ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కోరుట్లలో స్వాగతం పలికిన జువ్వాడి నర్సింగ్ రావు
మెట్ పల్లి జూన్ 4 నేటి ధాత్రి
జువ్వాడి నర్సింగరావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
కోరుట్ల నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామికి కోరుట్ల పట్టణ సాయిబాబా దేవాలయం వద్ద స్వాగతం పలికి ఆరపేట గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మెట్ పల్లి పట్టణంలో గల జువ్వాడి నర్సింగ్ రావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటుచేసిన తేనేటి విందులో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు అనంతరం
ఆర పేటలో వై కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాలలా గర్జనలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు సభ్యులు కీ”శే” గడ్డం వెంకట స్వామి చిత్రపటానికి పూల మాలాలు వేసి నివాళులర్పించి
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ని శాలువాతో సత్కరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మాలల గర్జన కార్యక్రమానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.