బాధ్యతలు స్వీకరించిన తాహశీల్దార్ రాజేశ్వరి
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల తాహశీల్దారుగా బి.రాజేశ్వరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీల్లో భాగంగా రామడుగులో పనిచేసిన వెంకటలక్ష్మి కొత్తపెల్లి మండల తహశీల్దార్ గా బదిలిపై వెళ్ళగా మానకోండూరు మండల తాహశీల్దారుగా పనిచేసిన బి.రాజేశ్వరి రామడుగు తాహశీల్దారుగా బదిలీపై వచ్చారు. ఈసందర్భంగా కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.