా పోయింది. ఎందుకుంటే అప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో వున్నారు. తర్వాత చాలా మందిని కలిశాను. పిడమర్తిరవిని కూడా తీసుకొని రెండుసార్లు కొండా ఆఫీసులకు వెళ్లానుకాని పని జరగలేదు. ఏళ్లు గడిచిపోతున్నాయి. నా అప్పులు పెరిగిపోయాయి. వాటికి మిత్తికి మిత్తి పెరిగి, కోట్లకు చేరుకున్నాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక, ఎలా బతకాలో అర్ధం కాక త్రిశంకు

స్వర్గంలో వున్నాను.

 

కట్టా: అసలు కుటుంబంతో సహాఅన్న నిర్ణయం తప్పు కదా?

 

బాల: మరి ఏం చేయమంటారు సార్‌ఇక నాకు మిగిలిందేమిటి? ఉన్నది పోయింది. అప్పులు మిగిలాయి. సంపాదన ఆగిపోయింది. మరో పని చేసుకోవడానికి వీలు లేకుండాపోయింది. నాకు అనుభవం వున్న పనికి నాకు పెట్టబడి కావాలి. అవి ఎవరు ఇవ్వాలి.

ఎవరి వద్దకు నేను వెళ్లి మళ్లీ అడగాలి. కొత్త వారిని అడగలేను. మా ఊరికి వెళ్లలేను. ఊరిలో మరింత అప్పు చేయలేను. నా భార్యా పిల్లల్ని పైతం ఊరు దాటిపోకుండా కట్టిడి చేసి, ఊరంతా బాల సుబ్బయ్య దివాళా తీశాడని తెలిసిన తర్వాత నాకు ఎవరు సాయం

చేస్తారు? చేసిన వనికే బిల్లులు రాక సతమతమౌతున్నాను. నా బాధ చెప్పుకోవాల్సిన వాళ్లందరికీ చెప్పుకున్నాను. విన్నారు. వదిలేశారు. అందరూ అయ్యో అన్నవాళ్తేకాని సాయం చేసిన వాళ్లు లేరు. మాట సాయం చేద్దామనుకున్నవాళ్లు కూడా మనకెందుకు

అని వదిలేసినవాళ్లేనాకు ఇక్కడ, వాళ్లు తప్ప మరొకరు తెలియదు. మెరపెట్టుకున్నాను. (భతిమిలాడాను. నా పరిస్థితి వివరించాను. అయినా కొండా విశ్వేశ్వరరెడ్డి మనసు కరగలేదు. ఇంకేం చేయమంటారు? ఎలా బతకమంటారు? పూలమ్మిన చోట కట్టెలమ్ముకొనైనా బతకొచ్చు. కాని ఊరు కాని ఊరులో నేను కూలీ చేసుకోలేను. కష్టపడిన సొమ్ము పోయింది. పేరు పోయింది. అప్పులు మిగిలాయి. నా జీవితాంతం కష్టపడినా అంత సొమ్ముసంపాదించగలనా? పెద్ద పెద్ద పనులు చేస్తే కొద్దిగా ఎక్కువ ఆదాయం వస్తుందని కాంట్రాక్టులు చేస్తామే తప్పు మొత్తానికి మునిగిపోయేందుకు ఎవరైనా చేస్తారా? నేను ఇప్పుడు నిండా మునిగి వున్నాను. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన పెద్ద మనిషి మంచిగా వున్నాడు. నేను ఆకలికి అలమటిస్తున్నాను. నా కుటుంబాన్ని పస్తులుంచుతున్నాను. కన్నీళ్లు దిగమింగి బతుకుతున్నానుఇప్పుడు చెప్పుండి, నాకు దారి చూపించండి. కనీసం మీరైనా నా బాధ ఏమిటన్నది తెలుసుకుంటానన్నారు. అలా వినేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. నా కన్నీళ్లను ఆపే శక్తి నాకు కూడా లేకుండాపోయింది. అందుకే ఆ పని చేయాలనుకున్నానుఅలా చేస్తానని కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి భహిరంగ లెటర్‌ కూడా రాశాను. అయినా ఆయనలో స్పందనలేదు. అంటే ప్రాణాలు పోసే ఆసుషత్రులు నడుపుకుంటూ, నా ప్రాణాలు తీసుకుంటానని అంటే కూడా కనికరం చూపించలేదు. అలాంటి వ్యక్తి నీతి, నిజాయితీ, ప్రాంతం, అభివృద్ధి అని మాట్లాడుతుంటే నాకు ఎంత రగిలిపోతుందో చెప్పలేనండి. తప్పులు చేసేవాళ్లు అలా నీతులు చెప్పి మోసం చేస్తారని చెప్పడానికి నా జీవితమే ఒక సాక్ష్యం.

 కట్టా: ఎంత కాలం ఈ అజ్ఞాతవాసం?:

బాల: మరి ఏం చేయమంటారు సార్‌నేను ఏం కూలీ చేయాలి. ఆ అప్పులన్నీ ఎలా తీర్చాలి. అప్పులు తీర్చకుంటే ఇచ్చిన వాళ్లు ఊరుకుంటారా? నా సమస్యలు విని వదిలేస్తారా? అందుకే ఇప్పటికైనా మీ ద్వారా ప్రభుత్వానికి, పెద్దలకు తెలియాలని, నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగొద్దనే మీ దగ్గరకు వచ్చాను. మిషన్‌ భగీరథ బిల్లులన్నీ ప్రభుత్వం ఎవ్పుడో చెల్లించేసింది. కాని (ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తూ, బిల్లులు తీసుకొని, నా లాంటి వాడి కష్టం దోచుకొని పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారి బండారం (ప్రజలు తెలియాలి. ఆ నాయకుడి మాటలు విని ఎవరూ మోసపోవద్దు. కాకపోతే ప్రభుత్వం ఇప్పటికైనా నేను పడుతున్న బాధలు తెలుసుకొని, నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నాకు నేనుగా రాలేదు. నన్ను రప్పించి మోసం చేశారు. అలా నమ్మడమే తప్పు అనుకుంటే ఈ లోకంలో ఇక నమ్మకమనే పదమే వుండదుసార్‌అలా నాలాంటి వాడిని మోసం చేసి, పైకి నీతులు చెప్పే వాళ్లు సమాజాన్ని సర్వనాశనం చేస్తారు సార్‌

 ఆ కట్టా: పది మందికి నిత్యం అన్నం పెట్టిన చేయి, ఆసరా కోసం చూడాల్సివస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా?

 బాల సబ్బయ్య?: లేదు సార్‌నేను మంచిగా వుంటే మరో పది మందికి ఆకలి తీర్చేవాడిని.. ఎంతోమందికి ఉపాధి కల్పించేవాడిని. ఒక్కరు చేసిన మోసం మూలంగా నేను నష్టపోయాను. నన్ను నమ్ముకున్నవాళ్లు మోసపోయారు. నాకు సాయం చేయడానికి అప్పులిచ్చినవాళ్లు నష్టపోయారు. ఇంత మంది జీవితాలు నాశనం చేసిన వ్యక్తి బతికి బాగుపడ్డా, పోయేప్పుడు పట్టుకుపోతారా? ఇంత దుర్మార్మమా? సార్‌కనీసం వాళ్లకు మానవత్వం అన్నదైనా వుండదా? అన్నం తినేప్పుడైనా ఒకరిని మోసం చేసి తింటున్నాన్న బాధ కూడా రాకుండా వుంటుందా? అలాంటి వాళ్లను ఏంమనాలో మీరే చెప్పండి.

 – కట్టా ; ఇంతకీ ఆ కరపత్రాలు ఎందుకు పంచినట్లుఇప్పుడే ఎందుకు పంచినట్లు..?

బాల : ఈ మధ్య కొండా విశ్వేశ్వరరెడ్డి హుజూరాబాద్‌లో కరపత్రాలు పంచారని తెలిసింది. తాను న్యాయం కోసం పోరాటం చేసే వ్యక్తిగా అందులో ఆయన రాసుకోవడం నన్ను రగిలించింది. ఆయన అసలు స్వరూపం ప్రజలకు తెలియజేసేందుకు నాకు ఇదొక వేధిక అనిపించింది. మామూలు సమయంలో జనానికి పెద్దగా ఆసక్తి వుండదు. ఆయన కరపత్రాలు జనం చూశారని తెలిసింది. అలాగేనా కరపత్రాలు కూడా జనం ఆసక్తిగా చూస్తారని అనుకొని, ఆయన బండారం మొత్తం బైటపెట్టాను. నాకు జరిగిన అన్యాయం కూడా ప్రపంచానికి చాటి చెప్పాను. ఓటు అన్నది ఎంతో పవిత్రమైంది. అలాంటి ఓటు ఒక మోసకారి అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను మభ్యపెట్టడాన్ని చూడలేకపోయాను. ఆయన కరపత్రం చూశాక నాకు కూడా ఇదే పని నేను చేస్తే కుక్కకాటుకు చెప్పుదెబ్బలాగా వుంటుందనుకున్నాను. (ప్రజలకు నేను ఎలా మోసపోయానో తెలుస్తుంది. నన్ను కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలా మోసం చేశాడో తెలుస్తుంది. పైగా మోసం చేసే వ్యక్తులు వచ్చి, నీతి, నిజాయితీ అంటూ అబద్దాలు (ప్రచారం చేసి, నన్ను మోసం చేసినల్లే, లక్షలాది మందిని మోసం చేయడాన్ని ఆపాలనుకున్నాను. మోసకారి మాటలు తియ్యగా వుంటాయి. నాకు కూడా ఇలాంటి మాటలే అనేకం చెప్పాడు. అందుకే అలాంటి తేనే పూసిన మాటల వెనుక వుండే విషం గురించి (ప్రజలకు తెలియజేయాలనుకున్నాను. ప్రజలు పొరపాటున కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారి మాటలు వింటే నిండా మోసపోతారని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కరపత్రాలు పంచాను. దాంతో నాకు, హుజూరాబాద్‌ ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నారు.

 కట్టా : నీ కోరిక నెరవేరాలని, మీకు మళ్లీ మంచి రోజులు రావాలని మేమూ కోరుకుంటున్నాము. మీకుమీ బిల్లులు వచ్చి, మీ కుటుంబంతో మళ్లీ మీరు సంతోషంగా బతకాలి ఆల్‌ ది బెస్టు.

బాల: ధన్యవాదాలు సార్‌నాకు ఈ మాత్రం మనో ధైర్యం నిండిందంటే అది మీ వల్లేఎన్నికల సమయంలో నా సమస్య పెద్దల దృష్టికి వెళ్లి నా సమస్యలు తీరితే మీ మేలు ఈ జన్మలో మర్చిపోను.

 

 

సీజె ప్రమాణస్వీకారానికి హాజరైన నేర చరితులు, చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వికారంలో పాస్‌ల జారీపై ఆరోపణలు

ప్రజల హక్కులను కాపాడుతూ , దేశ అభివృద్ధిలో కీలక వ్యవస్థగా ఉండి నిత్యం పాటుపడే అత్యున్నత వ్యవస్థల్లో అతి ముఖ్యమైన న్యాయవ్యవస్థలో సైతం విధివిధానాలు తప్పుదోవపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పులు జరిగితే సరిదిద్దే సుప్రిం వ్యవస్థలోనే ఇలాంటివి చోటు చేసుకోవడం పట్ల ప్రజలు , న్వాయవాదులు తీవ ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలో నేరారోపణలు ఎదుర్కోంటున్న నేతలు కలిసేందుకు అవకాశం కల్పించిన అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం యావత్తు న్యాయవాద వ్యవస్థ పూర్తిగా ఖండిస్తున్నట్లు న్యాయవాదులు బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు. రాష్ట్ర హైకోర్టులో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఎవరిని అనుమతించాలో ఎవరిని అనుమతించకూడదో అధికారులకు తెలిసినప్పుటికి బేఖాతరు చేస్తూ ప్రజల్లో అనుమానాలు ,ఆందోళన రేకెత్తించిలా నడుచుకోవడం మంచిది కాదనే వాదనలు ఉన్నాయి.సోమవారం రాష్ట్ర హైకోర్టు సీజేఐగా జస్టీస్‌ సతీష్‌చం[ద శర్మ ప్రమాణస్వీకారం జరిగింది . కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వాస్‌ల జారీలో సంబధిత ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయ విధంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతుంది. ప్రజలకు న్యాయాన్ని అందించడంలో ప్రజాస్వామ్య రక్షణకు మూలస్తంభంగా ఉన్న న్యాయవ్యవస్థ చీఫ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేర చరిత్ర కలిగి ఉండడంతో పాటు అనేక కేసులు ( రాజకీయేతర) కలిగిన వ్యక్తులను అనుమతించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అనుమతులు జారీ చేయడం వెనుక అధికారుల కారణాలేవైనా ఇది రాజకీయ కార్యక్రమాలు కావనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్ధ ప్రతిష్ట, హుందాతనాన్ని వెక్కిరిస్తుంది సైదం లక్ష్మినారాయణ హైకోర్టు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి నేరారోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తులను ఏ విధంగా హజరవుతున్నారో విఐపి పాస్‌లు మంజూరు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి.

న్యాయ వ్యవస్థ అనేది స్వయం ప్రతిపత్తి వ్యవస్థ కలిగి ఉంటుంది. ఇలాంటీ సమయంలో నేరారోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తులను వ్పీబ్లే ప్రమాణస్వీకారానికి వివిధ రాజకీయ పార్టలకు చేందిన ఎంపీ , ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ , మంత్రులు సహా ఇతర రాజకీయ నేతలు హజరు కావడం వలన ముఖ్యంగా సామాన్య ప్రజల్లోన్యాయవ్యవస్థ పై అప నమ్మకం ఏర్పడటమే కాకుండా న్యాయ వ్యవస్థ ప్రతిష్ట , హుందాతనాన్ని వెక్కిరించే విధంగా ఉంటుంది. రాజకీయ నాయకులు న్యాయమూర్తులను కలవడం ఎంత వరకు సమంజసం

నేటిధాత్రి ఔదార్యం

*అర్ధరాత్రి ఆపదలో ఉన్న అభాగ్యులకు అండ*
*ఏంజీఏం నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలికాకుండా సమయస్ఫూర్తి చాటిన నేటిధాత్రి*

నేటిధాత్ర:ఏల్కతుర్తీ మండలం దండేపల్లి గ్రామానికి చేందిన పోచయ్య అనే వ్యక్తికి బుధవారం రాత్రి సూమారు 8 గంటల సమయంలో ఆయన పనులు ముగించుకుని ఇంటికి వేళ్తున్న క్రమంలో కమలాపూర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.దింతో ప్రమాదంలో తలకు, శరీరంలో పలు చోట్ల తీవ్ర గాయలవ్వడంతో బాట సారులు గుర్తించి ఆంబులేన్స్ కు సమాచారం ఇచ్చారు . ఘటన స్థాలనికి చేరూకున్న ఆంబులేన్స్ భాదితుడు పోచయ్యను వరంగల్ పట్టణంలోని ఏంజీఏం ఆసుపత్రికి తరలించారు. విషయం తేలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. పరీస్థీతీ విషమంగా ఉన్న పోచయ్యకు వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం రేండు ఇంజక్షన్స్ వేసి చేతులు దులుపుకున్నారు. భాదితుడు పోచయ్యకు సీటి స్కాన్ సహా పలు పరిక్షలు అవసరమని చేప్పీ ప్రస్తుతం ఆ సౌకర్యాలు ఇక్కడ లేవని బయట చేయించుకోవాలని సుచించారు .దింతో నీరుపేద కుటుంబం కావడంతో పరిక్షలు చేయించడానికి మా వద్ద డబ్బులు లేవని ఏలాగైనా దయచూపీ పరిక్షలు ఇక్కడే చేయాలనీ ప్రాదేయపడ్డారు. ఐన ఆసుపత్రిలో ఇప్పుడు చేయడం కుదరదనీ మీరు ఆలస్యం చేస్తే వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం జరీగే అవకాశం ఉందని తర్వాత ఏం జరిగినా మాకు సంభందం లేదని తేల్చి చేప్పేసారు . దింతో ఏం చేయాలో దీక్కు తోచని పరీస్థీతుల్లో ఉన్న వారిని గమనించిన విజయ్ నాయక్ అనే వ్యక్తి *నేటిధాత్రి* సంస్థల ఛైర్మన్ కట్టా రాఘవేంద్ర రావుకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి *నేటిధాత్రి* దినపత్రిక బ్యూరో బిర్రు కూమారస్వామికి భాదీతులకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆదేశించారు. దింతో ప్రాణాపాయ పరీస్థీతుల్లో ఉన్న పోచయ్యను ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి సోంత ఖర్చుతో అవసరైన పరిక్షలు జరిపించి తిరిగి ఏంజీఏంలో చేర్పించారు.
*నేటిధాత్రి చూపిన సమయస్ఫూర్తి, సమాజం పట్ల భాద్యతకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తేలిపారు.*

ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్‌గా డాక్టర్ జి ఆర్ సి రెడ్డి

*వరంగల్,నేటిధాత్రి:* ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్‌గా అత్యుత్తమ విద్యావేత్త మరియు పరిశోధకుడు డాక్టర్ జి ఆర్ సి రెడ్డి శనివారం విశ్వవిద్యాలయంలో వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

 

ప్రస్తుత పదవికి ముందు, డాక్టర్ రెడ్డి, ఎన్ఐటి( నిట్) కాలికట్ ఎన్ఐటి(నిట్) గోవా డైరెక్టర్ గా, 2005-2017 కాలంలో వరంగల్, ఎన్ఐటి డైరెక్టర్ ఇన్ఛార్జి గా, ఎన్ఐటి సిక్కిం, ఐఐఐటి కొట్టాయం మరియు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మరియు వైస్-ఛాన్సలర్ శారదా విశ్వవిద్యాలయం గా విధి పూర్తయింది.
తన నియామకం గురించి డాక్టర్ జి ఆర్ సి రెడ్డి మాట్లాడుతూ, “వరంగల్ లోని ఎస్ఆర్ విశ్వవిద్యాలయం యొక్క మొదటి వైస్-ఛాన్సలర్ గా నియమించబడటం ఒక గౌరవం అన్నారు, ఎన్‌ఐఆర్‌ఎఫ్-ఎంహెచ్‌ఆర్‌డి ప్రకారం భారతదేశంలోని టాప్ 160 సంస్థలలో ఎస్‌ఆర్‌యు, తెలంగాణ రాష్ట్రంలో 5 వ స్థానంలో ఉంది(ప్రైవేటు). టైర్ -2 , టైర్ -3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఇది సాధ్యమైంది. ”
ఎస్ఆర్ యూనివర్శిటీ అధ్యాపకులు గొప్పవారు, ప్రపంచ గణన కోర్సులను సృష్టించడం మరియు రూపకల్పన చేయడం. మార్గదర్శకత్వం వహించే విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం మరియు ఉద్దేశ్యాన్ని ముందుకు తీసుకురావడానికి మొత్తం విశ్వవిద్యాలయ సిబ్బందితో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. ”

స్థూల నమోదు నిష్పత్తి గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ “స్థూల నమోదు నిష్పత్తిని సాధించడానికి ప్రభుత్వ సహాయక విశ్వవిద్యాలయాలు సరిపోవు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలని మీరు కోరుకుంటే, ప్రభుత్వంతో పాటు, ప్రైవేట్ విద్యాసంస్థలుపాత్ర కూడా అంతే ముఖ్యమైనది. కఠినమైన పర్యవేక్షణ యంత్రాంగాలతో, కేవలం బోధనా సంస్థలుగా కాకుండా నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ”

“ఈ రోజు, ఎంచుకున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పనితీరు ప్రభుత్వంతో సమానంగా ఉందన్నారు. నిధుల సంస్థలు. కనీస నియంత్రణ జోక్యంతో, మరియు ప్రభుత్వ మద్దతుతో మరిన్ని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ-సహాయక సంస్థల వలె రాణించగలవు. ఈ దిశలో పురోగతిని చూడటం నాకు సంతోషంగా ఉందని ఫలితంగా ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో కొన్నింటికి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (IoE) హోదా ఇవ్వబడింది, ఇది స్వాగతించే దశ ”అని డాక్టర్ రెడ్డి తెలిపారు.

“వరంగల్ ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా పిలుస్తారని అన్నారు. ఎస్ఆర్ విశ్వవిద్యాలయంతో విద్యా కేంద్రంగా దాని స్థానం మరింత బలపడింది. రాజధాని నగరం హైదరాబాద్ వెలుపల ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం ఎస్ఆర్ యూనివర్సిటీ అని గమనించడం హృదయపూర్వకంగా ఉందన్నారు.ఇది గ్రామీణ తెలంగాణలో విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి నిదర్శనమని డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రొఫెసర్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో మేజర్లతో పట్టభద్రుడయ్యాడు. అతను తన ఎమ్మెస్సీ (టెక్) ఇంజనీరింగ్ ఫిజిక్స్ మరియు పిహెచ్.డి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ, ఆర్‌ఇసి (ఎన్‌ఐటి) వరంగల్ నుండి. అతని పరిశోధనా ప్రాంతం ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ పై దృష్టి పెడుతుంది. 1979 లో ఎన్‌ఐటి వరంగల్‌లో భౌతిక విభాగంలో ఫ్యాకల్టీగా చేరాడు మరియు 1995 లో పూర్తి ప్రొఫెసర్‌ అయ్యాడు.

సి.ఎస్.ఐ.ఆర్, ఎంహెచ్ఆర్డి, మరియు డిఆర్డిఓలు మంజూరు చేసిన పలు పరిశోధనా ప్రాజెక్టులలో డాక్టర్ రెడ్డి ప్రధాన పరిశోధకుడిగా ఉన్నారు. వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలు / సమావేశ కార్యక్రమాలలో 80 కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. అతను ఆప్టికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క ఫెలో, SPIE మరియు OSA సభ్యుడు. అతను తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఫెలో కూడా.
ఎస్ఆర్ విశ్వవిద్యాలయం గురించి: 4000మందికి పైగా విద్యార్థులతో, అన్ని బి. టెక్ ప్రోగ్రామ్‌లకు టైర్-1 ఎన్బిఎ అక్రెడిటేషన్ మరియు ఇంజనీరింగ్ మరియు మొత్తం విభాగంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంక్ ఉన్న ఏకైక సంస్థ హైదరాబాద్ వెలుపల ఉన్న ప్రసిద్ధ సంస్థ. న్యూ ఢిల్లి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఎన్‌ఎస్‌టిఇడిబి సహాయంతో ఎస్‌ఆర్‌యు టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (ఎస్‌ఆర్‌ఎక్స్) భారతదేశంలోని టైర్ – II నగరంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్. దీని మైలురాళ్ళు 41 పేటెంట్లు మరియు అధ్యాపకులు మరియు విద్యార్థులు ప్రచురించిన 2000 కంటే ఎక్కువ పరిశోధన కథనాలను కలిగి ఉన్నాయి. నిధుల ఏజెన్సీలు డిఎస్టి, ఎఐసిటిఇ, యుజిసి, జెఎన్‌టియు హైదరాబాద్ మరియు ఇతరులు 52 స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ , ప్రోగ్రామ్‌లను కూడా విజయవంతం చేస్తుంది.

మానవత్వంచాటిన వర్ధన్నపేట ఎస్సై

వరంగల్ రూరల్ జిల్లా,నేటిధాత్రి: రోడ్డు ప్రమాదానికి గురైన బాదితులను పోలీసు వాహనం లో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎస్సై వంశీ కృష్ణ.వివరాల్లోకి వెళితే జిల్లాలోని వర్దన్న పేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం ను కారు ఢీ కొట్టింది .ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వున్న దంపతులు తో పాటు మూడు సంవత్సరాల బాలుడుకి గాయపడ్డారు.కాగా దంపతులో మహిళ తీవ్ర కడుపునొప్పితో(మహిళ గర్భవతి) బాధ పడుతుండటంతో ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ వంశీకృష్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పోలీస్ వాహనం లో మహిళను ఎక్కించి వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

నిబంధనలు పాటించలేదని పెండ్లి పెద్దలపై కేసు నమోదు

బుగ్గారం, (నేటి ధాత్రి):

కరోనా నిబంధనలు పాటించలేదని,పెళ్ళికి 20 మందికి మించి హాజరయ్యారని వధూవరుల తండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళితే….. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని కొత్త ఎస్సీ కాలనీలో బుధవారం వివాహం జరిగింది. అట్టి వివాహానికి అధికారుల అనుమతి ప్రకారం 20మంది మాత్రమే హాజరు కావాలి. కాని పెండ్లికి 20మందికి మించి హాజరయ్యారని, భౌతిక దూరం పాటించలేదని, మాస్కులు ధరించలేదని స్థానిక విఆర్వో గోపాల్ పోలీసులకు పిర్యాదు చేశారు. అతని పిర్యాదు మేరకు బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి వివాహం నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

 

ఎక్కడా కూడా జనాలు మాస్కులు లేకుండా ఉండకూడదని, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని ఎస్సై హెచ్చరించారు. ప్రతి వివాహానికి 20మందికి మించి అనుమతి లేదని, అది కూడా భౌతిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరి ధరించాలని ఎస్సై చిరంజీవి తెలిపారు. మహారాష్ర్ట, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ 28 రోజులు హోమ్ క్వారెంటైన్ పాటించాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరంగా, కోవిడ్ -19 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్సై చిరంజీవి హెచ్చరించారు.

అసాంఘిక కార్యకలాపాల అడ్డా ‘అన్నారం’

అసాంఘిక కార్యకలాపాల్‌ అడ్డా ‘అన్నారం’

ప్రముఖ యాత్రా స్థలం అన్నారం గ్రామంలో యాత్రికులకు ఏర్పరచిన రూములు ప్రేమికులకు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో గ్రామంలోని కొంతమంది ప్రైవేటు రూముల యజమానులు చీకటి దందాకు తెర లేపుతున్నారని అంటున్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామం తెలంగాణలోని ప్రముఖ యాత్రస్థలాల్లో ఒకటి. ఇక్కడ దర్గాకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారని, జాతరకు వచ్చిన భక్తులకు రూములు కిరాయికి ఇవ్వడం కొరకు వందలసంఖ్యలో ప్రయివేటు రూములు వెలిశాయని, ఇందులో కొంతమంది ప్రయివేటు రూముల వారు యాత్రికుల పేరు చెప్పి కొత్త జంటలకు రాసలీలల కొరకు వారి ఏకాంతానికి అనువుగా రూములు ఏర్పరిచి కిరాయిలకు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. వీటి వలన చుట్టూ ప్రక్కల కుటుంబీకులు ఇదేమిటని అడగడంతో వారితో గొడవలకు దిగుతున్నారని అంటున్నారు. నిబంధన ప్రకారం యాత్రాస్థలాల్లో కొత్త జంటలకు రూములు కిరాయికి ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇలాంటి వారికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చినప్పటికీ నాలుగురోజులు మామూలుగానే ఉంటున్నారని, తర్వాత చీకటి బాగోతాలు షరామామూలేనని, తూతూ మంత్రంగా జరుగుతున్నా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు మరింత పగడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రముఖ యాత్రా స్థలమైనా అన్నారం గ్రామానికి ఇలాంటి వాటి వలన తలవంపులు రావడం జరుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎస్‌కె.షబ్బీర్‌

మండల కో ఆప్షన్‌ సభ్యుడు

యాత్రికులకు రూములు కిరాయికి ఇస్తున్నామని చెప్పి ఇలాంటి ప్రేమ జంటలకు కిరాయికి ఇవ్వడం వలన చుట్టుపక్కల కుటుంబాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై పోలీసులు, అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version