సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ కేంద్రంలో.

Police Parade Center Police Parade Center

సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుక

వేడుకలో పాల్గొన్న, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని జిల్లా పోలీస్ పరేడ్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పాల్గొని భారత త్రివర్ణ పతాక జెండా ఆవిష్కరించడం జరిగినది. తదనంతరం పోలీస్ పరేడ్ వందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ.

 Police Parade Center
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది. అంతేకాకుండా ఎందరో అమరుల త్యాగం వల్ల సిద్ధించిన తెలంగాణ, నేడు ప్రజా పాలన వ్యవస్థగా పురుడుపోసుకున్నదని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి, ప్రభుత్వం ద్వారా, పాలకుల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే ప్రతిఫలాలు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని.
 Police Parade Center
అంతేకాకుండా జిల్లాను విద్యా,వైద్య, ఉపాధి కల్పనలో ముందుండడానికి ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!