భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం.!

Award Award

భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 అందుకున్న డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి పెళ్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గిన్నారపు ఆదినారాయణపశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో భారతీయ భాషా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 కార్యక్రమంలో తెలుగు భాష నుండి డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ లోహియా అవార్డును బహూకరించారు.భారతీయ భాషలు, సాహిత్యంలో కృషి చేసిన యువ పరిశోధకులు, రచయితలను సత్కరించే ఈ కార్యక్రమంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ సేవలను కొనియాడారు. ప్రొఫెసర్ అనురాధ లోహియా మాట్లాడుతూ, “ఈ యువ అవార్డు గ్రహీతలు భావి సమాజ చైతన్యానికి మార్గదర్శకులు. వీరి సాహిత్య కృషి భారతీయ భాషల సంరక్షణ, ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది,” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో భారతీయ భాషా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కుసుమ్ ఖేమాని, డైరెక్టర్ శ్రీ శంభునాథ్, ఉపాధ్యక్షులు ప్రదీప్ చోప్రా, సుశీల్ కాంతి తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (పార్ట్‌టైమ్)గా సేవలందిస్తున్నారు. కవిగా, రచయితగా గుర్తింపు పొందిన వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి దళిత ఆత్మకథలపై డాక్టరేట్, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంపై ఎం.ఫిల్ పూర్తిచేశారు. ‘నానీల సుగుంధం’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించిన ఆయన, యుజిసి కేర్ లిస్టెడ్ పరిశోధన పత్రికలతో పాటు దిన, మాస పత్రికల్లో అనేక వ్యాసాలు, కవితలు రాశారు.తెలుగు భాష, సాహిత్యంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిదాయకమని, ఈ అవార్డు వారి పరిశోధన, సాహిత్య సేవలకు గుర్తింపు గా నిలుస్తుందని భారతీయ భాషా పరిషత్ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!