కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Chairman Chairman

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
.. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. .

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయిస్తే రైతులకు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్లు కుస్తీ సిద్ధిరాములు, దండు రమేష్ తో పాటు మెట్టు ప్రకాష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!