సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
• మొబైల్ ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు
• లోన్ అప్ లను నమ్మొద్దు
• ఇంచార్జ్ ఎస్ఐ సృజన
నిజాంపేట నేటి ధాత్రి:
ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది సైబర్ నేరగాళ్ళు నూతన పద్దతిలో ప్రజలను మోసం చేస్తున్నారని నిజాంపేట ఇంచార్జ్ ఎస్ఐ సృజన అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మాట్లాడుతూ.. ఎవరైనా కొత్త వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం.. మీ ఫోన్ కీ ఓటీపీ వచ్చింది. చెప్పండి అంటూ ఫోన్ చేస్తే నమ్మవద్దన్నారు. అలాగే లోన్ అప్ ల వేధింపులకు చాలా మంది బలివుతున్నారని ఎవరు కూడా లోన్ అప్ లను నమ్మవద్దన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే 1930కు కాల్ చేయాలన్నారు.