ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలి.

Operation Operation

ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలి..

ఎర్రజెండాను రూపుమాపడం బిజెపికి పగటి కలే..!

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్

సిపిఐ పార్టీ అంటేనే పేద ప్రజలకు కొండంత బలం…

జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్..

నాలగోసారి సిపిఐ పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాస్…

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

సిపిఐ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణ మూడవ మహాసభలు పట్టణంలో ఘనంగా జరిగాయి.రాజీవ్ చౌక్ చౌరస్తా నుండి సూపర్ బజార్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, రైల్వే స్టేషన్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ లో సిపిఐ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. నాలుగోసారి పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలOperation

అనంతరం వారు మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతమొందిస్తుందని, ఏకపక్ష దాడులు చేస్తూ మావోయిస్టులు లేకుండా చేస్తామనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం విడనాడాలని బిజెపి ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో విఫలమవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంఆరు గ్యారెంటీ పథకాల హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.గతంలో రామకృష్ణాపూర్ పట్టణ అభివృద్ధిలో సిపిఐ పార్టీ పాత్ర కీలకమైందని, ప్రస్తుతం అప్పటి అభివృద్ధి పనులే ఇంకా ఉన్నాయని, నేటి పాలకుల అభివృద్ధి శూన్యమని అన్నారు.  సిపిఐ పార్టీ అంటేనే పేద ప్రజలకు కొండంత బలం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా పోరాల్సిన సమయం ఆసన్నమైందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్, వనం సత్యనారాయణ, ఇప్పకాయల లింగయ్య, రేగుంట చంద్రశేఖర్, లింగం రవి, దాగం మల్లేష్, మిట్టపల్లి పౌల్, మామిడి గోపి, గోపు సారయ్య, కాదండి సాంబయ్య, మణెమ్మ, రాములు రాజేశ్వర్, ఏఐటియూసీ ఫిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, హరి రామకృష్ణ, ముకుంద రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.Operation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!