హైదరాబాదులో మాజీ ఎంపీ రావులను కలిసిన ఆర్యవైశ్య నేతలు
వనపర్తి నేటిదాత్రి
మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డిని హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర వనపర్తి ఆర్యవైశ్య సంఘం నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ మాజీ కార్యదర్శి కలకొండ రమేష్ చంద్ర ఆధ్వర్యంలో కలిశామని పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు రావులను కలిసిన గోకారం రాజు కృష్ణమూర్తి చిదిరే బెల్లం రాజు కలకొండ కిషోర్ పరమేష్ తిరుమాలాపురం జగదీష్ తదితరులు ఉన్నారని శ్రీనివాసులు చెప్పారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర రాజకీయ కార్యదర్శి కలకొండ రమేష్ చంద్ర వనపర్తి ఆర్యవైశ్య నేతలకు కృతజ్ఞతలు తెలిపారు
