విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి:

జవహర్ నవోదయ విద్యాలయం చొప్పదండిలో తోమ్మిదివ, పదకొండవ తరగతులకి ప్రవేశం గురించి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో నవోదయ విద్యాలయం ఉపాధ్యాయులు రాయుడు, హరిబాబులు సందర్శించి ఎనిమిదవ తరగతి, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి10వ 2024 తేదీన నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని, దీనికి గాను విద్యార్థిని విద్యార్థులు 2023అక్టోబర్ 31 వరకు ఆన్లైన్ నందు www.navodaya.gov.inలో నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో వేణు కుమార్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శైలజ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *