Villagers Alarmed Over Alleged Attempt to Sell Jain Idols
జైనులకాలం నాటి విగ్రహలను అమ్మేందుకు ప్రయత్నం -ప్రజలు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లి గ్రామంలో 2018 మరియు 2020లో జైనులకాలం నాటి పార్శానాథుడు, వృషభనాథుడు విగ్రహాలు బయటపడ్డయి. అప్పటి జిల్లా కలెక్టర్ మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి వాటిని అక్కడి గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామ పంచాయితీ ఆదినంలో భద్రపరచవల్సిందిగా తెలిపారు. కాని ఇప్పుడు వాటికి సరైనా భద్రత కలిపించక పోవడంతో ఇదే అదునుగా భావించిన కొంతమంది గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంలో ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆలయం నిర్మించి, భద్రత పెంచవల్సిందిగా గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
