కోట గుళ్ళలో ఎంపీడీవో దంపతుల పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గణపురం ఎంపీడీవో ఎల్ ,భాస్కర్, అనసూయ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి, పూజలు నిర్వహించారు. కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు నాగరాజు వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.