నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి.

Agriculture Officer Somalingareddy Agriculture Officer Somalingareddy

— నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో విత్తన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలను విక్రయించిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలనీ, స్టాక్ బోర్డులను షాపులలో ప్రదర్శించాలని సూచించడం జరిగిందన్నారు. రోజువారి క్రయ, విక్రయాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
30 క్వింటల్ల వరి విత్తనలు స్వాధీనం
మండలంలోని కల్వకుంట గ్రామంలో ఆదివారం గుర్తింపు లేని ప్రదేశంలో ఉంచిన 30 క్వింటల్ల వరి విత్తనాలను స్వాధీన పరుచుకుని నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన రైన్బో అగ్రిటెడ్ సీడ్స్ కు సంబంధించిన మోహన్ అనే డీలర్ పై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేయడం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!