వరకట్నం నిషేధించాలి…
వరకట్నం ఒక మూఢత్వం…
వరకట్నం తీరని దాహం…
వరకట్నం లేని సమాజాన్ని నిర్మిద్దాం…
వరకట్నం ఒక సామాజిక రుగ్మత…
వరకట్న నిషేధిత చట్టాలను కఠినంగా అమలు చేయాలి…
వరకట్నం మహిళల గౌరవానికి భంగం కలిగిస్తుంది…
ఆడపిల్ల తల్లిదండ్రులకు పట్టిపీడిస్తున్న రాకాసి వరకట్నం…
స్త్రీకి పురుషునితోపాటు సమానంగా ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కల్పించాలి…
వరకట్న పిశాచానికి బలైపోతున్న మహిళలను కాపాడాలి…
మహబూబాబాద్ గార్ల నేటి ధాత్రి:
వరకట్నం సమాజానికి ఒక చెడు అలవాటు. వరకట్నాన్ని పూర్తిగా నిషేధించాలి. వరకట్నం కారణంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
వరకట్నం అనేది మహిళల గౌరవానికి భంగం కలిగిస్తుంది.వరకట్నం ఇవ్వడం,తీసుకోవడం నేరం అని చట్టాలు చెబుతున్నప్పటికీ అది ఇంకా కొనసాగుతుంది.వరకట్నం అనే దురాచారాన్ని రూపుమాపడానికి ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలి.
దేశవ్యాప్తంగా వరకట్న నిషేధిత చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలి, మరియు చట్టాలను ఉల్లంఘించిన వారికి తగిన శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరకట్నం వలన కలిగే నష్టాల గురించి ప్రజలకు గ్రామస్థాయిలలో అవగాహన కల్పించాలి.
వరకట్నం ఒక సామాజిక రుగ్మత, కాబట్టి దీన్ని రూపుమాపడానికి సామాజిక మార్పు అవసరం. వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడటం అంటే మహిళల హక్కుల కోసం పోరాడటం.
ఇది సమాజంలో మార్పును తీసుకురావడానికి మరియు మహిళలకు మరింత సురక్షితమైన,గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఒక ముఖ్యమైన అడుగు.
వరకట్నం అనేది పెళ్లికూతురు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి భూమి, నగలు, డబ్బులు ఇచ్చే సాంప్రదాయం.యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడసాగాడు.
ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం,భార్యను హింసించడం,భార్యలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. స్త్రీ సాధికారత అభివృద్ధి పథంలో పయనిస్తున్న వరకట్న ఆచారం ఇంకా ఉంటూనే ఉంది.
వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గృహహింస, వరకట్న వేధింపులను సాక్షాలతో నిరూపించగలిగితేనే భర్తకు, అత్తమామలకు, ఆడపడుచులకు శిక్ష పడుతుంది.
అయితే దీన్ని అణువుగా చేసుకొని చాలామంది భర్తలు వారి భార్యలను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తూ పరోక్షంగా వారి పుట్టింటి నుంచి ధనాన్ని రాబట్టుకోవడం చేస్తున్నారు.
భారతదేశంలోని ఉత్తర మరియు తూర్పు రాష్ట్రాల్లో వరకట్న సంబంధిత హింస రేట్లు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో మహిళలపై జరుగుతున్న హింసకు వరకట్నం ప్రధాన కారణమని భావిస్తారు.
వరకట్నం అనేది కాలక్రమేణా పిశాచిగా మారింది. చాలా సందర్భాలలో వివాహ సమయంలో వరుడి తరపు వారు లాంచనాలను తీర్చడానికి వధువు తరపు వారు తహతకు మించి చేసే ప్రయత్నంలో కుటుంబం ఆర్థికంగా చితికి పోతుంది.
దేశంలో వరకట్నం, వరకట్న సంబంధిత నేరాల కట్టడికి కఠిన చట్టాలను తీసుకువచ్చిన ఆ దురాచారాల వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం జరుగుతున్న దేశవ్యాప్తంగా అబలల అక్రందనలు మాత్రం ఆగడం లేదు.
ఆ తరహా హత్యలు నిరంతరం పెరుగుతుండటమే దానికి నిదర్శనం. వరకట్న పిశాచానికి బలైపోతున్న మహిళలను కాపాడాలి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక హింస, హత్యలు, ఘోరాలు అరికట్టాలి.
యంత్ర నార్యంన్తు పూజ్యంతే తంత్ర దేవత అని ఆడవారిని గౌరవించాలని పుణ్యభూమిగా చెప్పుకుంటున్న భరత గడ్డపై వరకట్న బాధితురాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేయని వారు లేరు.
ఆ గర్భ శ్రీమంతుల నుంచి పేద,మధ్యతరగతి వరకు ఏ ఒక్కరిని వదలని సమస్యయే వరకట్నం. ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుదల శాతానికి దాదాపు సమాన స్థాయిలో వరకట్న వేధింపు కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
వరకట్న నిషేధిత చట్టం దుర్వినియోగానికి పాల్పడుతుంది. వరకట్నం నిషేధించాలంటే సమాజంలో స్త్రీకి పురుషునితో పాటు సమానంగా ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కల్పించాలి. వరకట్న నిషేధిత చట్టాలను పకడ్బందీగా అమలు పరచాలి.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న యువత వరకట్న విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతుంది.
యువత ఇప్పటికైనా మేల్కొని హోదా,ప్రతిష్ట ఇవన్నీ వదిలేస్తే వరకట్న దురాచారాన్ని పూర్తిగా అరికట్టవచ్చు. వరకట్నం దురాచారాన్ని కలిసికట్టుగా అంతమందించాలి.ఇందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.