ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి
మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి
నిజాంపేట, నేటి ధాత్రి:
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో ని నస్కల్, నంద గోకుల్, రాంపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తెలిపారు లారీలు, హమాలీలు, టార్పినల్ కొరత లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీలత, వి ఏ లు మంగ, వాణి, రైతులు తదితరులు పాల్గొన్నారు