రైతులకు విశిష్టత కార్డు తప్పనిసరి
నెక్కొండ నేటి ధాత్రి:
రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు విశిష్ట కార్డు రైతులకు ముఖ్యమని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర లో రైతు విశిష్ట కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి నాగరాజు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కిసాన్ యోజన తో పాటు ఎరువులు విత్తనాలు కొనుగోలు కేంద్రాల్లో పంటలు అమ్ముకున్న రోజున ఈ విశిష్టత కార్డు ప్రభుత్వం తప్పనిసరి అనే విధానాన్ని కల్పించ నున్నదని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నూతన విధానాన్ని రైతుల కోసం ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రైతు విశిష్టత రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు, కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి వసంత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.