మే 20 న జేరిగే సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలి
వనపర్తి నేటిధాత్రి :
శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు మండల సదస్సు బి. కవిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులు ,రైతు ,కూలీల కర్తవమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు , వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ భారత్ బందుకు పిలుపునిచ్చాయని అన్నారు. దేశంలోని నూటికి 90 శాతం ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నదని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కార్మికులు మే 20 న తలపెట్టిన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని కేంద్ర ప్రభుత్వ విధానాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. . ఈ సదస్సులో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, వనపర్తి అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షులు జి. జ్యోతి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు బాల కిష్టమ్మ ,సరళ, నారాయణమ్మ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సానిటరీ వర్కర్స్ అధ్యక్షులు మౌలాల్, నాయకులు ఎన్. కురుమూర్తి, బోన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పరమేశ్వర చారి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు