ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి బాంబులగడ్డ(సీఆర్ నగర్) ఈద్గా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన బక్రీద్ వేడుకలల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైవాజ్ఞను అనుసరించి సమాజ హితం కోరి ప్రతీ ఒక్కరూ నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందన్నారు. మనకు ఉన్న దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని సూచించారు. అనంతరం పలువురు ముస్లిం సోదరులు ఎమ్మెల్యే జీఎస్సార్ ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం భూపాలపల్లి టౌన్ లో ఎమ్మెల్యే జీఎస్సార్ స్వయంగా పలువురు ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి షీర్ ఖుర్మా(సేమియాలు) రుచి చూసి, బాగుందని కితాబిచ్చారు.