స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి.

Elections Elections

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి

మాజీ సిఎం కె.సి.ఆర్ కు అండగా ఉండాలి

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నెటిదాత్రి :

 

ఘనపూర్ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు
బి.ఆర్.ఎస్ ఘనపూర్ మండల ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు రాళ్ళ.కృష్ణయ్య నివాసంలో నిర్వహించారు
ఈ సమావేశం లోముఖ్య అతిథిగా నిరంజన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశరు ఈ సందర్భంగా.మాజీ మంత్రి మాట్లాడుతూ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పి టిసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలతో టాచ్ లో ఉండాలని సూచించారు మండల బీ ఆర్ ఎస్ నాయకులు గ్రామాలలో పర్యటించి ప్రజలతో కలవాలని 19నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజల మన్ననలను పొందిన నాయకులను గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని అన్నారుపార్టీ పట్ల నిబద్ధత,నాయకుని పట్ల విశ్వాసం ఉన్న నాయకులకు బీ ఆర్ ఎస్ పార్టీ అవకాశం ఇస్తుందని అన్నారుపార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు సహకరించే నమ్మకద్రోహుల పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చా రు ప్రజలు స్థిర నిర్ణయానికి వచ్చినారని మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హయాములో రాష్ట్ర అభివృద్ధి జెరిగింద ని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎట్లా నిర్వీర్యం అయినాయో స్పష్టమైన అవగాహనతో ప్రజల కు తెలుసు నాని అన్నారు ఎప్పటికప్పుడు గ్రామాలలో ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ వారికి అండగా నిలవాలని నిరంజన్ రెడ్డి ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,మాజీ మార్కెట్ ఛైర్మెన్ లక్ష్మారెడ్డి,మాజీ జేడీపీ టి సి సామ్యా నాయక్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ బాలేశ్వర్ రెడ్డి, ఎస్.టి సెల్ జిల్లా నాయకులు జాతృ నాయక్,మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామాల అధ్యక్షులు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!