పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం.

provide food provide food

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు పన్నెండు రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని, ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు, సేవా కార్యక్రమాలు చేసిన ప్రతీ ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సోలీస్ ఐకేర్ వారికి ఇతర దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, వచ్చే ఏడాది మేడారం మహా జాతర జరిగినన్ని రోజులు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!