చిట్యాల ఎస్సై పై ఎస్పీకి ఫిర్యా దు చేసిన రైతులు.

Farmers. Farmers.

చిట్యాల ఎస్సై పై ఎస్పీకి ఫిర్యా దు చేసిన రైతులు

భూపాలపల్లి నేటిధాత్రి:

సమస్యలను పరిష్కరించాలని చిట్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే ఎస్సై తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చిట్యాల మండలానికి చెందిన రైతులు మంగళవారం జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
చిట్యాల మండలం చింతకుంట రామయ్య పల్లి కి చెందిన అబ్బెంగుల రాజయ్య ,కైలాపూర్ కు చెందిన బూదారపు మార్కండేయ ,చల్లగరిగే కు చెందిన ఇంచర్ల లక్ష్మీ అనే ముగ్గురు రైతులు చిట్యాల ఎస్సై శ్రావణ్ కుమార్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కు ఫిర్యాదు చేశారు..అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఇంచర్ల లక్ష్మి మార్కండేయ అనే రైతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా భూమిని వేరే వాళ్ళు దున్నుకుంటున్నారు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా ఎస్సై తమని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు…ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోని తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు జిల్లా ఎస్పీని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!