సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ….

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ

భాజపా జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

నర్సంపేటలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నర్సంపేట, నేటిధాత్రి:

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ అని వరంగల్ జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధాంతిక నిబద్ధతతో క్రియాశీల రాజకీయాలు నెరుపుతూ ప్రజల మన్ననలు పొందిన పార్టీగా బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. 1980 ఏప్రిల్ 6న దేశ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ మరియు అంత్యోదయ సిద్ధాంత ప్రాతిపదికన ఆవిర్భవించిన బీజేపీ అవినీతి రహిత పారదర్శక పాలనతో దేశ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి సుపరిపాలనకు బాటలు వేస్తే, నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు వికసిత్ భారత్ లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో యువత, మహిళలు, రైతులు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, నర్సంపేట నియోజకవర్గంలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ జూలూరు రోజా రాణి, సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు, కుంభం కోమల్ రెడ్డి, బాల్నే జగన్, దుగ్యాల సమ్మయ్య, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, రూరల్ అధ్యక్షులు తనుగులు అంబేద్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, ఉపాధ్యక్షులు కొంకీసా విగ్నేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత, ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కందగట్ల నాగరాజు, కాసుల నాగేంద్రబాబు, ముత్యాల శ్రీనివాస్, పోనుగొటి రవీంద్ర చారి, పులిపాక అశోక్, శోభన్, చిల్వేర్ అన్వేష్, సామల ప్రవీణ్ కుమార్, ఆముదాల రమేష్, సామల సాయి, నూనె రంజిత్, కట్ల మహేందర్, నరసయ్య, అల్లం నిఖిల్, వేల్పుల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version