కరీంనగర్, నేటిధాత్రి:
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏఐటియుసి జిల్లా ప్రజాసంఘాల జనరల్ బాడీ సమావేశం కరీంనగర్ లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ దేశంలోని అసంఘటితరంగా కార్మికుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని కోరారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సంస్కరణల పేరుతో నలబై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించేసి కార్మికులు సమ్మె చేసే హక్కుతో పాటు పోరాటాలు చేసి సాధించుకున్న అనేక హక్కులను కాలరాస్తున్నాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని చేయాలని విమర్శిస్తూ రానున్న రోజులో పెద్ద ఎత్తున కార్మిక వర్గంను ఐక్యంచేసి బిజెపి ప్రభుత్వపై పోరాటాలు చేయక తప్పదని హెచ్చరించినారు.
తెలంగాణ ప్రభుత్వం అసంఘటితరంగా కార్మికుల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడి, మధ్యాహ్నం, భోజనం, ఏఎన్ఎం, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ ఇచ్చిన మాటలు అమలు చేయాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రంగాల కార్మికులను ఐక్యంచేసి ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని కార్మిక వర్గం కలిసికట్టుగా ఐక్యంగా పోరాటాల సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా ఆఫీస్ బేరర్స్, కార్యవర్గం కాశేట్టి లక్ష్మయ్య, పిట్టల సమ్మయ్య, పిట్టల శ్రీనివాస్, డి.రజిత, ఏ.రజిత, సాయిలు, రజిత, అంజయ్య, రాజయ్య, కొంరయ్య, నర్సయ్య, శ్రీనివాస్, భాగవతం వీరయ్య, పోశయ్య, ఉమా శంకర్, మామిడి శెట్టి శంకరయ్య, ఐలయ్య, లింగయ్య, బాలయ్య, అన్ని ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.