ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా నేడు జడ్పిహెచ్ఎస్ వర్షకొండ లో
ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి
మండలంలోని వర్షకొండ పాఠశాల లోబడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి గ్రామంలో ర్యాలీగా వాడవాడనా తిరుగుతూ బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజేంద్ర అధ్యక్షత వహించారు. గ్రామ సర్పంచ్ ఫోనుకంటి వెంకట్ ముఖ్యఅతిథిగా హాజరైనా ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి 2026 ఫలితాలను గూర్చి ఉపాధ్యాయుడు వివరించారు సమావేశంలో. అందరూ సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎస్సి లో 2026 లో 542 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన బోబిలి .హాసిని,534 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిన మద్దెనపల్లి వైష్ణవి లను గ్రామ సర్పంచి మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం శాలువాలతో సత్కరించారు అనంతరం ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ ని కూడా శాలువాతో సత్కరించారు. రానున్న విద్యా సంవత్సరంలో అధికంగా విద్యార్థులు నమోదు చేయిస్తామని ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పారు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మరియు ఇ వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, విజయ భాస్కర్, శివ కృష్ణ, మమత, మాధురి, సుజాత, స్వామి, మహేష్, మల్లికార్జున్, నరేందర్ గారు పాల్గొన్నారు. వీరితోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
