
BMS President Yadagiri Sathaiah.
సింగరేణిలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయండి
బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 గనిపై సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలోయాదగిరి సత్తయ్య అధ్యక్షులు, యతిపతి సారంగపాణి ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమ పరిరక్షణ కార్మిక హక్కుల సంరక్షణయే లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు,ఉద్యమాలను సింగరేణి కార్మికులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.గతంలో 1.3 లక్షల ఉద్యోగులతో 30 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందని, ప్రస్తుతం 39వేల ఉద్యోగులతో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని కోల్ ఇండియాలో 6.5 లక్షల ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 2 లక్షల ఉద్యోగులతో 800 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు.
ఉత్పత్తిలో పెరుగుదల గణనీయంగా పెరిగిందని, ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిందని అన్నారు.శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ, తక్కువ వేతనం,భద్రత లేని పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులను వినియోగిస్తున్నారు.వారికి కనీస వేతనాలు (హెచ్ పి సి), సురక్షిత పని వాతావరణం, వైద్య సదుపాయాలు,నివాస క్వార్టర్లు లేవు.తెలంగాణ రాష్ట్రం గత 12 సంవత్సరాలుగా కనీస వేతన సవర జరగలేదని సింగరేణిలో కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పటికీ అమలు కాలేదని వెంటనే అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో రాజకీయ జోక్యం విచ్చలవిడిగా పెరిగిందని, సంస్థలు పరిపాలన విభాగం గాడు తప్పిందని అందుకే రాజకీయ జోక్యం తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ట్రాన్స్కో,జెన్కో సంస్థల నుండి బకాయిలు
గత ప్రభుత్వ హయాంలో రూ. 26,000 కోట్లు బకాయిలు ఉండగా,ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఆ మొత్తం రూ. 39,661.57 కోట్లుకి పెరిగిందని విద్యుత్ బొగ్గుబకాయలు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బొగ్గు బకాయిలు రూ.14,743.25 కోట్లు
విద్యుత్ బకాయిలు రూ.24,918.32 కోట్లు చెల్లింపులకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి
ఉద్యోగ భద్రత,బొగ్గు పరిశ్రమల భవిష్యత్తు, సాంకేతిక సామర్థ్యం పరిరక్షణ కోసం కార్మికులు మరియు ప్రజలతో కలసి ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుందని తెలియజేశారు.
జూలై 24 నుండి 31 వరకు బొగ్గు గనుల పైన ద్వారా సమావేశాలు నిర్వహించి కార్మికులను చైతన్య పరచడం.
ఆగస్టు 5 నుండి 14 వరకు కోల్ బెల్టు ప్రాంత గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించడం,ప్రజల అవగాహన కోసం బహిరంగ సభలు నిర్వహించడం.
ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 5 వరకు సింగరేణి కార్మిక వాడలలో బహిరంగ సమావేశాలు,పత్రికా విలేకరుల సమావేశాలు నిర్వహించడం.
సెప్టెంబర్ 15 నుండి జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం.సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.పర్మనెంట్ కార్మికుల సంఖ్య పెంచాలని కనీసం 50% ఉత్పత్తి శాశ్వత ఉద్యోగులతో ఉత్పత్తి జరగాలని విజ్ఞప్తి చేశారు.కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు, సీఎం పిఎఫ్ ఖాతాలు,వైద్యం, క్వార్టర్లు కల్పించాలని,బొగ్గు సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని,కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సీఎం పిఎఫ్ వ్యవస్థను పూర్తిగా ఆన్లైన్ చేసి పెన్షన్ సమస్యలు పరిష్కారం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం రూ.39,661.57 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని,చట్టబద్ధ బొగ్గు గనుల సేఫ్టీ/భద్రతా చర్యలు అమలు చేయాలి.కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి.సింగరేణి,కోల్ ఇండియాలలో యూనియన్ వెరిఫికేషన్ ఒకే విధానంలో జరగాలని,ఏపీ ఈ ఎక్స్ జెసిసి, వెల్ఫేర్,సేఫ్టీ కమిటీల సమావేశాలు నియమితంగా చేపట్టాలి.సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ లపై ఆదాయ పన్ను రియంబర్స్ మెంటు చెల్లించాలని,
తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు జాతీయ ఆందోళన కార్యక్రమాలలో సింగరేణి కార్మికులు భాగస్వామి కావాలని పిలుపునిచ్చినారు.
ఈ కార్యక్రమంలో నాతాడి శ్రీధర్ రెడ్డి ఏరియా ఉపాధ్యక్షులు,సెంట్రల్ సెక్రెటరీ మాదాసు రవీందర్,సెంట్రల్ ట్రెజరర్ ఆకుల హరి, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్,ట్రెజరర్ గూడ శ్రీకాంత్,జాయింట్ సెక్రెటరీ మేకల స్వామి,కట్కూరి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోళ్ళ మహేందర్,ఆర్కె5 ఫిట్ సెక్రెటరీ రామకృష్ణ,అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ చంద్రశేఖర్,టి.కిరణ్ కుమార్,కుంట రాజు,పాగిడి శ్రీకాంత్,చల్ల ప్రశాంత్,బుర్ర అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.