గండ్ర దంపతులకు బాల రాముడి చిత్రపటాన్ని బహుకరించిన అభిమాని
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం సూర్య నాయక్ తండా వాస్తవ్యులు, గండ్ర దంపతుల వీరాభిమాని తిరుపతి నాయక్ ఇటీవల సూర్యనాయక్ తండా నుండి అయోధ్య సైకిల్ యాత్ర ముగిం చుకొని వచ్చి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు వరం గల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కలిసి బాల రాము డి చిత్ర పటాన్ని బహుకరిం చారు.ఈ సందర్భంగా తనతో పాటు తిరుపతి పాదయాత్ర చేయడమే కాక, సూర్య నాయక్ తండా నుండి అయో ధ్య సైకిల్ యాత్ర చేసి విజయ వంతంగా పూర్తిచేసుకున్న తిరుపతి దంపతులను శాలువాతో సత్కరించారు.