వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం….

Railway Station. Railway Station.

వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం….

న్యూ భారత్, న్యూ వరంగల్ రైల్వే స్టేషన్..

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో బాగంగా పునరాభివృద్ది చేయబడిన వరంగల్ రైల్వే స్టేషన్,

నూతన హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం

వరంగల్, నేటిధాత్రి.

 

 

దేశ వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృధి చేసిన దాదాపు 103 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గురువారం వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్‌ పథకంలో రూ.25.41 కోట్లతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వే స్టేషన్ ను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.

Railway Station.
Railway Station.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి కే అరుణ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర రెవెన్యూ, పౌర సరఫరా, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ…

Railway Station.
Railway Station.

 

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తీవ్ర కృషి చేస్తున్నారు అని, అందులో భాగంగా రైల్వే శాఖను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రైల్వే స్టేషన్లను నూతన హంగులతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసాం అని అన్నారు. రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం ద్వారా సామాన్యులందరీకి అన్ని సదుపాయాలని కల్పించే విధంగా రైల్వే స్టేషన్ పునరుద్ధరించారు.

Railway Station.
Railway Station.

 

2014కు ముందు రైల్వే బడ్జెట్కు కేటాయించిన బడ్జెట్ కంటే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ చాలా ఎక్కువ అని, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు నాయకత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇక్కడి నాయకులతో కలిసి పనిచేసిన బంధం, అనుభవం నాకుందని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. వరంగల్ ప్రజలకు రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పార్లమెంట్ సభ్యులు డి.కె. అరుణ, ఈటల రాజేందర్ మాట్లాడుతూ..

Railway Station.
Railway Station.

 

 

నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఈరోజు పునఃప్రారంభమైన మన వరంగల్ రైల్వే స్టేషన్ అని అన్నారు. ఎయిర్పోర్టులను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్నాయి అని, స్వతంత్రం వచ్చినప్పుడు నుండి 2014 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాల కాలంలో అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈరోజు పునఃప్రారంభమైన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ ఇలా 103 రైల్వే స్టేషన్లు అని వారు అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది.

Railway Station.
Railway Station.

 

 

రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు కానీ అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందితే దేశం బాగుపడుతుందని చెప్పి మోడీ భావిస్తున్నారు అని తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Railway Station.
Railway Station.

 

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానజీ, సౌత్ జోన్ రైల్వే జిఎం, స్థానిక కార్పొరేటర్ అనిల్, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, ఖిలా వరంగల్ తహసిల్దార్ నాగేశ్వర్ రావు, రైల్వే అధికారులు, రైల్వే టెక్నికల్ సిబ్బంది, వీరితో పాటు .

Railway Station.
Railway Station.

 

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్, వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి రాజేశ్వరరావు, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవి కుమార్, బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Railway Station.
Railway Station.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!